P.Venkateswara Rao
556 views •
#EVM హాక్ ⁉️
*కనురెప్పే కాటేస్తోంది.. ఓట్ల చోరీపై సంచలనం❗*
SEPTEMBER 16🎯
కనురెప్పే కాటేసిన చందంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరు వుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు ఓట్ల చోర్పై మరోసారి ఢిల్లీ వేదికగా ఆయన సీఈసీపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మీడియాతో ఆయన మాటాడుతూ. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖూనీ చేస్తోందని విరుచుకుపడ్డారు. ఇందుకు ఉదాహరణగా అక్రమంగా తొలగించిన ఓటర్ల జాబితాలోని వ్యక్తులను ఆయన మీడియా ముందు ఉంచడం విశేషం.
లక్షలాది మంది ఓటర్ల హక్కుల్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శ చేశారు. ఎన్నికల ప్రక్రియలో కుట్రల్ని తిప్పి కొట్టాల్సిన, అలాగే అక్రమాలను సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ కోసం సీఈసీ చేస్తున్న చీకటి రాజకీయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు.
కర్నాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6 వేల ఓట్లను నకిలీ లాగిన్ ద్వారా తొలగించినట్టు ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ను హాకర్లు హైజాక్ చేసినట్టు ఆయన ఆరోపించారు. అలాగే తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి, ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డగోలుగా చేశారని ఆయన ఆరోపించారు. అది కూడా: కాంగ్రెస్ పార్టీ బలంగా వుండి, గెలుస్తుందనే చోట చేసినట్టు ఆయన ఆరోపించారు.
విధ్వంసకారులకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ రక్షణ కల్పిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏ రకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడ్డాలో ఆయన ఆధారాలతో సహ వివరించారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తొలగింపు ప్రక్రియ అంతా వ్యక్తుల ద్వారా కాకుండా, ఓ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్రీకృతంగా జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించడం గమనార్హం.
ప్రతి బూత్ లో మొదటి పేరును ఆ ఆటోమెటెడ్ ప్రోగ్రాం తీసుకుని తొలగించేలా రూపొందించారని ఆయన ఆరోపించారు. ఈ తొలగింపు ప్రక్రియలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సెల్నంబర ఉపయోగించి OTPలతో అప్లికేషన్లు దాఖలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటి గురించి కర్ణాటకలో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలు ఇవ్వాలని ఈసీని కోరినా పట్టించుకోలేదన్నారు.
వారంలోపు తొలగించిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారాన్ని ఎన్నికల సంఘం విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లేకపోతే, ఈ చెడు ప్రాక్టీస్ మరోచోట కూడా జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థపై అణుబాంబ్ లాంటిదన్నారు. ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పెలబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని, కోర్టులు పరిశీలించి న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
8 likes
5 shares