రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. అకౌంట్లోకి బోనస్ డబ్బులు జమ!.. మీకు వచ్చాయా?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు వరుస శుభవార్తలు చెబుతోంది. రైతు భరోసా తర్వాత ఇప్పుడు సన్న రకం వరి సాగుకు క్వింటాలుకు రూ.500 బోనస్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న రూ.514.36 కోట్లు విడుదలకు సిద్ధమయ్యారు అధికారులు. ఈ నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన 2.17 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్పై రైతుల్లో నమ్మకం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ బోనస్ కింద రూ.1939.58 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 🌾
#🌾రైతు సమాచారం #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🔹కాంగ్రెస్