ఫాలో అవ్వండి
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
13,749
పోస్ట్
16,862
ఫాలోవర్స్
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
570 వీక్షించారు
3 గంటల క్రితం
నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమ అయిన కుట్టదురా శంకర! ఎందుకని వ్రాశావు ఈ రాతను పూలు రాలిన చెట్టులా నా జన్మ! రాతికొండల్లో కొలువైన శివుడా! ఓం తత్ పురుషయా విద్మహే! మహాదేవాయ ధీమాహి! తన్నో రుద్ర ప్రచోదయాత్! మా హిందూ భక్తజనులకు ఆధ్యాత్మిక ఓం నమశ్శివాయ శుభ సోమవారం! #శుభ సోమవారం #శుభ సోమవారం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
640 వీక్షించారు
14 గంటల క్రితం
( 16 - 5 - 2026) ఈ రోజు నేను 51వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న ఈ ప్రత్యేక సందర్బంగా,శుభ సమయాన ఈ సృష్టికి మూలమైన ఆ సర్వేశ్వరుని అనంత కరుణ కృప కటాక్ష్యాలు నాపై దేదిప్యమానంగా ప్రసరించాలని కోరుకోవడంతో పాటు,నన్ను అభిమానించే,మనసా,వాచ,కర్మణ నా ఉన్నతిని,ఉజ్వల భవిష్యత్ ను కోరుకునే నా ప్రియాతి ప్రియమైన స్నేహితులు శ్రేయోభిలాషులు,బంధు మిత్రులు,బేతంచెర్ల మండల వైస్సార్సీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ కూడా మీ విలువైన ఆశీస్సులు నాపై కురిపిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ! ఇట్లు, మీ బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #పుట్టినరోజు
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
481 వీక్షించారు
1 రోజుల క్రితం
గరళం కంఠాన దాచి ధరణి బ్రోచినవాడు! సర్వం దేవతలకిచ్చి సన్యాసిగా మారినాడు! త్యాగం అతని రూపం అనురాగం అతని యోగం! తనువు కాదు కనులు కాదు మనస్సు కన్నుగా మలచి! - మా హిందూ భక్తజనసౌభాగ్యానికి ఆధ్యాత్మిక ఓం నమశ్శివాయ శివాయనమ ఓం శుభ సోమవారం! #శుభ సోమవారం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
500 వీక్షించారు
1 రోజుల క్రితం
ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయనమ: శ్రీ నరసింహ గోవిందా! లక్ష్మీనరసింహ గోవిందా! వరహానరహరి గోవిందా! జ్వాల నరహరి గోవిందా! శ్రీ నరసింహ గోవిందా! లక్ష్మీనరసింహ గోవిందా! ఆపద్బాందవ గోవిందా! అనాదరక్షక గోవిందా! ప్రహ్లాద వరదా గోవిందా! శ్రీ నరసింహ మృత్యుంజయ మంత్రం! ఉగ్రం వీరం మహావిష్ణుం! జ్వలంతం సర్వతోముఖం! నృసింహ భీషణం భద్రం! మృత్యోర్ మృత్యోర్ నమామ్య హం! ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ మృత్యోర్ ముక్షియ మామృతత్! - మా హిందూ భక్తజనసమ్మోహనానికి ఆధ్యాత్మిక ఓం నమో నారసింహ శుభ శనివారం! #శుభ శనివారం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.3K వీక్షించారు
1 రోజుల క్రితం
కలిసి వుంటే కలదు సుఖం అనే పెద్దల నానుడికి తూట్లు పోడుస్తున్న నేటి మనతరం! ( 15 - 5 - 2026)! లేదా ఒకప్పుడు నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా వున్న ఉమ్మడి కుటుంబం నేడు ఎవరికీ వారే యమున తీరులా మారిన వైనం! ( నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్బంగా ) మన భారతీయ సంస్కృతి,సంప్రదాయాలకు ఓక ఆభరణం వంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి ఒక్కసారి మనమంతా ఆత్మావలోకనం, మననం చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుంది.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ములు,అక్క చెల్లెళ్లు, అమ్మ నాన్నలు,బాబాయ్ లు,పెద్ద నాన్నలు, అవ్వ,తాత ముత్తాతలు,జేజి,జేజినాన్నలు,మనవళ్ళు, మనువరాళ్లతో ఇలా అందరూ కలిసి మెలిసి ఓకే చోట వుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.ఓక విధంగా చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ అనేది గతంలో మూడు పువ్వులు,ఆరు కాయలుగా వర్ధిల్లుతూ సుఖ, సంతోషాలకు నిలయంగా,బంధు మిత్రుల కోలాహలంతో, రాకతో అనునిత్యం సందడి సందడిగా అలరారుతుండేది.తద్వారా అనురాగం,ప్రేమ అప్యాయతలు,ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు అనేవి ఉమ్మడి కుటుంబ సభ్యుల మధ్య వెల్లివిరిసేవి.అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉమ్మడి కుటుంబాలు ఓక వెలుగు వెలిగేవి అన్న మాట.కానీ రాను రాను ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవుతూ వచ్చి చివరకు ఎవరికీ వారే యమున తీరు లాగా తయారు అయ్యి,పుట్టకొకరు, చెట్టుకొకరు అన్న తీరుగా కేవలం అమ్మ,నాన్న, కుమారుడు,కుమార్తె మాత్రమే కలిసి జీవించే (సింగిల్ ) ఒంటరి కుటుంబ వ్యవస్థగా మారిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం.ఓక విధంగా ఈ దయనీయ స్థితి మూలాన రోజు రోజుకు అడుగంటిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు,కలిసి వుంటే కలదు సుఖం అనే నీతి సామెతకు బీటలు వారేలా,తూట్లు పొడిచేలా పరిస్థితులు ప్రస్తుత వ్యవస్థలో,సమాజంలో ప్రాప్తించాయి, తయారు అయ్యాయి అనే మాట ఎవరు కాదనలేని అక్షర సత్యం. ఏదిఏమైనా ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్బంగా నైనా గతం గత: జరిగిన దాని గురించి చింతించి ఏమి ప్రయోజనం అన్న రీతిగా ఇప్పటికైనా మనమంతా మన ఉమ్మడి కుటుంబవిలువలకు,నైతికతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఏ పండుగ కో, పబ్బానికో అయిన మన కుటుంబ సభ్యులంతా ఓక చోట కలిసి ముచ్చట్లు పెట్టుకొని ఒకరి కష్ట, సుఖాలు మరొకరు చెప్పుకుంటూ, ఒకరి ఆనందం, సంతోషాలలో,బాధల్లో మరొకరు పాలుపంచుకుంటూ నీరుగారిపోయిన కుటుంబ వ్యవస్థకు మళ్ళీ జనసత్వాలు నింపుదాం,దాని బలోపేతానికి ఊతమిద్దాం.ఏమైన మనమంతా తరచుగా అనే మాట( ' old is gold ' ) పాతరోజులు బంగారంతో సమానం.ఆ మరపురాని రోజులు,ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా మనుగడ సాగించిన ఆ చిరస్మరణీయ కాలం,మధుర సృతులు అనేవి మనకు ఓక మరచిపోలేని సుమధుర జ్ఞాపకాలతో సమానం. ' సర్వేజన సుఖినోభవంతు ' ' కలిసి వుంటే నిలుస్తాం విడిపోతే పడిపోతాం అధ - పాతాళానికి అనే నైతికతకు,నియామవాళికి కట్టుబడి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా తీర్డిదిద్దే బృహత్తర బాధ్యత మనందరి భుజస్కందాలపై ఎంతైనా వుంది.జయ జయహో ఉమ్మడి కుటుంబవ్యవస్థ! వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు మన ఉమ్మడి నైతిక విలువల కుటుంబ వ్యవస్థ!👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👦 - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🌍అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం👨‍👩‍👧‍👦🎉
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.9K వీక్షించారు
1 రోజుల క్రితం
పరిపాలకుడు బాగుంటే ఏ నగరంలోనైనా,ఏ గ్రామంలోనైనా అభివృద్ధి అనేది మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్దిల్లుతుంది.అదే పరిపాలకుడు అనేవారు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహారిస్తే మాత్రం ఏ నగరంలోనైనా,గ్రామంలోనైనా అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో తయారు అయ్యి ఏదైనా పని నిమిత్తం అక్కడికి వచ్చే ప్రజలకు పలు సమస్యలు,ఇబ్బందులు స్వాగతం పలికి చివరికి వారికి చికాకులు మిగులుతాయి తప్ప ఏ మాత్రం సుఖం ఉండదు.ఆ విధంగా గతంలో డోన్ మునిసిపల్ కార్యాలయం అడుగడుగునా సౌకర్యాలలేమితో,సమస్యల సుడిగుండంలో చిక్కుకొని అరకొర సౌకర్యాలతో అక్కడికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే దయనీయ పరిస్థితులు తాండవిచ్చేవి.అయితే అది 2019 కు ముందు మాట,ఎప్పుడైతే 2019 తరువాత కాలంలో అంటే మన జగనన్న గారి సారథ్యంలోని వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మన ప్రజాశ్రేయోభిలాషి,మంచి ఉన్నత విద్యావంతుడు అయిన గౌరవనీయులు అయిన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడో ఇక అప్పటికి నుంచి డోన్ మునిసిపల్ కార్యాలయ రూపురేఖలే మారిపోయి అక్కడ అత్యాధునికమైన సౌకర్యాలు చోటు చేసుకొని మన డోన్ నియోజకవర్గ ప్రజలసాక్షిగా డోన్ మునిసిపల్ కార్యాలయం సకల సౌకర్యాలకు ఓ కేంద్ర బిందువుగా మారింది అనే మాట అక్షర సత్యం.దీనికంతటికి ప్రదాన కారణం మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు ఎంతో ముందుచూపుతో, తన సర్వశక్తులు వడ్డి,అవిరళ కృషిసల్పి మన జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్న గారి ఆశీస్సులతో, అండదండలతో,తోడ్పాటుతో కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి మరీ డోన్ నగరంలోని మునిసిపల్ కార్యాలయాన్ని అభివృద్ధికి మారుపేరుగా నిలిపిన ఘనత మన ఆదర్శ,స్ఫూర్తిదాయక పాలకుడు అయిన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారిది.కాబట్టి రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు నూటికి నూరుపాళ్ళు మన డోన్ నియోజకవర్గ ప్రజలు మన వైఎస్ జగనన్న గారి సారథ్యంలోని వైస్సార్సీపీకి అఖండ మెజారిటీని కట్టబెట్టి ఖచ్చితంగా మరొమారు ప్రజాశ్రేయస్సుకోసం నిత్యం పాటుపడే మన ప్రియతమ నాయకుడు,గొప్ప సుపరిపాలకుడు అయిన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారి నాయకత్వాన్ని తప్పక బలపరిచి మరోసారి డోన్ గడ్డపై వైస్సార్సీపీ పార్టీ జెండా సగర్వంగా ఎగిరేలా చేయగలిగే దమ్ము,సత్తా మన డోన్ నియోజకవర్గ ప్రజల సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.జై జై జగన్! జై జై బుగ్గన! బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా మరో పదికాలాల పాటు!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
4.8K వీక్షించారు
2 రోజుల క్రితం
ఓట్లు వేయాల్సింది ప్రజలు, ఆశీర్వదించాల్సింది ఆ భగవంతుడు! నేను ఎప్పుడు నా స్వశక్తిని నమ్ముకుంటాను! నేను ఎప్పుడు ఇతరులపై ఆధారపడే వాణ్ణి కాదు! #ysr