బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
572 views
2 days ago
భృణ హత్యలు అనేవి అత్యంత పైశాచికం,దుర్మార్గపు చర్యలు! ( 30 -5 - 2026)! లేదా నేటి ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణిస్తున్న ఇంకా పుత్రుడు కావాలనే భావజాలం నుంచి తల్లిదండ్రులు బయటపడలేకపోవడం అత్యంత దురదృష్టకరమైన అంశం! ఆ మధ్యకాలంలో కర్ణాటక ప్రభుత్వం అల్ట్రా స్కానింగ్ గది లోకి గర్భిణులతో పాటు వచ్చే అటెండర్స్ ను నిషేదిస్తూ సర్క్యూలర్ జారీ చేయడం ఎంతైనా శుభ పరిణామం,హర్షణీయం.ఎందుకంటే అటెండర్స్ రూపంలో అల్ట్రా స్కానింగ్ గది లోకి వచ్చి వీడియో తీసి మరీ లింగ నిర్ధారణ చేయడమే కాదు,తద్వారా మహిళ కడుపులో వున్నది ఆడపిల్ల అని తేలితే నిర్ధాక్షిణ్యంగా అబార్షన్ చేయిస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం.ఇక 2011 లెక్కల ప్రకారం కశ్మీర్,హర్యానా,మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు కేవలం 100 మందే అమ్మాయిలు వున్నారు.ఇలాంటి దారుణ పరిస్థితి ప్రస్తుత సమాజంలో వున్న నేటికీ ఒడిశా,కర్ణాటక రాష్ట్రాలలో లింగ నిర్ధారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఏ మాత్రం జాలి,దయ,కరుణ లేకుండా వారిని మహిళ కడుపులోనే చిద్రం చేస్తున్న కడు దయనీయ పరిస్థితిని చూస్తే మానవత్వం వున్న ప్రతి ఒక్కరి హృదయాలు తీవ్రంగా గాయపడటం,క్షోభించడం తథ్యం.అయితే సింగపూర్, థాయిలాండ్,దుబాయ్ దేశాలలో లింగ నిర్ధారణ చేయడం నేరం కాకపోవడంతో తీరా ఈ బలహీనతను ఆధారంగా చేసుకొని పైశాచిక,రాక్షస,దుర్మార్గపు ప్రవృత్తి గల కొందరు ఒక రాకెట్ లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపించి మరీ లింగ నిర్ధారణ చేయించి ఆ తర్వాత అబార్షన్ చేయిస్తున్నారు అంటే ఎంతటి వికృత,అమానుష చేష్టలు ప్రస్తుత సమాజంలో పొడచూపుతున్నాయో ఒక్కసారి మనం వింటేనే మన ఒళ్ళు తీవ్ర గగుర్పాటుకు,మానసిక వేదనకు గురవ్వడం తథ్యం. తాజాగా మాండ్యాలో ఇలాంటి అపాయకరమైన,ఆనారోగ్యకరమైన,అనాగరికమైన రాకెట్ ను పోలీసులు చేదించి పట్టుకోవడంతో తీగ లాగితే డొంకంత కదిలినట్లు ఈ విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ వారు దేశవ్యాప్తంగా కూడా గట్టి నిఘా ఉంచడంతో ఇక చేసేదేమిలేక సమస్య అత్యంత జటిలం కావడంతో కర్ణాటక ప్రభుత్వం సత్వరమే ఈ అంశంపై కొత్త సర్క్యూలర్ జారీ చేసింది,కొరడా గుళిపించింది.బృణ హత్యలు అనే అనైతిక,అనాగరిక క్రీడ,తంతు కార్యక్రమం ఒక్క కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాలేదు మన భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎదో మూలాన సంభవిస్తూ యావత్ మహిళా లోకానికే ఎనలేని మచ్చ తీసుకురావడంతో పాటు మన దేశ కీర్తి,ప్రతిష్ట లను చాలా పెద్ద ఎత్తున మసకబారుస్తున్నది అనే మాట సత్య దూరం కాదు. కాబట్టి ఇప్పటికయినా పరిస్థితి చెయ్యి దాటక ముందే కేంద్ర ప్రభుత్వం వారు నిద్రాణావస్థ నుండి తక్షణమే మేల్కొని బృణ హత్యలపై యుద్ధ ప్రాతిపదికన కొరడా గులిపించాల్సిన గురుతర బాధ్యత ఎంతైనా ఉంది.లేకపోతే బాలికలను కనడమే ఓక పెద్ద తప్పిదం అనే ఆనారోగ్య మైన పరిస్థితులు ఈ సమాజంలో,ఈ ప్రజాస్వామ్యంలో ప్రబలిపోయే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! ఏదిఎమైన ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్న,ఉపాధి అవకాశాలు పొందుతున్న,క్రీడల్లో పథకాలతో మెరుస్తున్న,ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఇంకా జ్ఞానోదయం కాని కొంతమంది తల్లిదండ్రులు అవివేకంతో,ముర్కత్వంతో,మూఢ నమ్మకాలతో, వితండవాద వైఖరితో సుపుత్రుడే కావాలని పగటి కలలు కనడం అత్యంత దౌర్భాగ్యం,పైగా ఇది కొంతమంది మానవాళి యొక్క ఉన్మాదంతో కూడుకున్న వైఖరి కూడా.ఏమైనా ( పిసిపిఎన్ డిటి ) ఫ్రీ కన్సెప్షన్ అండ్ ఫ్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ - యాక్ట్ 1994 ( లింగ నిర్ధారణ నిషేధ చట్టం ) కింద లింగ నిర్ధారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష,లక్ష జరిమానా ఉన్నప్పటికీ లెక్కబెట్టని కొందరు ప్రభుద్దులు దొంగచాటున ఈ అత్యంత జూగుస్సకరమైన తంతు కార్యక్రమాన్ని ఇంకను నిర్వహిస్తుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత ఆక్షేపణీయం.ఇది బాగా గ్రహించి అవగాహన చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఈ లింగ నిర్ధారణ చట్టం అమలులో భాగంగా రేడియోలిజిస్ట్ లు,గైనకాలజిస్ట్ లతో ఒక వర్క్ షాప్ జరిపి వారు సూచించిన విలువైన సలహాలను పరిగణలోకి తీసుకోని ఎలాగైనా ఈ లింగ నిర్ధారణ అనే దుచ్చర్యను,చాప కింద నీరులా పాకిపోతున్న ఈ అప్రజాస్వామిక దుందుడుగు వైఖరిని శాశ్వతంగా నిర్ములించడానికి కర్ణాటక ప్రభుత్వం తీవ్ర కసరత్తు జరుపుతుండటం ఎంతైనా అభినందనీయం.పైగా ఇలాంటి అత్యంత క్లిష్టమైన బాధ్యతను భుజస్కందాలకు ఎత్తుకోవాల్సిన గురుతర బాధ్యత ముమ్మాటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై వుంది అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.భృణ హత్యలను అంతం చేద్దాం!ఒక అత్యంత ఆరోగ్యకరమైన,అందరికి ఆమోదయోగ్యమైన ప్రజాస్వామ్యాన్ని మనమంతా ఏర్పాటు చేసుకుందాం! జై హింద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ఆడపిల్లలు