ప్రతి ఊరు తిరుగుతూ… చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాడు ఈ లాయర్!
తమిళనాడులోని డిండిగల్ ప్రాంతానికి చెందిన మణికందన్ అనే లాయర్, తమ హక్కులేంటో తెలియక దోపిడీకి, వేధింపులకు గురవుతున్న గ్రామీణ మహిళలు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. తన నాన్నమ్మ చేసిన సామాజిక సేవను ఆదర్శంగా తీసుకొని లాయర్ అయిన ఆయన, గత 12 సంవత్సరాలుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చట్టాలపై పాఠాలు చెప్తున్నాడు.
రెగ్యులర్ క్లాసెస్ లా కాకుండా విద్యార్థులతో నేరుగా చర్చిస్తూ ఇప్పటి వరకు 250కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించడం విశేషం. బాలకార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం వంటి వాటిపై వేలాది మందికి అవగాహన కల్పించి ప్రాక్టికల్ గా పరిష్కారాలను చూపిస్తున్నారు.
మణికందన్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఎంతోమంది బాలికలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడమే కాకుండా, మహిళలు సమస్యలను తెలుసుకొని, అవగాహనతో, ఆత్మగౌరవంతో జీవించే ధైర్యాన్ని పొందుతున్నారు.
#GoodNews #LawAwareness #LegalAwareness #WomenEmpowerment #ChildRights #POCSOAwareness
#📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #my status