sruthi
564 views
1 days ago
చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే పాలసముద్రం దగ్గర బీఈఎల్‌ సంస్థ రూ.500 కోట్లతో భారీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ.2,500 కోట్లతో భారీ డిఫెన్స్‌ ఎనర్జిటిక్స్‌ తయారీ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనుంది. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీవో ఫిఫ్త్‌ జనరేషన్‌ స్టెల్త్‌ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న చంద్రబాబుగారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,000 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న ఈ విభాగం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలు వస్తాయి. #ChooseSpeedChooseAP #InvestInAP #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్