#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #ktr #ktrtrs 👎రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్.! ఖైరతాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం✌️
🎯ప్రజలు శుభం కార్డు వేసి.. కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపడమే తరువాయి
🎯హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టలేదు..ఇల్లు కట్టలేదు
వీకెండ్ వస్తే గరీబోళ్ల కొంపలు కూల్చడమే కాంగ్రెస్ పని
🎯గరీబోళ్లకు పట్టాలిచ్చిన మహా నాయకుడు కేసీఆర్
🎯దానంని చూసి కాదు.. కేసీఆర్ని చూసి ఓటేశారు
🎯దానం నాగేందర్ ప్రజలను మోసం చేసి.. రేవంత్ పక్కన కూర్చున్నాడు.
- ఖైరతాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ గడువులో ఇప్పటికే 50 శాతం సమయం (ఇంటర్వెల్) అయిపోయిందని, ఇక ప్రజలు శుభం కార్డు వేసి ఇంటికి సాగనంపడమే తరువాయి.. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్లో రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి.. రేవంత్రెడ్డి పక్కన కూర్చున్నారని మండిపడ్డారు. దానం నాగేందర్ను చూసి ఓటు వేయలేదని, కేసీఆర్ని చూసి ఓటేశారన్నారు. 2018, 2023లో గెలిచినట్టు.. మళ్లీ 2028లో కూడా గులాబీ జెండా ఎగరేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు..