Sekhar Digitals & Reporter 9603197203
514 views
8 hours ago
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *బ్రహ్మసమేధ్యం పంచాయతీ మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగం పై డి ఎల్ పి ఓ విచారణ.* *మరోసారి విచారణ చేస్తాం డి.ఎల్ పి.ఓ బొజ్జిరాజు* మండలంలోని బ్రహ్మసమేధ్యం పంచాయతీలో మరుగుదొడ్ల *సొమ్ము దాదాపు 55 లక్షలు దుర్వినియోగం పై* జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి ఆదేశాల మేరకు అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి బొజ్జి రాజు విచారణ చేపట్టారు .పంచాయతీలో మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగంపై స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు ఈ ఏడాది ఫిబ్రవరి లో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం తెలిసిందే . ఈ నేపథ్యంలో పంచాయతీలో విచారణకు వచ్చిన డివిజనల్ అధికారి ముందు నిందితుడైన పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఇసుకపట్ల నాగేంద్ర హాజరు కాలేదు. నాగేంద్ర కు ఫోన్ చేసినా ఫోను పని చేయడం లేదని డివిజన్ అధికారి బొజ్జిరాజు తెలిపారు. పంచాయతీలో పూర్తి రికార్డులు అందుబాటులో లేవని, అప్పట్లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాస్ తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు విత్ డ్రా స్టేట్మెంట్లు సమర్పించాలని ఆదేశించినట్లు డిఎల్పిఓ తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి విచారణ చేపడతామన్నారు. ఇప్పటికే నిందితుడు నాగేంద్ర ని కాట్రేనికోన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చినా శనివారం హాజరు కాకపోవడం వల్ల విచారణ ముందుకు సాగనట్లు తెలిసింది. అయితే ఈ నిధులు *దుర్వినియోగం 55 లక్షల రూపాయలు కాగా ఇప్పటికి రు.41,30,000 తిరిగి వసూలు చేశారు. ఇంకా మరుగుదొడ్లు సొమ్ము 14 లక్షలు 25000 వసూలు కావాల్సి ఉంది.* ఈ వసూలు కావలసిన సొమ్ము ఎవరి వద్ద ఉందనేది ప్రశ్నార్ధంగా మిగిలింది. అయితే అప్పటి పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ నాగేంద్రలు ప్రమేయంతోనే నిధులు దుర్వినియోగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పంచాయతీ రికార్డులు, బ్యాంకు సమాచారం వచ్చిన తర్వాతే శాఖాపరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారులు తీసుకుంటారని తెలిసింది .జిల్లా పంచాయతీ అధికారి ముగ్గురు అధికారులతో విచారణ టీం ను గతంలోనే ఏర్పాటు చేశారు. డిఎల్పిఓ బొజ్జి రాజు ఆధ్వర్యంలో శనివారం జరిగిన విచారణ లో మలికిపురం డిప్యూటీ ఎండిఓ సూరప రాజు, బ్రహ్మసమేధ్యం పంచాయతీ అప్పటి కార్యదర్శి కె శ్రీనివాస్ .పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫిర్యాదుదారు మాజీ సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు విచారణకు హాజరై తను వాదన వినిపించారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼