బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
1.9K views
1 days ago
ఈ రోజు అభ్యుదయ విప్లవ కవి శ్రీ శ్రీ 43వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నా హృదయ,గౌరవ పూర్వక ఘన నివాళులు! ( 15 - 6 - 2026)! లేద తెలుగు సాహితి ప్రపంచంలో తన స్ఫూర్తివంతమైన రచనల ద్వారా ఓక గొప్ప చరిత్రను సృష్టించుకున్న మహాకవి దివంగత శ్రీ శ్రీ గారు! అభ్యుదయ,సైద్ధాంతిక కవి దివంగత శ్రీ శ్రీ అంటేనే ఓక సంచలనం.ఆయన అన్యాయాలను,అక్రమాలను నిర్భయంగా ప్రతిఘటించే,ప్రశ్నించే ఓక గొంతుక అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఈ విప్లవాత్మక,మనస్సు కవి,ఇప్పటితరం మరియు భవిష్యత్ తరం సైతం గుర్తుపెట్టుకునే మహా కవి.ముఖ్యంగా భూస్వాములు కర్షక జీవులపై అవలంబించే అధిపత్య,దౌర్జన్యపూరిత, వేదించే అనాగరిక ధోరణిపై తన కలం పోటు ద్వారా నిప్పులు చెరిగిన,రగిలే అగ్ని జ్వాల ఈ శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీనివాస రావు).అంతేకాదు తన మేధోసంపత్తి ద్వారా ఈ సమాజంలో చోటు చేసుకునే మంచి,చెడుకు సంబంధించి జరగబోయే అనేక మార్పులను ముందే పసిగట్టి తన రచనా నైపుణ్యం ద్వారా భవిష్యత్తు తరాలకు తెలియజేసిన,చాటి చెప్పిన గొప్ప మానవతావాది,సహజ కవి ఈ శ్రీ శ్రీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.రచయిత అనే వాడు ఏ విధమైన స్ఫూర్తిదాయకమైన పంథాలో నడవాలో,ముందుకు పోవాలో తనదైన శైలిలో చాటిచెప్పిన మహనీయుడు,భూస్వామ్య వర్గాల దుర్మార్గపు వ్యవహారశైలిపై తన రచనల ద్వారా కన్నెర్ర చేసిన తిరుగుబాటువాది,ఓక విప్లవ శంఖం ఈ శ్రీ శ్రీ. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు పాటిస్తూ ఓక మానవీయ కోణంలో జీవించాలని తన జీవితఆద్యంతం పరితపించిన గొప్ప సంఘసంస్కర్త.తనకే సాధ్యమైన రచనల ద్వారా జీవితాన్ని కాసి,వడపోసి మరీ ఈ సమాజాన్ని ఉద్దరించేందుకు కంకణం కట్టుకొని,తన ఆశయాలను, సిద్ధాంతాలను తన అభిప్రాయాలను ఎంతో ధైర్య సాహసాలతో చాటి చెప్పిన మహాపురుషుడు,అన్ని తరాల వారికి కూడా ఆయన ఓక రోల్ మోడల్ లాంటివారు అనడంలో ఏ మాత్రం అవాస్తవం కాదు.1910 జూన్ 20 న జన్మించిన శ్రీ శ్రీ దాదాపు 73 సంవత్సరాలు జీవించడమే కాదు తన అమోఘమైన రచనా నైపుణ్యం ద్వారా కులగజ్జిని,అంటరానితనం వంటి అనాగరిక పోకడలపై విరుచుకుపడిన,వాటిని తులనాడిన ఓక నిఖార్సైన మహాకవి శ్రీ శ్రీ.1983 జూన్ 20 వ తేదీన అరాచకవాదులపై,దుర్మార్గులపై,దుష్టుల చర్యలపై తన రచనల ద్వారా తిరుగుబాటు ధోరణిని అవలంబించి,తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కి,అలసి,సొలసి ఎట్టకేలకు ఏకంగా ఈ భూమ్మీద నుంచే శాశ్వత నిష్క్రమణ తీసుకున్నప్పటికీ తెలుగు సాహితి ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా ఓక వెలుగు వెలిగి తన కంటూ ఓక చరిత్రను సృష్టించుకొని ప్రజల హృదయాల్లో ఎప్పటికి,ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన మహాకవి,ప్రజల మనస్సులను గెలుచుకున్న ప్రజా కవి, ఎందరికో స్ఫూర్తిప్రదాత,ఆదర్శమూర్తి ఈ శ్రీ శ్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదిఏమైనా తన అర్ధవంతమైన,ప్రయోజనాత్మక, ఆలోచింప చేసే రచనల ద్వారా ఈ సమాజాన్ని,అశేష ప్రజానీకాన్ని గొప్పగా ప్రభావితం చేసిన మహాకవి,ఓక విప్లవ జ్వాల,అన్యాయమైన,అక్రమమైన పంథాలో పోయే వారిపై తన రచనల ద్వారా సింహస్వప్నంగా నిలిచి వారి తప్పులను ఎండగట్టి తన జీవితానికే గొప్ప చారితార్థికత చేకూర్చుకున్న అరుదైన,భిన్నమైన శైలి ఈ అభ్యుదయ,మహాకవి శ్రీ శ్రీ సొంతం.ఏమైనా శ్రీ శ్రీ ( శ్రీరంగం శ్రీనివాసరావు) గారి 42 వ వర్ధంతి అయిన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మానవజాతి ఎదుగుదల,బాగుదల కోసం,వారి శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరు సల్పిన మహాపురుషుడు,ఓక గొప్ప మానవీయ,నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఓక విప్లవ శంఖం శ్రీ శ్రీ కి మనమంతా చాలా గొప్పగా నివాళులు అర్పించే ప్రత్యేక తరుణం ఇదే!.అయితే పుట్టినవాడు గిట్టక మానడు అనే నీతి వచనం అయినప్పటికీ శ్రీ శ్రీ వంటి కారణజన్ములు, యుగపురుషులు,మహానుభావులు ఇప్పుడు మన మధ్య లేకపోయినా వారు అవలంభించిన సిద్ధాంతాలు,ఆశయాలు,ఈ సమాజ అభ్యున్నతికి వారు చేసిన కృషి సదా అనుసరణీయం.అలాంటి ఉత్తమోత్తములు ప్రజల మనస్సుల్లో ఎప్పటికి,ఎన్నటికీ చెరిగిపోని ఓ సంతకం లాంటి వారు అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అమర్ రహే,అమర్ రహే శ్రీ శ్రీ గారు.అటు పొద్దు ఇటు పొడిచిన శ్రీ శ్రీ గారి సంకల్పం,దృఢచిత్తం,రాజీలేని ధోరణి నిరంతరం రగిలే ఓ అగ్ని జ్వాలే అనే మాట అక్షర సత్యం.అన్నింటికి మించి చెడును,అనైతికతను ప్రశ్నించిన,తూర్పార బెట్టిన ఓ మహా యోధుడు ఈ శ్రీ శ్రీ!అందుకే ప్రజల హృదయాల్లో ఎప్పటికి అమరుడే,చిరస్మరణీయుడే ఈ శ్రీ రంగం శ్రీనివాసరావు గారు! జోహార్ శ్రీ శ్రీ గారు!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! - #శ్రీ శ్రీ