Mahbubnagar Police
573 views
17 days ago
బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా నివారణకు కోయిలకొండ ఎక్స్ రోడ్ చెక్‌పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య గారు కోయిలకొండ ఎక్స్ రోడ్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను సందర్శించి తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణా నివారణకు పోలీస్ శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ చెక్‌పోస్ట్ వద్ద పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు