kumarsingh
553 views
23 days ago
*తీవ్ర ఎండల ముప్పు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ* తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. #🆕Current అప్‌డేట్స్📢 #summer