JYOTHI KUMAR . P
715 views
1 days ago
పాలనలో అవినీతి భయంకరంగా పెరిగింది! గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సంచలన కామెంట్స్‌.. 🚨 ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు పట్టి పీడిస్తున్నాయి! 🚨గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు టీడీపీ అనుకూల ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 🔥 ప్రధాన ఆరోపణలు:కల్తీ లేకుండా ఏదైనా తింటున్నాం? అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? పాలు తెచ్చుకోవాలంటే భయమే! ఏ వ్యవస్థా సక్రమంగా లేదు. ఊహించలేనంతగా లంచావతారాలు తయారయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించుకుని వెళ్లినా రెవెన్యూ, ఇతర కార్యాలయాల్లో డబ్బులివ్వకుండా పని జరగదు! చిరంజీవి సినిమాల్లో కూడా లంచావతారాలు చూపించారు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి ఉన్నారు! ఒక రైతు పట్టాదారు పాసుపుస్తకంలో తప్పును సరిదిద్దుకోవడం కూడా అసాధ్యం. రెవెన్యూ అధికారుల తప్పిదాలకు నెలల తరబడి తిరగాలి, వేల రూపాయిలు సమర్పించాలి. లంచాలు తీసుకుంటూ టీఏ, డీఏ రాలేదని రోడ్ల మీదకు వస్తున్నారు. టీఏ, డీఏల మీద శ్రద్ధ ఉంటే ఉద్యోగంపై ఉంటుందా? ఎమ్మెల్యేలు కూడా అధికారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారు! వీళ్లకు నెలవారీ మామూళ్లు ఇస్తారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడి? గత ప్రభుత్వం కంటే ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగింది! ఈ విషయం చెప్పడానికి ఎవరూ ధైర్యం చేసుకోలేదన్నారు.గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు: ఈ రాష్ట్రం లంచాల దాసులైంది! ప్రజలు బాధలు పడుతున్నారు. ఎవరూ ఈ అవినీతిని ఆపలేకపోతున్నారా? జనసేన నేతలు కూటమి పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జై జనహేన జై పిడికిలి జై జై జెండా కూలి #👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్