Sekhar Digitals & Reporter 9603197203
521 views
1 days ago
#రైతులు #రైతులు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *అన్నదాత కంట కన్నీరు..!!* *చేతికొచ్చిన పంట నీటిపాలు.!* *కళ్ళముందే ధాన్యం మొలకలు..* *దిక్కుతోచని స్థితిలో రైతులు...* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ప్రకృతి ప్రకోపానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడై కాట్రేనికోన మండలంలోని రైతాంగం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన వరి పంట నీట మునిగి, కళ్లముందే ధాన్యం మొలకలు వస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.​మండలంలోని చెయ్యేరు, లక్ష్మీవాడ, పెనుమల్ల, బంటుమిల్లి, ఉప్పూడి, కాట్రేనికోన, నడవపల్లి, కందికుప్ప, పల్లంకుర్రు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. ఇంత జరుగుతున్నా, గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు కనీసం పంటను పరిశీలించిన దాఖలాలు లేవని రైతులు మండిపడుతున్నారు. లక్ష్మీవాడ గ్రామంలో తాను పండించిన రెండు ఎకరాల వరి పంట ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగి మొలకలు వచ్చి నష్టపోయానని స్థానిక రైతు కాండ్రేగుల సింహాద్రి రావు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంట నష్టంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సర్వే (ఎన్యూమరేషన్) ప్రారంభం కాలేదు. అధిక తేమ కారణంగా ధాన్యం రంగు మారి, మొలకలు వస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారు.​ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుందామన్నా రైతులకు కష్టాలు తప్పడం లేదు..​"ధాన్యం అమ్మాలంటే నిబంధనలు రైతులకు సౌకర్యంగా ఉండటం లేదంటున్నారు . గోనె సంచులు, జట్టు కూలీలు , వాహనాలను తామే సమకూర్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు, మళ్లీ చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్నాం" అని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఈ బాధలు పడలేక బయట వ్యాపారులకు అయినకాడికి అమ్మేసికుంటున్నారు.వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టపోయిన ప్రతి ఎకరాను నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటున్నారు.​ ఉచితంగా గోనె సంచులు సరఫరా చేసి, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యం ను ​ఒబ్బిడి చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోకపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి కాట్రేనికోన రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారిని మృదులను వివరణ కోరగా ఇటీవల మండలంలో కురిసిన వర్షాలకు *135 ఎకరాలు వరి పంట పనల పై మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రాశుల్లో 250 పనులు ధాన్యం తడిసిందన్నారు.* ప్రభుత్వం నుండి దెబ్బతిన్న వరి పంటను గుర్తించి నష్టాలు అంచనాకు ఆదేశాలు ఏమీ రాలేదని వ్యవసాయ అధికారిని తెలిపారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼