గ్రామ పాలనలో ఎదురులేని ఆంధ్రప్రదేశ్
•జాతీయ స్థాయిలో మరో మూడు అవార్డులు
•అవార్డుతోపాటు రూ. 2.75 కోట్ల ప్రోత్సాహక నగదు
•అద్భుత పని తీరు కనబర్చిన సిబ్బందికి గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందనలు
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో పురస్కారాలు కైవశం చేసుకుంటోంది. మరో మూడు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుని గ్రామీణ పాలనలో సత్తా చాటుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన 2026 జాతీయ పంచాయతీ అవార్డుల్లో రెండు విభాగాల్లో మొదటి స్థానం, ఒక విభాగంతో ద్వితీయ స్థానం మన
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దక్కించుకుంది. పురస్కారాలతో పాటు రూ. 2.75 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. వాతావరణ సంరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకుగాను చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన కందులవారిపల్లి గ్రామ పంచాయతీ మొదటి స్థానంతో పాటు రూ.కోటి నగదు గెలుచుకుంది. పంచాయత్ క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారాన్ని చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ దక్కించుకుంది. ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో అదే జిల్లాకి చెందిన కాణిపాకం గ్రామ పంచాయతీ ద్వితీయ స్థానంలో నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సమర్థ పరిపాలన, పారదర్శకత, నిబద్ధతకు ఈ అవార్డులు నిదర్శనం. జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకునేందుకు కృషి చేసిన ఆయా పంచాయతీల సిబ్బందిని, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🟨నారా చంద్రబాబు నాయుడు #✋బీజేపీ🌷