ఫాలో అవ్వండి
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
13,258
పోస్ట్
16,295
ఫాలోవర్స్
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
535 వీక్షించారు
ఓం నమశ్శివాయ శివాయనమ ఓం! హర హర మహదేవ శంభో శంకర! లింగాష్టకం : బ్రహ్మమురారి సురార్చిత లింగం! నిర్మలబాసితశోబిత లింగం! జన్మజదుఃఖవినాశక లింగం! తత్ ప్రణామమి సదాశివ లింగం!! దేవమునిప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం! రావణదర్పవినాశన లింగం! తత్ ప్రణామమి సదాశివ లింగం!! - మా హిందూ భక్త జనప్రభంజనానికి ఆధ్యాత్మిక ఓం నమశ్శివాయ శివాయనమ ఓం శుభ సోమవారం! #శుభ సోమవారం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
549 వీక్షించారు
ఒక్కణ్ణే చేసి గుంపుగా వస్తూన్నారు తోడేళ్ల మందలుగా! క్యాప్షన్ : జై జై జగన్! జోహార్ వైస్సార్! అమర్ రహే డాక్టర్ వైస్సార్!✍️✍️✍️ #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
5.5K వీక్షించారు
(Sweetmemoriesof2026)! శివ శివ శంకర,హర హర శంకర,జయ జయ శంకర దిగి రారా! ఈ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియ జేసిన మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహనరెడ్డి గారు! #మహాశివరాత్రి - 15 - 2 - 2026 #శివరాత్రి
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
577 వీక్షించారు
నందమూరి తారకరత్నకు అతి చిన్న వయస్సులోనే దురదృష్టం వెంటాడిన వైనం!(మూడవ వర్ధంతిని పురస్కరించుకొని - (18 - 2 - 2026)! లేదా ప్రస్తుత సమాజంలో అతి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవ్వడం అనేది ఓక సాధారణ విషయంగా మారిపోతుండటం అత్యంత ఆందోళన రేకేత్తించే విషయం! మున్ముందు ఎంతో బంగారు భవిష్యత్ గల కథానాయకుడు,ప్రతినాయకుడు,క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నందమూరి తారకరత్న దురదృష్టవశాత్తు 40 ఏళ్ల అతి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురై శివైక్యం పొందడం అనేది నిజంగా తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే విషయం.అంతేగాకుండా ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులోనే అనేక మంది ఇలా అర్ధాంతరంగా గుండెపోటుకు గురై తనువు చలిస్తుండటం ప్రస్తుత సమాజానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన విషయం.ఇకపోతే నందమూరి తారకరత్న సినిమా కెరీర్ విషయానికి వస్తే 2001లో ఓకటో నంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన ఆయన కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఓక హీరోగా ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించడం అనేది అప్పట్లో ఓక రికార్డు.అయితే తన విలువైన సినిమా కెరీర్ లో మొత్తంగా 23 సిమిమాలు,ఓక వెబ్ సిరీస్ లో నటించిన తారకరత్న అమరావతి సినిమాతో నంది అవార్డును సైతం హస్తగతం చేసుకోవడం అనేది ముమ్మాటికీ చెప్పుకోదగ్గ విశేషమే మరీ.అంతేకాదు ' 'మహాభక్త సిరియాల' లో శివ భక్తుడిగా నటించిన తారకరత్న మహా శివరాత్రి నాడే కాలం చేయడం అనేది నిజంగా ఓక విధంగా దైవాజ్ఞనేమో అని మనకు అనిపించక మానదు.ఇక ఆయనకు ఆకస్మాతుగా సంభవించిన గుండెపోటు విషయానికి వస్తే గత నెల 27 న కుప్పంలో నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోవడం మెదలు దాదాపు 23 రోజులు చావుబ్రతుకుల మధ్య పోరాటం చేసి చివరకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం అనేది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశేష సంఖ్యలో వున్న నందమూరి అభిమానులకు అటు వారి కుటుంబసభ్యులకు తీరని లోటు,ఎనలేని ఆవేదనను కలిగించే విషయం కూడా.అయితే ఆయనకు వైద్యం చేసే నిమిత్తమై తోలుత బెంగుళూరు లోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో నుంచి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించిన,విదేశాల నుంచి అఘామేఘాల మధ్య ప్రత్యేకంగా న్యూరోసర్జన్లు,న్యూరాలజిస్టులను రప్పించి వైద్యం అందించిన ఆయన కోలుకోలేకపోవడం అనేది నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఏదిఎమైన కెరీర్ కు సంబందించిన తీవ్ర ఒత్తిడులు, బిజీ లైఫ్ లో పడి ఆరోగ్యంపై అంతగా శ్రద్ద పెట్టకపోవడం,వేళ కాని వేళల్లో ఆహారాన్ని స్వీకరించడం,దుమపానం,మధ్యపానం వంటి దురలవాట్లు వంటి కారణాలు కూడా ఇలా అర్ధాంతరంగా అనేక మంది గుండెపోటుకు గురై అశువులు బాయడానికి కారణభూతం అవుతున్నది అనేది నిత్యం మన కళ్ళ ముందు సాక్షాత్కారిస్తున్న ఓక బహిరంగ వాస్తవం అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏమైనా ప్రశాంతమైన జీవితం,ఒత్తిడిని దూరం చేసే యోగ విద్యను అభ్యసించడం, వీలయినంతవరకు మన శక్తికి మించి గంపెడు ఆశలు పెట్టుకోకుండా,మన సామర్థ్యం మేరకు మాత్రమే పనిచేస్తూ అందులోనే సంతృప్తి అనే దివ్యాస్రాన్ని, ఆయుధాన్ని వెతుక్కుంటే మాత్రం మన విలువైన జీవితాలు సంపూర్ణ ఆయుష్షును సంతరించుకునేందుకు ఓక బలమైన అవకాశం మెండుగా ఉంటుంది అనే చేదు నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మసలుకుంటే కొంతలో కొంత అతి చిన్న వయస్సు లోనే సంభవించే ఆకస్మిక మరణాలకు మనం అడ్డుకట్టవేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అలాగే ఈ విషాద సమయాన నందమూరి తారకరత్న గారి పవిత్ర ఆత్మకు స్వర్గంలో అనంత శాంతి చేకూరాలని తెలుగు సినిమా అభిమానులం అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా,బాధాతప్త హృదయంతో కోరుకుందాం! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #నందమూరి
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
573 వీక్షించారు
మానవాళి జీవితాలతో ఆటలాడుకునే కలుషితమైన నీటితో తస్మాత్ జాగ్రత్త! లేదా సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే మాత్రం కాచి చల్లార్చిన నీరే ప్రజలకు అత్యంత శ్రేయస్కరం! బయట హోటళ్ళలోనో లేక రోడ్డు ప్రక్కన వున్న బండి కొట్టు వాళ్ళ దగ్గరనో నీరు త్రాగడం వల్ల అవి పొరపాటున కలుషితమై వుంటే మాత్రం కోరికోరి సీజనల్ వ్యాధులను మనం కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే కలుషితమైన నీరు సేవనం వలన మానవాళి విలువైన ప్రాణాలకు సైతం పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఎల్లవేళలా పొంచి ఉంటుంది. ముఖ్యంగా కలుషితమైన నీరు తీసుకోవడం మూలాన మానవాళి అతిసార,న్యూమోనియా,చికెన్ పాక్స్ వంటి వ్యాధుల బారినపడి అనేక రకాల ఇబ్బందులకు, ఇక్కట్లకు,ఆనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు అనే మాట సత్య దూరం కాదు.అయితే మానవాళి ఇలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడి అనవసరమైన ఇబ్బందులపాలు కాకుండా ఉండాలంటే మాత్రం కాచి వడబోసి చల్లార్చిన నీరే ప్రజలకు శ్రీరామరక్ష వంటిది. అంతేకాదు మనం బయటకు ఎక్కడికి వెళ్లిన మన గృహం నుంచే స్వచ్ఛమైన ఫిల్టర్ అయిన బాటిల్ నీళ్లను తీసుకెళ్లడం ఎంతైనా ఆరోగ్యకరమైన విషయం. ఎందుకంటే ' చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే కన్నా ' ముందు జాగ్రత్తగా మనం మంచి పరిశుభ్రమైన నీరును ఎప్పుడు అందుబాటులో పెట్టుకుంటే అది మన ఇంటికి ఒంటికి ఎంతో మంచిది.అంతేగాకుండా కలుషితమైన నీరు సేవించడం అనేది మనల్ని ఎంతటి ప్రమాదకరస్థితిలోకి నెట్టివేస్తుంది అంటే డయేరియా వంటి వ్యాధులు సంక్రమించి ఒక్కొక్కసారి వాంతులు,విరేచనాలు సైతం సంభవించి మానవాళి వున్న ఫలంగా ప్రమాదపు టంచుల్లోకి వెళ్లడమే కాదు ఒక్కొక్కసారి మన కాలం కర్మం సరిగాలేకపోతే మరణాలు సైతం సంభవిస్తూ వుంటాయి.కాబట్టి నిత్యం మనం స్వచ్ఛమైన నీరు త్రాగడం వంటి ఓ మంచి చిట్కాను పాటించడం వలన మన ఆరోగ్యం మరో పది కాలాల పాటు వర్ధిల్లడంతో పాటు మనకు ఎలాంటి ఆనారోగ్యకరమైన సమస్యలు తలెత్తకుండా మన జీవితాలు సాఫీగా సాగెందుకు ఎంతగానో ఆ స్వచ్ఛమైన నీళ్లు దోహదం చేస్తాయి అనే మాట సత్య దూరం కాదు.అన్నింటికి మించి మనం బయట దొరికే చిరుతిండ్ల మూలాన ఎక్కువగా చేటు తెస్తున్నది మాత్రం పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితం అవుతుండటమే.ఈ విషయంలో మాత్రం ప్రజలు అత్యంత అప్రమత్తంగా,జాగ్రత్తగా వ్యవహరించి వీలయినంత వరకు రోడ్ల ప్రక్కన బండ్లలో దొరికే చిరుతిండ్లకు దూరంగా ఉండటమే మనకు ఎంతో సురక్షితం. ఏదిఏమైన తెలిసో తెలియకో బయటకు వెళ్ళినప్పుడు కలుషితమైన నీరు సేవించడం వలన అది మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపి మనకు ఎనలేని హాని చేకూర్చవచ్చు.ఒక్కొక్కసారి అది మనపై దీర్ఘకాలికంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపి మొదటికే మోసం చేకూర్చవచ్చు.ఏమైనా ' ఆరోగ్యమే మహాభాగ్యం ' అని మన పెద్దలు సెలవు ఇచ్చినట్లుగా మన ఆరోగ్యాన్ని పదికాలల పాటు కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే వుంది. అలాకాకుండా విచ్చలవిడిగా బయట హోటళ్ళలోనో, మరే ఇతర ప్రాంతాలలోనో దొరికే నీటిని త్రాగితే మాత్రం చేజేతులారా మన ఆరోగ్యాన్ని బ్రష్టు పట్టించుకున్న వారమవుతాము,అదోగతి పాలు అయ్యే దారుణ పరిస్థితిని కల్పించుకుంటాము.కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎల్లవేళలా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన,కాచి వడబోసిన నీటిని సేవిస్తే మాత్రం మనం ఓ మంచి ఆరోగ్యవంతులుగా,ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా అత్యంత సురక్షితంగా సుదీర్ఘకాలం పాటు మన జీవిత నౌకను అత్యంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వారమవుతాము.కలుషితమైన నీటికి గుడ్ బై చెబుదాం!స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నీటికి జై కొడదాం!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #బెజవాడలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..
See other profiles for amazing content