Arjun
591 views
1 days ago
డేటా సెంటర్ల పేరిట అభివృద్ధికి అడ్డుకట్ట — సాక్షి ప్రచారం ఒక రాజకీయ కుట్ర! ​ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ నుండి $15 బిలియన్ల భారీ పెట్టుబడి వస్తోంది. రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ ప్రాజెక్టులు రాష్ట్ర తలుపు తడుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఇంతటి శుభసందర్భంలో సాక్షి పేపర్‌కు నిద్రపట్టడం లేదు. "డేటా సెంటర్లు వస్తే నీళ్లు పోతాయి, కరెంటు పోతుంది" అంటూ ప్రజల్లో భయాందోళనలు పెంచే కుట్రకు తెరలేపింది. కానీ ఆ భయం నిజమేనా? మంత్రి నారా లోకేష్ గారి పక్కా లెక్కలు, శాస్త్రీయ వాస్తవాలు పరిశీలిస్తే జవాబు స్పష్టంగా కనిపిస్తుంది. ​అంకెలు దొంగిలించి, అర్థం మార్చారు! ​సాక్షి కథనంలో వాడిన గణాంకాలు తప్పు కాదు — అవి ఐక్యరాజ్యసమితికి చెందిన UNU-INWEH నివేదికలోనివే. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 945 టెరావాట్ గంటలకు (TWh) చేరుతుందని, 9.3 లక్షల కోట్ల లీటర్ల "వాటర్ ఫుట్‌ప్రింట్" ఉంటుందని ఆ నివేదిక చెప్పింది. అంకెలు కరెక్టే... కానీ వాటి వెనుక ఉన్న అసలు అర్థాన్ని సాక్షి మేధావులు పూర్తిగా తిరగేశారు. ​"వాటర్ ఫుట్‌ప్రింట్" అంటే డేటా సెంటర్ బిల్డింగ్ లోపలికి మోటార్లేసి తోడేసే నీరు కాదు. ఆ డేటా సెంటర్ వాడే విద్యుత్‌ను ఎక్కడో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లు తయారు చేయడానికి పరోక్షంగా వాడే నీటిని కూడా కలిపి లెక్కించే పర్యావరణ శాస్త్ర పదం అది. పవర్ ప్లాంట్ ఒకచోట, డేటా సెంటర్ మరొకచోట ఉంటుంది — దీనివల్ల ఆంధ్రాలో నదులు నేరుగా ఎండిపోవు. ఇది కేవలం సాంకేతిక అజ్ఞానం కాదు, ఉద్దేశపూర్వక వక్రీకరణ! అమెరికా, చైనా, యూరప్‌లలో ఉన్న 11,000 పైగా డేటా సెంటర్లకు సంబంధించిన గ్లోబల్ అంకెలను తీసుకొచ్చి, ఆంధ్రా నదులకు అంటగట్టడం రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. ​సాంకేతికత మారింది, సాక్షికి తెలియదు! ​"డేటా సెంటర్లను చల్లబరచడానికి నీళ్లు వాడటం తప్ప వేరే మార్గం లేదు" అని సాక్షి రాసింది. ఇది 2010 నాటి పాత మాట. 2026లో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించిన "క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఒకసారి పైపుల్లో నీరు నింపితే చాలు — అవే నీళ్లు లోపల లోపలే తిరుగుతూ సర్వర్లను చల్లబరుస్తాయి. బయటి నీటి అవసరం నామమాత్రమే. ​సత్య నాదెళ్ల ఇచ్చిన లెక్కల ప్రకారం, ఒక భారీ నెక్స్ట్-జెనరేషన్ AI డేటా సెంటర్ ఏడాదికి వాడే నీరు — మన ఊరిలో ఒక సాధారణ హోటల్ వాడే నీటితో సమానం! గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు స్థానిక తాగునీటిని అస్సలు వాడవు. అవి రీసైకిల్ చేసిన పారిశ్రామిక వ్యర్థ జలాలు లేదా ఎయిర్-కూల్డ్ చిల్లర్స్ ను మాత్రమే వాడుతాయి. ​మంత్రి లోకేష్ ఇచ్చిన పక్కా లెక్కలు ​ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ ఈ అపోహలను అరటిపండు ఒలిచినట్లు లెక్కలతో సహా బద్దలు కొట్టారు. ​మొదటి విషయం — నీరు: ఒక సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్ వాడే నీటిలో కేవలం 7వ వంతు మాత్రమే డేటా సెంటర్‌కు అవసరం అవుతుంది. మన గోదావరి నుండి ఏటా 3,000 TMCల వరద నీరు ఎవరికీ ఉపయోగపడకుండా సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఆంధ్రాలో నిర్మించబోయే భారీ 6.5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యానికి కావలసింది కేవలం 1 TMC నీరు మాత్రమే! వేల TMCలు సముద్రం పాలవుతుంటే మాట్లాడని సాక్షి, ఒక్క TMC పెట్టుబడి అవకాశాన్ని చూసి ఏడవడం రాష్ట్ర ప్రగతిపై చేస్తున్న ఆర్థిక నేరం కాదా? ​రెండవ విషయం — విద్యుత్: అమెరికా లాంటి అగ్రదేశానికే లేని వన్ నేషన్ వన్ గ్రిడ్" సౌలభ్యం భారతదేశానికి, అందులోనూ మన ఆంధ్రాకు ఉంది. మన గ్రిడ్ టెక్నాలజీ అమెరికా కంటే ఎంతో ఉపయోగకరమైనది — ఇది కేవలం మాటల రాజకీయం కాదు, సాంకేతిక వాస్తవం. ​ఆంధ్రా నిర్మిస్తున్న కొత్త ఎనర్జీ ఏకోసిస్టం ​పైసా కరెంటు ఛార్జీ పెంచకుండా, ట్రూ డౌన్ చేస్తూ.. 'ఎనర్జీ డెమోక్రటైజేషన్' లో భాగంగా... కరెంట్ వాడే ప్రతి వినియోగదారుడు తానే స్వయంగా విద్యుత్‌ను తయారుచేసే 'ప్రొజ్యూమర్' కావాలని, యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గాలనే టార్గెట్ విజన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సోలార్ విద్యుత్ దిశగా మళ్లిస్తున్నారు. పంప్డ్ స్టోరేజ్ నుండి గ్రీన్ హైడ్రోజన్ వరకు ఎన్నో క్లీన్ ఎనర్జీ ఒప్పందాలు ఆంధ్రాలో గ్రౌండ్ అవుతున్నాయి. ​ఇవి కాకుండా పోలవరం సమీపంలో సరికొత్త క్లీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్, అమెరికా-రష్యా దేశాల నుండి 'స్మాల్ మోడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్' (SMRs) టెక్నాలజీ తెచ్చేలా జరుపుతున్న చర్చలు, అమరావతిలో సరికొత్త "కూలింగ్ యాజ్ ఎ సర్వీస్" (District Cooling) విధానాలు — ఇవన్నీ కలిసి ఆంధ్రాను జీరో కార్బన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తున్నాయి. విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, సావరిన్ క్లౌడ్ (Sovereign Cloud) ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఏఐ రంగానికి బలమైన పునాది వేస్తున్నారు. ​Simplification (సరళీకరణ), Speed (వేగం), Stability (స్థిరత్వం) — ఈ మూడు "S" సూత్రాల వల్లే గూగుల్ లాంటి మెగా ప్రాజెక్ట్ కేవలం 13 నుండి 17 నెలల్లోనే ఆంధ్రాలో పట్టాలెక్కింది. ​ ​గ్లోబల్ నివేదికల అంకెలను కాపీ కొట్టి, వాటి వెనుక ఉన్న గ్రీన్ టెక్నాలజీ పురోగతిని దాచి, ఆంధ్రా యువతకు ఉద్యోగాలు రాకుండా చెడగొట్టాలనే దుర్బుద్ధి సాక్షి కథనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ​"డేటా సెంటర్లు ఆంధ్రా నీటిని తాగడం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ పెట్టుబడులను చూసి తట్టుకోలేక, రాష్ట్ర అభివృద్ధిని సహించలేక వైఎస్సార్సీపీ చేసే ఫేక్ ప్రచారాలే — ఆంధ్రా ప్రగతికి పట్టిన అసలైన జలగలు!" #📰ఈరోజు అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు