🪷189లింగ మహాపురాణo🪷
🍀హిరణ్య గర్భ దానము - తిలాపర్వత దానము🍀
#నూటఎనభైతొమ్మిదవభాగం#
సనత్కుమారుడుమనువుకోరిక పై శివపూజల సందర్భంగా చేసే వివిధదానాలుగురించిచెప్ప
సాగాడు.
హిరణ్యగర్భ దాన విధి:
ఈ దానము చేయదలచిన భక్తుడు ఒక సువర్ణ పాత్రను తయారు చేయించాలి. పాత్ర అధః అనగా కింద భాగం వేయి సువర్ణ నిష్కములతో, ఊర్ధ్వ భాగం అనగా పైభాగం ఐదు వందల నిష్కములతో (నాణెములతో) తయారు చేయాలి. పాత్ర ముఖభాగము ధాన్యముతో నింపుటకు తగిన వెడల్పుతో ఉండాలి. పాత్రను సర్వాలంకారములతో సిద్దం చేయాలి.
త్రిగుణములు కలిగిన మాయా దేవిని పాత్ర కింద్రభాగముగా భావించి స్మరించాలి.పైభాగంలో ఇరవైనాలుగు తత్త్వములు కలిగిన ప్రకృతి దేవిని బ్రహ్మ విష్ణు అగ్నులతో ఉన్నట్టు స్మరించాలి. పాత్ర పైభాగాన ఇరవైఆరు తత్త్వములు గల ఉమాపతి అయిన ఈశ్వరుని స్మరించాలి. ఆత్మ పైన వేదిక పై గల మండల మధ్యలో ఇరవై ఐదు తత్త్వాలు గల ప్రధాన పురుషుని ధ్యానించాలి.
బంగారుపాత్రలోశాలీధాన్యముతో నింపాలి. పాత్రను నూతన వస్త్రముతో చుట్టాలి. మినప పిండితో లేపనము చేసి పూసి పంచద్రవ్యాలతోఅలంకరించాలి. ఈశానాది మంత్రములతో పాత్రను పూజించాలి.తరువాత భక్తుడు శివపూజాహోమములు విధి పూర్వకంగా ఆచరించాలి. తూర్పు దిశలో ముఖము ఉండేటట్టు కూర్చుని గాయత్రి జపము చేయాఊ.
ఉత్తమ బ్రాహణునికి పూజ షోడశోపచార సామాగ్రితో చేయాలి. గరిక విత్తనములతో సీమంత సంస్కారం చేసి ఈశాన దిశలో జల సేవనము చేయాలి. ముప్పై సువర్ణ నిష్కములతో సుందర ఆకారం గల కన్య ప్రతిమను తయారు చేయించాలి. ఆ ప్రతిమకు అన్ని అలంకారములు చేసి వివాహ సంస్కారం చేయాలి. హోమము చేసి ఆ ప్రతిమను శివునికి సమర్పించాలి. అన్న ప్రాశనయందుభక్తుడుపాయసం మొదలగు వానితో భోజనము చేయించాలి.
విశ్వజిత్ యాగముతో అన్ని సంస్కారాలు పూర్తిఅవుతాయి. వేదపండితుడైన బ్రాహ్మణుని చేతమాత్రమేఅన్నిసంస్కారాలు జరిపించాలి.
తిలపర్వత దానము :
సమతలంగా ఉన్న పవిత్ర భూమిని శుభ సమయంలో ఎంచుకుని పది మూరల పొడవు గల దండము స్థాపన చేసి విధి పూర్వకంగా పూజ చేయాలి. దండము పై నీరు చిలకరించి తిలలను దండము సమీపంలో ఉంచాలి. పంచ గవ్యములు కలిపిన నీటిని ఆ ప్రదేశం పై చల్లాలి.
దండము చుట్టూమండలాకారం భూమి పై ఏర్పాటు చేయాలి. అక్కడ వస్త్రము పరచి సుందర సుగంధ పుష్పాలు ఉంచాలి. తిలలను మండలంలో కుప్పగా పర్వతాకారంవచ్చేవరకుపోయాలి. దండము చుట్టూ తిలాపర్వతము ఏర్పడుతుంది. ఏర్పడిన తిలల పర్వతము దండము కంటె ఎక్కువఎత్తులో ఉంటే ఉత్తమమని అంటారు.
తిలా పర్వతము దండము కంటే నాలుగు అంగుళాల ఎత్తు ఉంటేమధ్యమమని,దండముతో సమానముగా ఉంటే కనిష్ఠ మనిఅంటారు.తిలాపర్వతము దండము కంటె ఎట్టి పరిస్థితు లలో తక్కువ ఉండకూడదు. వస్త్రము చేతతిలాపర్వతమును కప్పివేయాలి.సద్యాదిఇతరములు కూడా స్థాపించి అర్చించాలి.
తిలపర్వతము అష్ట దిక్కులలో తులాభారంలోచేసినట్టుమూడు నిష్కములతో చేసిన బంగారు విగ్రహములుస్థాపించాలి.వాటికి విధి పూర్వకంగా పూజలు చేసి దక్షిణలు సమర్పించాలి. తరువాత హోమము చేయాలి. హోమము తరువాత తిలా పర్వత మధ్యన ప్రతిష్టితుడైన, తిలా పర్వత రూపుడైనశివునికి సహస్ర కలశములతో సహస్ర పట్టాభిషేకం (శివార్చన) చేయాలి. అర్చన తరువాత విసర్జన కృత్యము చేయాలి. తిలాపర్వతమును వేద పండితుడైన, శ్రోత్రియుడైన బ్రాహ్మణునకు దానము ఇవ్వడంతో తిలపర్వత దానము పూర్తి అవుతుంది.
* తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD?mode=gi_t #🌅శుభోదయం#🙏శుభాకాంక్షలు#🙏ఓం నమః శివాయ🙏ૐ
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺