JanaSena Party Telangana
555 views
1 days ago
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు ,కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూటమి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పును ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకు, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రను వివరించారు. భావితరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత అని తెలిపారు. #pawankalyan #Chandrababu #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🗞పాలిటిక్స్ టుడే