Mohan
667 views
4 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #ktr #ktrtrs 📢 కాంగ్రెస్‌ ఫస్ట్‌ హాఫ్‌ డిజాస్టర్‌ 🚨❌ అన్నింటా రేవంత్‌ పాలన ఫెయిల్‌ ⛔📣 నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం నాలుగు పనులైనా చేశారా? ⚠️ రైతుబంధును కాదని 'రాహుల్ బంధు' 📢 మీనాక్షీ నటరాజన్ సిన్సియర్ లీడర్, బీజేపీకి ఉప్పందించి ఆమె నామినేషన్ కొట్టుకుపోయేలా చేసింది రేవంత్ రెడ్డే? ♦️ ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం 💥 వేములవాడ, సిరిసిల్ల కార్యకర్తలతో భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా ట్రైలర్‌ చూసే అది సక్సెసా? కాదా? అని ముందుగానే చెప్తున్నరు. రేవంత్‌రెడ్డిది 50 శాతం పూర్తయింది, ఫస్టాఫ్‌ అంతా డిజాస్టార్‌. ఇక సెకండాఫ్‌లో ఏమీ ఉండదు. పరిపాలన చేతకాదు.. కేవలం కేసీఆర్‌ మీద పడి ఏడవడం తప్ప. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పుచేసి కనీసం నాలుగు పనులైనా చేశారా? మూసీ, హైడ్రా అని అంతా నాశనం చేస్తున్నావు. పార్టీకి చెడ్డ పేరొస్తుందని మీనాక్షీ నటరాజన్‌ చెప్పిందట. అది మనసులో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ఆమెపై పగబట్టినట్టున్నడు.. ఇప్పుడు అవకాశం రాగానే ఆమె కేసు వివరాలను బీజేపీ వాళ్లకు ఉప్పందించి చివరకు నామినేషన్‌ ఎగురగొట్టేలా రేవంత్‌రెడ్డే చేసిండు. రాష్టంలో రైతుబంధు ఆగిపోయింది కానీ ‘రాహుల్‌బంధు’ మాత్రం జోరుగా నడుస్తున్నది. ‘కాంగ్రెస్‌లో పైసలు తీసుకొని పోస్టులు అమ్ముకుంటున్నారని నిన్న షబ్బీర్‌ అలీ చెప్పిండు, రూ.50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్‌ పోస్టును అమ్ముకున్నారని గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నడు, రాహుల్‌గాంధీ కూడా ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నారు కాబట్టే.. ఎన్ని అక్రమాలు చేసినా రేవంత్‌రెడ్డిని ఏమీ చేయలేని అశక్తతలో ఉన్నాడు.