*మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు- వారం గ్యాప్లోనే రెండోసారి*
*పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసలు పెంపు*
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు 90 పైసల చొప్పున పెంచుతూ మంగళవారం చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.వారం రోజుల్లోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. మే 15న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచారు.
*ప్రధాన నగరాల్లో ధరలు ఇలా*
జాతీయ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77 నుంచి రూ.98.64కు పెరిగింది. డీజిల్ ధర రూ.90.67 నుంచి రూ.91.58కు చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర పెట్రోల్ ధర 91 పైసలు పెరిగి లీటరుకు రూ.107.59కు చేరింది. డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.94.08గా నమోదైంది. కోల్కతాలో పెట్రోల్పై అత్యధికంగా 96 పైసల పెరుగుదల నమోదైంది. దీంతో ధర లీటరుకు రూ.109.70కు చేరింది. డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.96.07 అయింది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.104.49కు చేరగా, డీజిల్ ధర 86 పైసలు పెరిగి రూ.96.11గా నమోదైంది...
#🆕Current అప్డేట్స్📢