మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన శ్రీ @PawanKalyan గారు
•శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు
•పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
•శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన శ్రీపవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు.
@JanaSenaParty @janasenapartytelanganapk
#Gurugovindsingh #Maharashtra #Pawankalyan #Deputycmpawankalyan #Nagababu #Pspk #JanaSenaParty #Janasenapartytelangana #AndhraPradesh #Telangana #giritelangana
#
#✋బీజేపీ🌷 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే