shaik Rubeena
695 views
20 days ago
వైయస్‌ జగన్‌ నివాసంలో వేదపండితులు ఆశీర్వచనాలు. పులివెందులలోని ఆయన నివాసంలో, కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్‌ జగన్‌ కు అందజేశారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయనకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, ఆలయాల పవిత్రత, ఆగమ శాస్త్రాల పరిరక్షణ, సంప్రదాయాల ప్రాముఖ్యతపై వైయస్‌ జగన్‌ వేదపండితులతో చర్చించారు. దేవాలయాలలో నిత్య పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం ఎంతో అవసరమని, తద్వారా ఆధ్యాత్మిక విలువలు తరతరాలకు సంక్రమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, వేద విద్య ప్రోత్సాహానికి గతంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైయస్‌ జగన్‌ తెలిపారు. అనంతరం వైయస్‌ జగన్‌ వేదపండితులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారి ఆశీర్వాదాలను వినమ్రంగా స్వీకరించారు. #YSJaganInPulivendula #🌊మన కోస్తాంధ్ర #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱