గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 'వరల్డ్ రికార్డు' నెలకొల్పడం నుండి ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలు ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో చోటు చేసుకున్నాయి.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ విభాగాల్లో ప్రథమ స్థానంతో పాటు మొత్తం 5 జాతీయ అవార్డులు సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ.
పల్లెలే దేశానికి వెన్నెముక అని 'పల్లె పండుగ' ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు.
సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌకర్యాల కల్పనతో వికసిత పంచాయతీల దిశగా పడిన అడుగులు.
గ్రామ పంచాయతీలకు స్వయంప్రతిపత్తి, నిధుల వినియోగంలో పారదర్శకత.
గ్రామ స్వరాజ్య సాధనకు, అధికార వికేంద్రీకరణను మెరుగు పరచడానికి ప్రతి డి.డి.ఓ కార్యాలయానికి ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఈ కార్యాలయాల్లో DLPO, APD, DWAMA అధికారులు కూడా అందుబాటులో ఉండి సేవలు అందించేలా ప్రజలకు సౌలభ్యం కల్పించారు.
డోలీ రహిత మన్యం చేయడమే లక్ష్యంగా అడవితల్లి బాట పేరిట కేవలం 18 నెలల వ్యవధిలోనే 460 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి చేశారు.
పల్లె పండుగ మొదటి దశలో సుమారు 22,500 మినీ గోకులాలు నిర్మించబడ్డాయి. రెండవ దశలో సుమారు 157 కమ్యూనిటీ గోకులాలను నిర్మించనున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కరెంటు ముఖం చూడని అనేక గిరిజన గ్రామాలు, గూడాలకు 'అడవి తల్లి బాట' ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ సౌకర్యం కల్పించడమైనది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న సుమారు 150కి పైగా గ్రామాలు మొదటిసారిగా కరెంటు వెలుగులకు నోచుకున్నాయి. సాధారణ గ్రిడ్ ద్వారా కరెంటు తీసుకెళ్లడం సాధ్యం కాని ఎత్తైన కొండలపై ఉన్న గ్రామాలకు సోలార్ మైక్రో గ్రిడ్ల ద్వారా వెలుగులు అందించారు.
ప్రజాసేవపై చిత్తశుద్ధి, ఆదరించిన ప్రజల పట్ల అంకితభావంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రానున్న కాలంలో పంచాయితీరాజ్ శాఖ ద్వారా ఎన్నో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సేవనందించనున్నారు.
#NationalPanchayatiRajDay #PawanKalyanTransformsAP
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷 #🟨నారా చంద్రబాబు నాయుడు