#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ 📢
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రే 🚨
⚠️ ఆధారాలు కాలిపోవడంతో అంతా బయటకొస్తరు
🆘 హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతరు
🔸ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే
సాక్ష్యాధారాలను రేవంత్ దగ్ధం చేయించిండు
✅ ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలున్నయ్
🚒 ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం ఏమిటి?
👨🚒 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ
🤝 ఢిల్లీ సర్కార్కు మద్దతిచ్చే పెద్దల పాత్రా ఉన్నదేమో!
🧑🏻⚖️ ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి
💥 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడమేంది? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేకపోవడమేంది? నిన్న ప్రమాదం పెద్దగా జరుగలేదని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మొత్తం 2015 నుంచి పదేండ్లకు సంబంధించి అనేక కేసుల సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్రెడ్డి చేయించిన పనే.
ఫోరెన్సిక్ ల్యాబ్లో సాక్ష్యాధారాలు,రికార్డులు, కంప్యూటర్లు, చివరికి సర్వర్లను కుట్రపూరితంగా దగ్ధం చేశారు. ఈ ఘటనలో వేలాది నేరాలు, నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాధారాలు కాలిపోయినయ్. ఆధారాలు బూడిదై కరుడు గట్టిన నేరస్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. రేవంత్ ఒక్కడు తప్పించుకునేందుకు వేలాది మంది నేరస్తుల ఆధారాలను కాలబెట్టించిండు.
ల్యాబ్ దగ్ధమైన ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని నిజానిజాలు బయటకి తీయాలి. రేవంత్రెడ్డి అనే చోటే భాయ్ని బడే భాయ్ కాపాడటం లేదని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ-రేవంత్రెడ్డి మధ్య లాలూచీ లేకుంటే వెంటనే కేంద్రం ఉన్నత విచారణ సంస్థలతో ఈ ఘటనపై స్పష్టమైన విచారణ చేయించాలి. రిటైర్డ్ జడ్జిని నియమించి నిజాలను నిగ్గు తేల్చాలి.