బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
565 views
11 hours ago
పెద్దన్న అమెరికా యుద్దోన్మాదం ప్రపంచ దేశాల శాంతికి తీవ్ర విఘాతంగా పరిణమించిన వైనం! లేదా ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే ఈ ఉన్మాద,పైశాచిక యుద్ధం వద్దు - శాంతి ముద్దు! మరోసారి పెద్దన్న అమెరికా తన యుద్దోన్మాదానికి తేరలేపి,ఇజ్రాయిల్ దేశాన్ని సైతం ఈ పాపంలో పాలుపంచుకునేలా చేసి మరీ ఇరాన్ దేశంపై తమ సైనిక బలగాలతో,బాంబులతో,క్షిపణులతో విరుచుకుపడుతుండటం అత్యంత బాధాకరం.దీంతో ఇరాన్ దేశానికి ఆర్థికంగా తీవ్రంగా చేకూరడమే కాదు, వందలాది మంది ఇరాన్ దేశపు పౌరులు,సైనిక బలగాలు మృత్యువాత పడటమే కాదు,అనేకమంది తీవ్ర గాయాల పాలుఅవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అంతేకాదు అందులో భాగంగా అమెరికా బలగాలు ఏకంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీని సైతం హతమార్చారు.దీంతో తామేమి తక్కువ తినలేదు అన్నట్లుగా ఇరాన్ దేశం లెబనాన్,ఇరాక్ కు చెందిన పలు మిలిటెంట్ గ్రూపుల సహాయంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్టావరాలపైన సైతం అత్యంత తీవ్ర స్థాయిలో దాడులకు దిగి క్షిపణులు,డ్రోన్లను ప్రయోగించింది.దీంతో ఇజ్రాయిల్ దేశానికి చెందిన పలు నగరాలు సైతం బాంబు క్షిపణి దాడులతో దద్దరిల్లడం అనేది ఈ యుద్ధం యొక్క తీవ్రతను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది.అయితే పెద్దన్న అమెరికా ఇరాన్ పై తలపెట్టిన ఈ బీకర యుద్దానికి బ్రిటన్,ఫ్రాన్స్,జర్మనీ దేశాలు అమెరికా దేశానికి మద్దతుగా నిలుస్తుండటం మూలాన మరింతగా ఆ దేశానికి కొండంత బలం చేకూరినట్లయింది.ఇది ఇలాఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం గురించి మాట్లాడుతూ ఇరాన్ పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయని,అవసరం అయితే ఇరాన్ పై మరింత పోరుకు మేము సిద్దమని ప్రకటిస్తూనే,మరొక వైపు ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు కూడా తాను సిద్దమని,యుద్ధం చేయడం అనేది తమకు కూడా బాధాకరమైన విషయమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని ఆయన కుండలు బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని ఈ స్థాయిలో సెలవిచ్చారు.ఒక్క ఇరాన్ దేశంపైనే గాక లెబనాన్ పై సైతం అమెరికా, ఇజ్రాయిల్ దేశాల సైనిక బలగాలు తమ ప్రతాపం చూపుతుండటంతో ఇప్పటికే వేలాదిమంది లెబనాన్ పౌరులు నిర్వాసితులుగా మారారు.అన్నింటికిమించి ఇలాంటి యుద్దోన్మాద కార్యకలాపాలు ఏ దేశానికి కూడా మంచిది కాదు.ఎందుకంటే ఇలాంటి అనాగరిక, మూర్కత్వపు,కిరాతక యుద్దాల మూలాన యుద్ధంతో సంబంధం ఉన్న అయా దేశాలకే కాదు యావత్ ప్రపంచ దేశాల శాంతికి కూడా తీవ్రంగా విఘాతం ఏర్పడటం తథ్యం.ముఖ్యంగా మత చాందసవాదం, అధిపత్య,అహంకార ధోరణి,ప్రపంచ దేశాలపై ఓక నియంతలా పెత్తనం చెలయించాలానే దురాశ, దుర్బుద్ది,కకృతి నైజం ఇలాంటి చెడు ధోరణితో కూడిన అవలక్షణాలు వెరసి ఇలాంటి బీకర,మారణహోమంతో కూడిన యుద్దాలకు నడుం బిగిస్తున్నారు అయా దేశాల అధ్యక్షులు అనే మాట సత్యదూరం కాదు. ఏదిఏమైనా ఇలాంటి వినాశపూరితమైన యుద్దాల మూలాన కేవలం యుద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దేశాలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయా దేశాల ప్రజలపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడి చమురు,క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటడం తద్వారా ప్రపంచ దేశాలలో డీజల్,పెట్రోల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడమే కాదు,నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఈ భీకర యుద్ధం మూలాన సామాన్యులకు అందుబాటులో లేకుండా ఎడా పెడ భారీగా పెరిగిపోయి ఆయా దేశాల ప్రజల నెత్తిన ఓ అతి పెద్ద గుదిబండలా,ఓ తలపోటులా సైతం పరిణమించడం తథ్యం.ఏమైనా ఇప్పటికైనా ప్రపంచ శాంతిని కోరుకునే ఐరాస ప్రతినిధులు,అదే మాదిరి శాంతి కాముఖులుగా పేరొందిన అయా దేశాల అధ్యక్షులు తమ వంతుగా ఓ ప్రత్యేక చొరవ చూపి, మానవతా దృక్పథంతో ఈ మారణహోమాన్ని,హింస,అశాంతి,అలజడితో కూడిన ఈ రక్తపు పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మనసా, వాచ,కర్మణ విశేషకృషి సల్పి ప్రపంచ దేశాల ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ పైశాచిక యుద్దోన్మదానికి చరమగీతం పాడేల యుద్ధప్రాతిపదికన వారంతా భగీరథ ప్రయత్నం గావించాలి.ప్రపంచ శాంతి వర్ధిల్లాలి!యావత్ మానవాళి మనుగడ ఎలాంటి చీకు,చింతలు లేకుండా,ఓ ప్రశ్నార్థకం కాకుండా సాగిపోవాలి!నిలువెల్లా రక్తంతో తడిచే ఈ యుద్ధక్రీడకు శాశ్వత ప్రాతిపదికన ముకుతాడు,సంకెళ్లు వేసితీరాలి !✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అమెరికా