అక్కడి ప్రజలు తమ పనులు చేసుకుంటూనే చదువుకుంటారు…
అందుకు దారిపొడవునా పుస్తకాలు ఏర్పాటు చేశారు!
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో 1,664 మీటర్ల ఎత్తున ఉన్న మణిగుహ్ గ్రామాన్ని 'హమారా గావ్ ఘర్' అనే స్వచ్ఛంద సంస్థ హిమాలయాల్లోనే మొదటి ‘లైబ్రరీ విలేజ్’గా తీర్చిదిద్దింది. నగరాలకే పరిమితం అవుతున్న విద్యావకాశాలను గ్రామీణ పిల్లలకు అందించడం, అలాగే సరైన వనరులు లేక యువత నగరాలకు వలస వెళ్లే పరిస్థితిని అరికట్టడం కోసం ఈ సంస్థ ఇక్కడ 'పుస్తక్ తీర్థ్' పేరుతో ఒక పెద్ద కేంద్రీయ లైబ్రరీని ఏర్పాటు చేసింది.
ఇందులో వివిధ భాషలకు చెందిన 20,000 పైగా ఉచిత పుస్తకాలతో పాటు 1800-1905 నాటి అరుదైన పుస్తకాలను కూడా భద్రపరిచారు. కేవలం ఒకే భవనానికే పరిమితం కాకుండా, దారి పొడవునా, గుడుల దగ్గర, బస్ స్టాప్ ల దగ్గర.. ఇలా ఎనిమిది ఓపెన్-ఎయిర్ రీడింగ్ స్పాట్స్ను ఏర్పాటు చేసి చదువును దైనందిన జీవితంలో భాగం చేశారు.
దీంతో పాటు, అడవి మంటలకు కారణమయ్యే పైన్ నీడిల్స్ (చీపురు ముళ్లు) ను సేకరించి వాటితో అందమైన హ్యాండ్క్రాఫ్ట్స్ తయారు చేయడంపై అక్కడి మహిళలకు శిక్షణ ఇస్తూ, వారికి సొంత ఊర్లోనే అదనపు ఉపాధిని కల్పించడం విశేషం.
#TALRadioTelugu #GoodNews #LibraryVillage #Maniguh #Uttarakhand #Himalayas #EducationForAll #FreeLibrary
#💪పాజిటీవ్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం #😇My Status #🙆 Feel Good Status