Ravi Talluri
546 views
4 days ago
*_శ్రీకృష్ణావతారము-_* *_శ్రీకృష్ణ బలరాముల అంత్యక్రియలు,_* *_ద్వారక సముద్రంలో కలసి పోవుట_*. *_దారుకుడు హస్తినాపురం చేరి పాండవులకు యదువంశం నాశనం గురించి వివరించి అర్జునుని తనతో పంపమన్న శ్రీకృష్ణుని ఆదేశం చెప్పాడు_*. *_పాండవులు, ద్రౌపది చాలా బాధపడ్డారు. ధర్మరాజు అర్జునుడిని ద్వారక వెళ్లి కృష్ణుడు చెప్పిన కార్యాలు పూర్తి చేసి యదువంశంలో మిగిలిన వారిని హస్తినాపురం తీసుకు రమ్మనిచెప్పి దారుకుని వెంట వెళ్ళమన్నాడు_*. *_అర్జునుడు దారుకుని వెంట ఎక్కడా ఆగకుండా ప్రభాస తీర్థము చేరాడు. అక్కడ యాదవుల శవాలు, ఏరులై పారి గడ్డకట్టిన రక్తపుమడుగులు చూసి దుఖించాడు. బలరామ కృష్ణులను వెతుకుతూ దారుకుడి వెంట సమీప వనాలలో వెతకసాగాడు_*. *_కొంత దూరం వెళ్లిన తర్వాత చెట్టు కింద ధ్యాన ముద్రలో మస్తిష్కం పగిలిన బలరాముడి కళేబరం చూశాడు._* *_అర్జునుడికి దుఖంఆగటంలేదు. భగవంతుని అవతారాలుగా జన్మించిన పురుషోత్తములకి ఒంటరిగా అడవుల్లో మరణించే దుస్థితి ఏమిటి? విధి ఎంత కఠోరమైంది. బలరాముని పరిస్థితే ఇదైతే కృష్ణుని పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? " అనుకుని ఆందోళన చెంది దారుకుని వెంట కృష్ణుడిని వెతక సాగాడు._* *_మరి కొంత దూరం వెతికిన తరువాత వారికి జరావ్యాధుడు కనిపించాడు. వీరిని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి “మీరేనాఅర్జునుడు, దారుకుడు! శ్రీకృష్ణ స్వామి మీకు తను ఉండే చోటు చూపించమని చెప్పారు" అని అడిగాడు._* *_దారుకుడు, అర్జునుడు మనస్సులోని బాధతో ఏమి చెప్పలేక అవునన్నట్టు తలలు ఊపారు. “నా వెంట రండి" అంటూ కృష్ణుడు ఉన్న పొదలోకి తీసుకెళ్లాడు_*. *_తన లీలలతో జగత్తును మైమరిపించిన లీలామానుష విగ్రహుడు, జగన్మోహనుడు, పదహారు వేల ఎనిమిది మంది భార్యలు కలవాడు, గోపికా మానస చోరుడు, కంసాది దుష్ట సంహారకుడు, పాండవుల ప్రియ బాంధవుడు, అర్జునుని ప్రియ సఖుడు, బావ అయిన కృష్ణుడు వృక్షము కింద ఏకాకిగా చనిపోయి అచేతన స్థితిలో పడిఉన్నాడు. వదనంలో చిరునవ్వు చెరగలేదు. కన్నులు అర్జునుని “వచ్చావా అర్జునా! ప్రియ నేస్తమా! బావా!” అన్నట్టు చూస్తున్నాయి._* *_అర్జునుడి గుండె పగిలిపోయింది. శరీరమంతా దుఖంతో తల్లడిల్లి పోతోంది. నోరు తడారిపోతోంది. మాటలు రావడం లేదు. కృష్ణుడి కళేబరపు చేతులు పట్టుకుని "బావా! ఏమిటి అన్యాయం! సదా నాకు తోడుగా ఉంటానన్న వాడివి, ఇలా నన్ను ఒంటరిని చేసి వెళతావా! న్యాయమా! నేనేమై పోవాలి" అంటూ పెద్దగా అరుస్తూ దుఖించసాగాడు_*. *_కృష్ణుడి శరీరాన్ని కావలించుకుని.. “లే బావా! నా వంక చూడు! మాట్లాడు! నన్ను నీతో తీసుకెళ్లు!” అంటూ పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు._* *_దారుకుడు చూస్తూ ఏమి చేయలేక “కృష్ణా! నీవే అర్జునుడికి తట్టుకునే శక్తి ప్రసాదించాలి" అని ప్రార్ధించాడు. కృష్ణుడి శరీరాన్ని పట్టుకుని దుఖిస్తున్న అర్జునుడి అంతరాత్మకు కృష్ణుడి మాటలు వినిపించాయి. “ఏం చేస్తున్నావు అర్జునా! కురుక్షేత్రంలో బోధించిన భగవద్గీతను మరచావా! అనివార్యమైన జనన మరణాల గురించి దుఖపడటం అవివేకం. మూర్ఖత్వం. నాడు కురుక్షేత్రంలో అనేక మంది బంధువులు, సన్నిహితులు మరణించారు కదా. ఇది అంతే. తేరుకుని ఉద్దేశించిన కర్తవ్యం నిర్వర్తించు!"_* *_అర్జునుడు తేరుకున్నాడు. మనసారా, తనివితీరా ప్రియనేస్తాన్ని చూసుకున్నాడు. కౌగిలించుకున్నాడు. లేచి దారుకుని వెంట ద్వారకకు బయలుదేరుతూ కృష్ణ బలరాముల శరీరాలనువచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో మని జర వ్యాధుడికి చెప్పాడు. ఉగ్రసేనుడు, దేవకి వసుదేవులు, రేవతి రుక్మిణి సత్యభామాదులకు బలరామ కృష్ణుల నిర్యాణాల గురించి తెలియచేశాడు. దారుకుడు యాదవుల మరణాల గురించి బంధువులకు చెప్పాడు_*. *_అర్జునుడు ప్రభాసతీర్థం వెళ్లి బంధువులతో అందరికి అంతిమ సంస్కారాలు భక్తి శ్రద్థలతో ఏర్పాటుచేసి నిర్వర్తించాడు._* *_కృష్ణుడి మునిమనవడైన వజ్రుని చేత బలరామకృష్ణులకు అంతిమ సంస్కారాలు చేయించాడు_*. *_రేవతి బలరాముని శరీరంతో అగ్ని ప్రవేశం చేసింది._* *_రుక్మిణి,సత్యభామాది అష్టపత్నులు కృష్ణుడి దేహంతో అగ్ని ప్రవేశం చేశారు_*. *_బలరామ కృష్ణుల వియోగ దుఖం భరించలేని వసుదేవుడు, దేవకి, రోహిణి యోగశక్తితో ప్రాణాలు వదిలేశారు_*. *_అర్జునుడు అందరికి అంతిమ సంస్కారాలు చేశాడు_*. *_యదువంశంలో కృష్ణుడి ముని మన వడు వజ్రుడు ఒక్కడే మిగిలాడు._* *_"కృష్ణుడు చనిపోయిన వారం రోజులకి ద్వారక సముద్రంలో మునిగి పోతుంది" అని ప్రకటించి అర్జునుడు మిగిలిన రాజవంశపు స్తీలను, ముసలి వారిని, పిల్లలను, ధన సంపదలను, గోసంపదను తీసుకుని ద్వారకను వదిలి బయటకు వచ్చి సముద్ర తీరం చేరాడు._* *_అందరు చూస్తుండగానే సముద్రం ఉప్పొంగి ద్వారకను తనలో కలిపేసుకుంది._* *_అర్జునుడితో వచ్చిన వారిలో సగం మంది మధుర వెళ్ళడానికి ఇష్టపడి మధుర వెళ్లిపోయారు. మిగిలిన వారు అర్జునుడువెంట హస్తినాపురం బయలుదేరారు_* #మన సంప్రదాయాలు సమాచారం