Ravi Talluri
425 views
12 hours ago
*_హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, మల్లూరు, జయ శంఖర్ భూపాలపల్లి జిల్లా...!!_* *_ఉగ్రం వీరం మహా విష్ణుం_* *_జ్వలంతం సర్వతో ముఖం_* *_నృసింహం భీషణం భద్రం_* *_మ్రిత్యుర్ మ్రిత్యుం నమామ్యహం_* *_జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట  మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది_* . *_చుట్టూ అడవి  మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది_*. *_యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా  పాలకుడై  ఉన్నాడు_*. *_చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి  చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది_,*. *_భద్రాది నుండి  గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ  దూరం లో  గల మల్లూరు నరసింహ క్షేత్రం  ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని  పిలుస్తారు.ఇక్కడ ఉన్న ఉగ్రనరసింహ మూర్తి  9 అడుగుల ఎత్తు  గల నరహరి అష్ట బుజములతో విరాజిల్లుతూ  భక్త కోటికి  దర్శనం ఇస్తున్నాడు_* . *_ఇక్కడ స్వామి వారి మూలవిగ్రహాన్ని తాకితే మానవుల చర్మాన్ని తాకితే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి కలుగుతుంది._* *_ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు  స్వామి ని దర్శించుకుంటే  అన్ని రకాల బాదలు ,దోషాలు  పోతాయని భక్తుల విశ్వాసం_* . *_వైశాక  శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి  కళ్యానోత్సవములు నిర్వహించబడును_*. చాల మంది  భక్తులు స్వామి వారి  కళ్యాణోత్సవానికి వస్తారు. *వెళ్ళు మార్గం :* *_మంగపేట్ కి సుమారు 5 కి మీ_* *_దూరం లో ఉన్న ఈ క్షేత్రం_* *_ఏటూరునాగారం_* _భద్రాచలం వెళ్ళు మార్గం లో_ వస్తుంది #మన సంప్రదాయాలు సమాచారం