YS Jagan Mohan Reddy
1.1K views
2 months ago
విశాఖపట్నం కేజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నం 12:౩౦ గంటలకు కరెంటు పోతే రాత్రి 12:౩౦ వరకూ పట్టించుకునే నాథుడు లేకపోవడం, దాదాపు 12 గంటలపాటు చిన్నపిల్లలు, గర్భిణీలు, రోగులు అష్టకష్టాలు పడ్డం, ఆపరేషన్లు చేయించుకున్నవారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా ఉండడం, కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ వెలుతురులోనే రోగులకు సేవలందించాల్సిన దుస్థితి రావడం, ఇవన్నీ మీ రొటీన్‌ డైలాగులు, డ్రామాల మధ్య మీకు కనపడకపోవడం దారుణం. 2వేల పడకలున్న ఆస్పత్రిలో 1,700 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. మరి ఇలాంటి ఆస్పత్రిని నిర్వహించే తీరు ఇదేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా? అదికూడా 12 గంటల పాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్‌ క్లినిక్స్‌ నిర్వీర్యం, పీహెచ్‌సీలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు రద్దు, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, టీచింగ్‌ ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు నిలిపేయడం, సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్య శ్రీకి బకాయిలుపెట్టి సర్వనాశనం, ఆరోగ్య ఆసరా మాయం, 108, 104ల పరిస్థితి ఘోరం, చివరకు ఆ 104,108 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతికోసం కట్టబెట్టి, ఇన్నిరకాలుగా ప్రభుత్వ వైద్యరంగాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కేజీహెచ్‌ లాంటి ఆస్పత్రులను కూడా దెబ్బతీస్తున్నారు. మేం తెచ్చిన కొత్త గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరంచేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్‌ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుత క్యాజువాల్టీని ఆధునీకరించడమే కాకుండా, రెండో క్యాజువాల్టీని 24 గంటలూ సేవలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం. సీఎస్‌ఆర్‌ బ్లాక్ పూర్తిచేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చాం. కొత్త అల్ట్రాస్కాన్‌, కొత్త ఎంఆర్‌, మొబైల్‌ ఎక్స్‌రే, ఆన్లైన్‌లోనే రోగి పరీక్ష ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్‌ యూనిట్‌తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించాం. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్‌ నిర్మాణం, ఆధునిక పరికరాలు, భావనగర్‌ వార్డులో ఏఎంసీ యూనిట్స్‌, అందుబాటులోకి కేన్సర్‌ కేర్‌ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు, ఒక్క కేజీహెచ్‌కే కొత్తగా 8 అంబులెన్స్‌లు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునీకరణ, దీంతోపాటు వెయిటింగ్‌ హాల్స్‌, కనీసం 200-250 మంది ఉండేలా వాటిని తీర్చిదిద్దాం. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్‌ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషిచేశాం. కాని, మీరు వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మేము గొప్పగా ఆధునీకరించినవి కూడా మీరు మెయింటైన్‌ చేయలేకపోతున్నారు. కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 7 నెలలకు పైగా గుండె ఆపరేషన్లు ఆగిపోవడం మీ పాలనా వైఫల్యం కాదా చంద్రబాబుగారూ? ఇప్పుడు కూడా అరకొరగానే నడిపిస్తున్నారు కదా? ఆస్పత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్‌ అందకపోవడంతో దేవి అనే మహిళ చనిపోయిందంటూ ఆ మృతురాలి బంధువులే ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబుగారూ…? చివరకు నిన్న పులివెందుల టీచింగ్‌ ఆస్పత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫొటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దు ఉండాలి కదా? #🗞️నవంబర్ 7th ముఖ్యాంశాలు💬 #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟢వై.యస్.జగన్