నిర్మలమైన భక్తి ఉంటే, భగవంతుడే స్వయంగా భక్తుని వెదుకుతూ వచ్చి ప్రత్యక్షమవుతాడు.
రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో ఒక జాట్ కుటుంబం ఉండేది. వారి ఇంట్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క అందమైన విగ్రహం ఉండేది.
ఆ భక్తునికి కర్మా అనే కూతురు వుండేది.
కర్మా తండ్రి ప్రతి ఉదయాన్నే లేచి శ్రీ కృష్ణుని విగ్రహానికి స్నానం చేయించి, ఎంతో ప్రేమతో భోగం (నైవేద్యం) పెట్టేవాడు.
కర్మా కూడా ఎంతో ఆసక్తిగా తన తండ్రి చేసే సేవలను శ్రద్ధతో గమనించేది. అతని సేవలో సహాయంగా ఉండేది.
ఒకసారి కర్మా తల్లిదండ్రులు అనుకోకుండా తీర్థయాత్రకు వెళ్లాల్సి వచ్చింది. అది ఆ కృష్ణుని సంకల్పం ఏమో!
వెళ్లే ముందు తండ్రి కర్మాకు ఇలా చెప్పాడు:
“తల్లీ!
మేము కొన్ని రోజులపాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాం, కానీ నువ్వు శ్రీ కృష్ణుని ఒంటరిగా వదిలేయొద్దు.
నీవు ప్రతిరోజూ ఉదయం లేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆయన కోసం మంచి భోజనం తయారు చేసి, భోగం (నైవేద్యం) పెట్టాలి. స్వామి తిన్న తరువాత నే తిన్న తర్వాతనే నువ్వు తినాలి.”
మరుసటి రోజు ఉదయం కర్మా త్వరగా లేచింది. “భగవంతుడికి ఏమి ఇష్టం?” అని ఆలోచించింది.
ఎంతో ప్రేమతో బాజ్రా ఖిచ్డీ తయారు చేసి, అందులో నెయ్యి, బెల్లం బాగా వేసింది. ఆ తాళాన్ని (నైవేద్యాన్ని) భగవంతుని ముందు పెట్టి, తెర వేసి, బయట కూర్చొని ఆయన తినడం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
చాలా సేపు అయింది… కానీ భగవంతుడు తినలేదు. కర్మా మళ్లీ మళ్లీ తెర వెనుక నుంచి చూసింది—తాళం (నైవేద్యం) అలాగే ఉంది.
అప్పుడు ఆమెకు అనిపించింది “బహుశా నేను నెయ్యి తక్కువ వేశానేమో లేక లేదా బెల్లం నచ్చలేదేమో…” అందుకే స్వామి తినడం లేదేమో అంటూ ఏడవడం మొదలుపెట్టింది.
అప్పుడు కర్మా కన్నీటితో నిండిన కళ్ళతో బాధ తో నిండిన హృదయం తో
“ప్రభూ! నా తండ్రి గొప్ప భక్తుడు. ఆయన చేతి నుంచే మీరు తింటారు కాబోలు.
నేను చిన్నపిల్లను… నాకు బాగా వండడం రాదు. కానీ మీరు ఆకలితో ఉండకండి. మీరు తినకపోతే, అమ్మానాన్నలు నన్ను మందలిస్తారు…” అని ఆర్తిగా ప్రార్థించింది.
కర్మా కళ్ళనుండి కన్నీళ్లు జారిపడుతూనే ఉన్నాయి. ఆమె మొండి పట్టుదలతో చెప్పింది:
ప్రభూ!
“మీరు తినేవరకు నేను ఇక్కడి నుంచి లేవను!”అని భీష్మించుకొని కూర్చుంది.
ఆ ఆర్తితో కూడిన భక్తి పిలుపు విని జగత్తు కు అధిపతి అయిన భగవాన్ జగన్నాథుడు నిలవలేకపోయాడు.
ఆయన సాక్షాత్తుగా ప్రత్యక్షమై, ఆ వేడివేడిగా ఉన్న ఖిచ్డీని ఎంతో ఆనందంగా తినడం ప్రారంభించాడు.
ఇది చూసి కర్మా ఆనందంతో మురిసిపోయింది. కర్మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అప్పటి నుంచి అది రోజువారీగా మారింది.
కర్మా రోజూ ఖిచ్డీ వండి భగవంతునికి నివేదించేది, భగవంతుడు వచ్చి ప్రేమగా తినేవాడు.
కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు యాత్ర నుండి తిరిగి వచ్చారు. కర్మా చాలా సన్నగా కనిపించింది. తండ్రి అడిగాడు:
“తల్లీ!
నువ్వు భగవంతునికి రోజూ భోగం పెడుతున్నావా?
కర్మా అమాయకంగా చెప్పింది:
“అవును నాన్న! కానీ మీ కృష్ణుడు చాలా సరదాగా ఉంటారు. ప్రతిరోజూ నన్ను ఖిచ్డీ చేయమంటారు, అందులోని నెయ్యి అంతా తింటారు!”
తండ్రికి ఇది సరదాగా అనిపించింది. కానీ ఒక రోజు దాగుకొని తొంగి చూస్తే భగవంతుడు స్వయంగా నే ఖిచ్డీ తింటున్నాడు!
భగవంతుడికి కర్మా బాయి చేసిన ఖిచ్డీ ఎంతో ఇష్టమైందని.
అందుకే ఈ రోజుకీ జగన్నాథ ఆలయంలో ఉదయం మొదటి భోగంగా “ఖిచ్డీ”నే సమర్పిస్తారు. దానిని “కర్మా బాయి ఖిచ్డీ” అని పిలుస్తారు.
నిర్మలమైన భక్తి ఉంటే, భగవంతుడు స్వయంగా తానే భక్తుని వద్దకు పరిగెత్తుకొని వస్తాడు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
#జగన్నాథ స్వామి.. #జగన్నాథ మహాప్రసాదం #జగన్నాథ స్వామి #తెలుసుకుందాం