బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
615 views
1 days ago
తెలుగు వారి తెలుగు సంవత్సరాది మొదటి పండుగ అయిన ఉగాదికి స్వాగతం - సుస్వాగతం! ( 19 - 3 - 2026)! లేదా ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు,మరెన్నో చారిత్రాత్మిక అంశాలతో మిళితమై కలగలసిన పండుగ ఈ ఉగాది! తెలుగు వారి విశిష్టమైన పండుగలలో ఓకటిగా ప్రసిద్ధి గాంచిన ఈ ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి ఆవిర్భవించింది.ముఖ్యంగా సాధారణంగా తెలుగువారంతా సంవత్సరంలో మొదటి రోజు చైత్ర సుద్ద పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ వుంటారు.ఓక విధంగా చెప్పాలంటే తెలుగు వారి ఈ ఉగాది అనేది మన తెలుగు వారందరికీ ఓక నూతన,సరి కొత్త,కొంగోత్త ఉత్సహలకు నాంది వంటిది. అంతేకాదు తెలుగు వారి ప్రత్యేక పండుగ అయిన ఈ రోజు ఇల్లు వాకిలి శుభ్రపరచడం,తలంటూ స్నానాలు చేయడం,కొత్త బట్టలు ధరించడం జరుగుతుంటుంది. అలాగే ఈ రోజు కొత్త పనులు ఏవైనా వుంటే వాటిని ప్రారంభించడానికి ఈ రోజే శుభకరమైనదిగా మన తెలుగు వారు భావించి వారి వారి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ వుంటారు.అంతేగాకుండా ఈ ఉగాది పుట్టుక,పూర్వోత్తరాల విషయానికి వస్తే చైత్ర శుద్ద పాడ్యమి అయిన ఈ రోజున బ్రహ్మదేవుడు ఏకంగా ఈ విశ్వాన్నే సృష్టించాడు అని పురాణాలు గోంతెత్తి ఘోషిస్తున్నాయి.అయితే ఇంకో కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలు దొంగిలించాడని,అప్పుడు విష్ణుమూర్తి మస్సవతారం లో వెళ్లి సోమకారుణ్ణి వదించి వేదాలను తీసుకోని వచ్చి,బ్రహ్మ దేవుడికి అప్పగించారాని,అందుకే ఈ రోజున అందుకు గుర్తుగా తెలుగు వారు ఈ ఉగాదిని అంగ,రంగ వైభవంగా,కనుల పండుగగా జరుపుకుంటున్నారని మన పురాణాలూ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఉగాది పండుగ అనేది మూడు ప్రత్యేక విశిష్టతలను కలిగి వుంది.అదేమంటే ఉగాది పచ్చడి,పంచాంగ శ్రవణం,కవి సమ్మేళనం,ఈ మూడింటితో ఈ ఉగాది పండుగ అనేది ఓక గొప్ప అవినాభావ సంబంధాన్ని పెనవేసుకొని వున్నది. ముఖ్యంగా వసంత ఋతువు ఆగమనం ప్రారంభమైన ఈ రోజున మొదటిది ఉగాది పచ్చడిని షడ్రుచులతో అంటే తీపి,పులుపు,ఉప్పు,కారం,చేదు,వగరు అనే రుచులు గల బెల్లం,చింతపండు,ఉప్పు, కారం,వేపపువ్వు,మామిడి కాయలు తగిన మోతాదులో కలిపిన పచ్చడిని మన రుచికి తగినట్లుగా కలిపి తయారుచేసి మరీ ఇంటిల్లిపాదికి,తమ బంధుజనానికి పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ వుంటారు మన తెలుగు వారు.ఇక రెండవది పంచాంగ శ్రవణం అంటే తిధి, వారం,నక్షత్రం,యోగం,కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావించి,వాటిని బేరిజు వేసుకొని మరీ తదనుగుణంగా ఈ సంవత్సరంలో మన స్థితిగతులు ఎలా వుంటాయో ముందే తెలుసుకొని తద్వారా మనం ఈ సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలను,అతి జాగ్రత్తగా అలోచించి మరీ తీసుకోవడానికి ఈ పంచాంగ శ్రావణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక చివరిదైనా మూడవది కవి సమ్మేళనం అంటే ఈ ప్రత్యేక దినం అయిన ఉగాది రోజున సాయింకాలం కవులంతా ఓక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహించడం అనేది అనాదిగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఓకానొక అనవాయితీగా వస్తున్నది.ఇందులో కవితలు,పద్యాలు సైతం పాడుకోవడం జరుగుతుంది. ఏదిఎమైన ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు,మరెన్నో చారిత్రాత్మిక అంశాలతో మిళితమై,కలగలసిన ఈ ఉగాది అనేది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారి అందరి ఇళ్లలో సరికొత్త వెలుగులు ప్రసరింప చేయడంతో పాటు,కుటుంబ సభ్యులంతా ఎంతో అన్నోన్యంగా పిల్ల, పాపాలతో,ఇంటి పెద్దలతో కలిసి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో జీవించాలని ఈ ఉగాది పండుగ తెలియజేస్తుంది.ఏమైన ఈ ఉగాది పండుగ అనేది మన తెలుగు వారందరూ అంటే మన హిందూ సోదర, సోదరిమణులంతా ' ఐకమత్యమే మహాబలం ' అనే నానుడికి కట్టుబడి తమ విలువైన,అమూల్యమైన జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని ఈ ఉగాది పండుగ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.ఈ ప్రత్యేక సందర్బంగా మన యావత్ తెలుగు ప్రజానీకం అందరికి తెలుగు సంవత్సరాది మొదటి పండుగ అయిన ఉగాది శుభాకాంక్షలను ప్రతి ఒక్క హిందూ సోదర,సోదరిమణులు ఒకరికొకరు తెలియజేసుకుంటూ అత్యంత ఆనందంగా,ఉల్లాసంగా ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మన తెలుగు వారందరిపై ఎంతైనా వుంది! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ugadi