#EVM హాక్ ⁉️ #పాలిటిక్స్
*ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు⁉️*
AUGUST 8, 2025🎯
ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్కడ తగ్గడం లేదు. నిన్న అధారాలతో సహా ఓట్ల చోరీ అంశంపై మాట్లాడిన ఆయనపై విమర్శలు చేసిన ఈసీకి కౌంటర్ ఇస్తూ ఇవాళ ఐదు ప్రశ్నలతో సంధించారు.
1. "డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు?” అని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల ఓటింగ్ హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని, అయితే ఇప్పుడు అదే సంస్థ ఆ హక్కును కాలరాస్తోందని ఆయన విమర్శించారు.
2. “ఓటింగ్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు నాశనం అయ్యాయి?” అని రాహుల్ నిలదీశారు. ఓట్ల దుర్వినియోగంపై నిర్ధారణకు కీలకంగా ఉండే ఆధారాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు.
3. "నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది?” అని మరోసారి ప్రశ్నించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో చిరునామాకు వందలాది ఓట్లు నమోదవడం, ఫేక్ ఐడీలు తయారవడాన్ని ఆయన ఉదహరించారు.
4. “ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?” అని కూడా రాహుల్ నిలదీశారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు అడిగిన నేతలను టార్గెట్ చేయడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఈ ఎన్నికల వ్యవస్థను కలుషితం చేస్తోందని ఆరోపించారు.
చివరగా, “BJPకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా?” అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన సంస్థే ఒక రాజకీయ పార్టీకి వంతపడితే, అది దేశానికి చేటు చేస్తుందన్నారు. ఇవే కాకుండా, రాబోయే ఎన్నికల నిష్పక్షతపై అనుమానాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని రాహుల్ స్పష్టం చేశారు.