ఒక మనిషి చనిపోయాక మళ్ళీ పుట్టడానికి లేదా వేరే రూపంలో జన్మించడానికి ఎంత కాలం పడుతుంది?
అది వారి కర్మఫలాలు, వారి సంతానం మరియు తరువాత తరాలవారి పితృకార్యాలను బట్టి ఉంటుంది.
మరణించిన తరువాత మళ్ళీ పుట్టే వరకూ జీవుడు ప్రేతంగా ఉంటాడు. ఈ ప్రేతాలు అధోలోకాలలో తిరుగుతూ, వేచి ఉంటాయి.
ఇప్పుడో చిన్న విషయం చూద్దాం:
ఉపనయనం అయిన వారు భోజనం అయాక ఉత్తరాపోశనం చేస్తారు, విస్తరి చుట్టూ అపసవ్యంగా. వీరు చేతిని, ఆకును పూర్తిగా నాకేయరు. కొన్ని అన్నపు మెతుకులు ఉండేలా చూసుకుంటారు.
ఈ ఉత్తరాపోశనంలో అరచేతిలో కొద్దిగా నీరు పోసుకుని " రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయముపతిష్టతి " అని చదువుతూ విస్తరి చుట్టూ అపసవ్యంగా నీరు వదులుతారు. ఆ మెతుకులు కూడా పడతాయి.
ఈ నీరు అధోలోకాలలో చాలా కాలంగా ఉండిపోయిన ప్రేతాల తృప్తి కోసం. ఈ మంత్రంలో పద్మార్బుద అన్నారు. అర్బుదం అంటే సంవత్సరం. పద్మం అంటే ఒకటి ప్రక్కన 28 సున్నాలు. అంటే అన్ని సంవత్సరాలుగా అక్కడ పునర్జన్మ ( పితృకార్యాలు లేక ) లేక నానా యాతన పడుతూన్న వారికోసం.
ఎంత కాలం పడుతుంది అన్నది ఇప్పుడు అర్ధం అయి ఉంటుంది.
అందుకే పితృదేవతలకు తగిన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆ కార్యక్రమాలు వారికి, చేసే వారికీ కూడా మేలు చేస్తాయి.
#తెలుసుకుందాం