ఆశ చెడ్డది,దురాశ దుఃఖానికి చేటు!
లేదా
అవినీతికి, లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు!
ప్రభుత్వం నెల నెల టంచన్ గా అందించే వేలాది రూపాయల జీతాలతో ఎంతో హుందాగా ఉండాల్సిన,బాధ్యతగా మెలగాల్సిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నేల విడిచి సాము చేస్తూ తమ దగ్గరకు ఏదేని పని నిమిత్తమై వచ్చిన సామాన్య ప్రజల నుంచి,చిన్న,సన్న కారు రైతుల నుంచి తమకు కావలసినంత సొమ్మును ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ తమ వికృత,నికృష్ఠ నైజాన్ని చాటుకుంటుండటం తీవ్ర హేయమైన,ఆక్షేపణీయమైన విషయం.ఆ విధంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల డబ్బు పిచ్చి ఏ విధంగా తయారు అయ్యింది అంటే ' అయ్యా గారికి లంచం ఇస్తేనే కంచం కదిలేది ' లాగా, కాస్తో,కూస్తో ' సామాన్య ప్రజల నుంచి కాసులు గుంజనిదే ' వారికి ఆ రోజు నిద్రపట్టేలా లేదు అన్నట్లుగా.ఓక విధంగా చెప్పాలంటే ఓక వేటగాడు తన కడుపు నింపుకోవడానికి ఏదేని జంతువును ఎలా వెంటాడి వెంటాడి వేటాడతాడో ఆ తరహా లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజలను ఓక జలగల లాగా పీక్కుతుంటూ వారి నుంచి బలవంతంగా అయిన దానికి కాని దానికి కాసులు దండుకుంటుండటం అత్యంత జుగుస్సకరం,హేయమైన విషయం.కొన్ని సందర్భాలలో వీరి అవినీతి,లంచాలు శృతి మించి,సామాన్య ప్రజలకు వెర్రేత్తి వీరి బాగోతాన్ని ఏసీబీ అధికారులకు చేరవేస్తే వారు అఘా మేఘాల మీద వచ్చి వీరి మీద పడి వీరిని అత్యంత అవమానకరంగా సస్పెండ్ చేస్తున్నప్పటికీ వీరి వక్రబుద్దిలో ఏ మాత్రం మార్పు కానరాకపోవడం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత బాధాకరమైన,దురదృష్టకరమైన విషయం.
ఏదిఏమైనా వీరికి ఏ మాత్రం పేద,నిరుపేద ప్రజలపై, సామాన్య రైతులపై జాలి,దయ,సానుభూతి అంటూ ఏ మాత్రం,ఏ కోశానా ఉండదు.ఎంతసేపు వీరి బొక్కసాలను నింపుకోవడం పైనే వీరి దృష్టి అంతా. ఏమి చేస్తాం వీరికి ఎంతసేపు డబ్బు సంపాదన పై తీరని వ్యామోహం తప్పించి వీరిలో మానవత్వం ఇసుమంతైనను కానరాదు. ' పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు' కొంతమంది నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులు సైతం వీరిని చూసి అవినీతికి, లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రమాదం సైతం పొంచి వుంది. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.ఏమైనా ఆ కాలమే వీరి దుర్బుద్దిని,వక్ర స్వభావాన్ని మార్చాలి తప్ప వీరు మారరు గాక మారని దురాశపరులు, లంచాలను అడుగడుగున రుచి మరిగిన బొత్తిగా వ్యక్తిత్వం లేని దనాశపరులు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు మనమంతా ఓక యుద్ధ ప్రాతిపదికన ఉద్యమిద్దాం,అవినీతి,లంచం అనే మహమ్మారిని తరిమి తరిమి కొడదాం! అవినీతి రహిత సమాజ రూపకల్పనకు మన వంతుగా పాటుపడదాం! జయ జయహో భారత్!మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#ప్రభుత్వ ఉద్యోగులు