Mohan
4.7K views
22 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 👨🏻‍🌾 ఓరుగల్లు సాక్షిగా రైతు రణగర్జన 🔥 💥 రేవంత్‌ రైతు వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 🎯 ఎర్రటి ఎండలోనూ సంగ్రామ సదస్సుకు పోటెత్తిన రైతన్న 📢 విరగపూసిన గులాబీ వనం ✴️ సదస్సు సక్సెస్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్‌ సర్కార్‌ గుండెల్లో బీఆర్‌ఎస్‌ ఫిరంగి మోత మోగించింది. రెండున్నరేండ్లుగా తెలంగాణ రైతన్నను అరిగోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘సంగ్రామ’భేరి మోగించారు. రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ను ‘ఇక ఉప్పు పాతరేసుడే’ అని బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్‌ఎస్‌ తేల్చిచెప్పింది. ఓరుగల్లు గడ్డమీద ఎర్రటి ఎండలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు రైతాంగం పోటెత్తింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రైతులు సంగ్రామ సదస్సుకు తరలివచ్చి రేవంత్‌ సర్కార్‌ అంచనాలు తప్పని తేల్చి చెప్పాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన సదస్సును విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చారు.. రణగర్జన చేశారు.