Mahbubnagar Police
523 views
1 days ago
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అడ్డాకల్ టోల్‌గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులకు పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. #MahabubnagarPolice #📰 వార్తలు