ఫాలో అవ్వండి
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
@k119112597
1,193
పోస్ట్
2,235
ఫాలోవర్స్
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
577 వీక్షించారు
#గుండె_పోటు. ఈ ట్రిక్ నేను ఫాలో అయ్యాను బ్రతికి బయట పడ్డాను. దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి. 1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా). 2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు. 3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది. మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం. 4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం. 5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం. 6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా? చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు. వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు. 7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు. దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా. ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి. 😎 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది. బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది. ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు. 9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు. 10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని. 11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి తెలియజేయండి. 12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి. మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది మీ కోసం ఈ సందేశం పంపిన వారు. డా. ఎం .అశోక్ Cardiology Doctor #🌄శుభోదయం #🌹good morning #గుడ్ మార్నింగ్ #గుండెపోటు #💓హార్ట్ ఇమేజ్ ఆర్ట్స్ 💓 #హార్ట్
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
688 వీక్షించారు
ఎడారి ఇసుకలో ‘బంగారు నౌక’… 500 ఏళ్ల తర్వాత బయటపడిన పోర్చుగీస్ నిధి! ఒక విశాలమైన ఎడారి మధ్యలో భారీ నౌక ఇసుకలో కూరుకుపోయి ఉండటం ఊహించుకోండి. ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది కదా! కానీ, ఇది నిజంగానే ఆఫ్రికాలోని నమీబ్ (Namib) ఎడారిలో జరిగింది. అట్లాంటిక్ తీరం వెంబడి విస్తరించి ఉన్న ఈ ఇసుక దిబ్బల అడుగున, 500 ఏళ్లుగా నిద్రపోతున్న ఒక ‘బంగారు నౌక’ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2008వ సంవత్సరంలో, నమీబియా తీరంలో వజ్రాల గనుల తవ్వకం కోసం సముద్రపు నీటిని బయటకు పంపి నేలను తవ్వుతున్నప్పుడు పరిశోధకులు నిర్ఘాంతపోయారు. అక్కడ ఒక పాత చెక్క నౌక శిథిలాలు కనిపించాయి. పరిశోధనలో అది 1533వ సంవత్సరంలో అదృశ్యమైన ‘బామ్ జీసస్’ (Bom Jesus) అనే పోర్చుగీస్ వాణిజ్య నౌక అని తేలింది. నౌకలో ఏముంది? నౌకలోని చెక్క పలకలను మెల్లగా తొలగించగా, కళ్లు చెదిరే నిధులు బయటపడ్డాయి: 2,000 బంగారు నాణేలు: ఇన్ని శతాబ్దాలు గడిచినా వాటి మెరుపు తగ్గకుండా అలాగే ఉన్నాయి. టన్నుల కొద్దీ రాగి కడ్డీలు: లెక్కలేనన్ని వెండి నాణేలు కూడా లభించాయి. ఏనుగు దంతాలు: ఆసియాకు వాణిజ్యం కోసం వెళ్ళినప్పుడు సేకరించిన అరుదైన ఏనుగు దంతాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఎడారిలోకి నౌక ఎలా వచ్చింది? 1533లో పోర్చుగల్ రాజు ఆదేశం మేరకు మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి ఈ నౌక భారతదేశం వైపు బయలుదేరింది. కానీ, దారిలో అట్లాంటిక్ సముద్రంలో సంభవించిన భయంకరమైన తుఫానులో చిక్కుకుని, బండరాళ్లను ఢీకొని ప్రమాదానికి గురైంది. కాలక్రమేణా సముద్ర మట్టం మరియు గాలుల దిశ మారడం వల్ల, ఆ ప్రాంతం సముద్రం నుండి వేరుపడి ఎడారిగా మారింది. దీంతో ఆ నౌక ఇసుకలో సురక్షితంగా కూరుకుపోయింది. 200 మంది సైనికులు ఏమయ్యారు? – వీడని మిస్టరీ! ఈ ఆవిష్కరణలో అందరినీ కలిచివేసే విషయం ఒకటి ఉంది. ఈ నౌకలో సుమారు 200 మంది సైనికులు ప్రయాణించి ఉండాలి. కానీ, నౌక లభించిన ప్రదేశంలో ఒక్క మానవ అస్థిపంజరం కూడా దొరకలేదు. వారందరూ సముద్రంలో మునిగి చనిపోయారా? లేదా తీరానికి చేరుకుని ఈ ఎడారిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడారా? అనేది నేటికీ ఒక అపరిష్కృత మిస్టరీగానే ఉంది. ఈ నౌకలో దొరికిన నిధులన్నింటినీ పోర్చుగల్ ప్రభుత్వం నమీబియాకు అప్పగించింది. ‘బామ్ జీసస్’ కేవలం ఒక పాత నౌక మాత్రమే కాదు; అది 500 ఏళ్ల క్రితం మానవులు సముద్రాలు దాటి చేసిన సాహస యాత్రలకు నిదర్శనం! #శుభోదయం #🌄శుభోదయం #🌹good morning #గుడ్ మార్నింగ్ #💞 good morning🌹 గుడ్ మార్నింగ్🌺💘 నౌక ❤️💐పోర్చు గ్రీస్
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
904 వీక్షించారు
కువైట్ కొత్త నివాస చట్టం: విదేశీయులకు కీలక మార్పులు.. ఏ ఆర్టికల్ వీసా దేనికో తెలుసుకోండి! కువైట్ సిటీ,జనవరి 05: కువైట్ ప్రభుత్వం విదేశీయుల నివాస (రెసిడెన్సీ) చట్టంలో కీలక సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జహ్రా రెసిడెన్సీ అఫైర్స్ డైరెక్టర్ కల్నల్ తుర్కీ అల్-సాదూన్ ఇటీవల ఈ మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్మికులు, విద్యార్థులు, విదేశీ జీవితభాగస్వాములు మరియు పెట్టుబడిదారులకు సంబంధించి కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో ఈ క్రింద చూడవచ్చు. •ఏ ఆర్టికల్ వీసా రెసిడెన్సీ ఎవరి కోసం? కొత్త చట్టం ప్రకారం వివిధ వర్గాల వారికి ప్రత్యేక ఆర్టికల్స్‌ను కేటాయించారు: * ఆర్టికల్ 18 & 20: కంపెనీల్లో పనిచేసే వారు మరియు గృహ కార్మికుల (డొమెస్టిక్ వర్కర్స్) కోసం. * ఆర్టికల్ 21: విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. * ఆర్టికల్ 22: ఫ్యామిలీ వీసా (భార్య, పిల్లల కోసం). * ఆర్టికల్ 23: కువైట్ యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం. * ఆర్టికల్ 24: సొంతంగా ఆదాయ వనరులు కలిగి ఉండి, తమకు తాము స్పాన్సర్ చేసుకునే వారి కోసం. * ఆర్టికల్ 25: కువైట్‌లో ఆస్తులు (Property) కలిగిన విదేశీయుల కోసం. * ఆర్టికల్ 26 & 27: కువైట్ పౌరులను వివాహం చేసుకున్న విదేశీయులు మరియు వారి విదేశీ సంతానం కోసం. * ఆర్టికల్ 28: కువైట్ పౌరుని మరణానంతరం లేదా విడాకుల తర్వాత ఇక్కడే ఉంటున్న విదేశీ మహిళల (పిల్లలు ఉన్నవారు) కోసం. ముఖ్యమైన నిబంధనలు: * ఉద్యోగ నిబంధనలు: ఒక కంపెనీలో వీసా ఉండి మరో చోట పనిచేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) తప్పదని అధికారులు హెచ్చరించారు. * ఫ్యామిలీ వీసా: భార్యాపిల్లలను కువైట్ పిలిపించుకుని ఇక్కడే ఉంచుకునేందుకు స్పాన్సర్ కనీస జీతం 800 కువైట్ దినార్లు ఉండాలి. * వీసా అర్హతలు: వర్క్ వీసా పొందాలంటే పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వాలిడిటీ కలిగి ఉండాలి. మెడికల్ టెస్ట్, పోలీస్ క్లియరెన్స్ (PCC) మరియు బయోమెట్రిక్ వేలిముద్రలు తప్పనిసరి. * రెసిడెన్సీ మార్పిడి: నిబంధనల ప్రకారం ఆర్టికల్ 18 (ప్రైవేట్ ఉద్యోగం) నుండి ఆర్టికల్ 20 (గృహ కార్మికులు) కి వీసా మార్చుకునే అవకాశం కల్పించారు. * సందర్శక వీసాలు: టూరిస్ట్ వీసాల కోసం 'కువైట్ వీసా' ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్యామిలీ విజిట్ వీసా కాలపరిమితి సాధారణంగా ఒక నెల ఉంటుంది, ప్రత్యేక పరిస్థితుల్లో మూడు నెలల వరకు పొడిగించవచ్చు. రెన్యూవల్‌లో ఇబ్బందులు ఎందుకు? 'సాహెల్' (Sahel) యాప్‌లో ప్రక్రియ పూర్తికాకపోవడం, పాత వేలిముద్రలు లేదా మెడికల్ రిపోర్ట్స్ అప్‌డేట్ లేకపోవడం మరియు స్పాన్సర్‌పై ఏవైనా చట్టపరమైన కేసులు ఉంటే రెసిడెన్సీ రెన్యూవల్ ఆగిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. #కువైట్ #కువైట్ అమ్మాయి #kuwait కువైట్ చట్టాలు
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
1.5K వీక్షించారు
*తులం బంగారం @ 1.5 లక్షలు...!! ఇది పేదవాడికి ఉరితాడు...!! రాజకీయ రాబందులకు పండగ...!!* ఒక్క నిమిషం ఈ నిజాలు చదవండి...!! గుండెలు పగిలే వాస్తవాలు ఇవి..✍️ ఈరోజు 10 గ్రాముల (తులం) బంగారం కొనాలంటే అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు (Rs. 1,50,000/-) పెడితే కానీ రావడం లేదు...!! అసలు ఎందుకు ఇంత రేటు పెరిగింది...?? దీని వెనుక ఉన్న అసలు దోపిడీ దారులు ఎవరు...?? ఇది కేవలం మార్కెట్ మాయాజాలం కాదు...!! "రాజకీయ అవినీతి" సృష్టిస్తున్న కృత్రిమ కొరత...!! ఒక సామాన్య తండ్రి ఆవేదన...!! ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురు పెళ్లి కోసం, చిన్నప్పటి నుండి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక 5 లక్షలు దాచుకున్నాడు అనుకుందాం...!! రెండేళ్ల క్రితం ఆ 5 లక్షలకు సుమారు 10 తులాల బంగారం వచ్చేది...!! పెళ్లి ఘనంగా జరిగేది...!! కానీ ఈరోజు...?? అదే 5 లక్షలకు కనీసం 3 తులాల బంగారం కూడా రావడం లేదు...!! ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయాలి...?? తన కూతురు ముందు తలదించుకోవాలా...?? లేక పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టాలా...?? ఈ పాపం ఎవరిది...?? రాజకీయ నాయకుల వైభవం...✍️ అదే మీ నియోజకవర్గ నాయకుడి ఇంటి పెళ్లి చూడండి...!! పెళ్లి కూతురు ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం...!! విందు భోజనాల్లో వాడే ప్లేట్లు, గ్లాసులు కూడా వెండి, బంగారమే...!! వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడిది...?? మనం కట్టిన పన్నులు, మన దగ్గర దోచుకున్న వేల కోట్లు...!! మన ఇంట్లో ఉన్న అమ్మకు, భార్యకు మెడలో నల్లపూసల గొలుసు ఉండదు...!! కానీ వాళ్ళ కుక్కల మెడలో మాత్రం బంగారు గొలుసులు ఉంటాయి...!! ఇదేనా ప్రజాస్వామ్యం...✍️ అసలు కుట్ర ఏంటి...?? (The Conspiracy) 1) నాయకుల నల్లధనం దాచుకోవడానికే ఈ రేట్లు...!! దేశంలో రాజకీయ నాయకులు, బడా బాబులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు...!! నోట్ల రద్దు భయంతో, ఐటీ దాడుల భయంతో...!! ఆ డబ్బునంతా "బంగారు బిస్కెట్లు" గా మార్చేస్తున్నారు...!! వాళ్ళు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని, ఫాంహౌస్‌లలో, విదేశీ లాకర్లలో కుప్పలుగా దాచేస్తున్నారు...!! మార్కెట్లో ఉండాల్సిన బంగారం అంతా వాళ్ళ ఇళ్లల్లో బందీ అయిపోతే...!! సామాన్యుడికి బంగారం ఎక్కడ దొరుకుతుంది...?? అందుకే డిమాండ్ పెరిగి, ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి...!! 2) పన్నుల పేరుతో పగటి దోపిడీ...!! మనం కష్టపడి సంపాదించి, పొట్ట కోసుకుని కొనే ఆ కాస్త బంగారంలో కూడా ప్రభుత్వం వాటా ఎంతో తెలుసా...?? కస్టమ్స్ డ్యూటీ... విదేశాల నుండి బంగారం వస్తున్నందుకు పన్ను...!! GST... దాన్ని మనం కొంటున్నందుకు పన్ను...!! తరుగు మజూరీ... తయారీ పేరుతో దోపిడీ...!! మొత్తం కలిపి మనం కట్టే 1.5 లక్షల్లో... సుమారు 20 వేల నుండి 25 వేల రూపాయలు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి, వ్యవస్థకు వెళ్తున్నాయి...!! మన రక్తం పిండి వసూలు చేసిన ఈ పన్నులే...!! రేపు ఎలక్షన్లలో అదే బంగారం ఓటుకు 500, 1000 నోట్లుగా మారి మన ముఖాన కొడతారు...!! 3) వ్యవస్థ మీద నమ్మకం లేక...!! మనల్ని పాలించే ప్రభుత్వాలే... "భవిష్యత్తులో ఈ కరెన్సీ నోట్లు చెల్లవు" అని భయపడి, రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి...!! ప్రభుత్వానికే కరెన్సీ మీద నమ్మకం లేనప్పుడు...!! సామాన్యుడి బతుకుకు గ్యారెంటీ ఏది...?? చైతన్యం తెచ్చుకోండి...!! రేట్లు పెరిగాయని బాధపడటం కాదు...!! ఈ వ్యవస్థ మారాలని కోరుకోండి...!! పేదవాడికి బంగారం అనేది ఒక "ఆభరణం" కాదు...!! ఆకలి వేస్తే అమ్ముకునే "ఆస్తుల" భరోసా...!! కానీ ఈరోజు ఆ భరోసాను కూడా మనకు దూరం చేశారు...మన ఓటుతో గెలిచిన నాయకులు...!! మీ బతుకులను బంగారం చేస్తామని చెప్పి, చివరకు మీ తాళిబొట్టు కూడా కొనలేనంత దారుణమైన స్థితికి మనల్ని నెట్టేశారు...!! ఇది చదివాకైనా ఆలోచించండి...!!ప్రశ్నించండి...!! లేకపోతే రేపటి రోజున "బంగారం" అనేది మన పిల్లలకు కేవలం మ్యూజియంలో చూసే వస్తువుగానే మిగిలిపోతుంది...!! ఒక బాధ్యత గల పౌరుడి ఆవేదన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి...🙏 🇮🇳 NRL 🇮🇳 #మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. #గోల్డ్ #గోల్డ్ రేట్
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
648 వీక్షించారు
#శుభోదయం 🙏ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల...శ్రీ పద్మావతీ మహిళా కళాశాల, తిరుపతి... అదెలా వచ్చిందంటే.....ఆ కాలేజీ అంత గొప్ప గా ఎలా అయిందంటే.... - అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో... అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది. - స్వాతంత్ర్యం వచ్చి నాలుగేళ్ళు. స్త్రీ విద్యకు ఆదిలోనే గండిపడింది. తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది. - ఈ గండిని పూడ్చడానికి, 1952లో టీటీడీ ' శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల'ను స్థాపించింది. ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల. - రంగనాయకమ్మ మొదటి ప్రిన్సిపాల్ గా కాలేజీని నెట్టుకొచ్చి, రెండేళ్ళ తరువాత నిష్క్రమించారు. - స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది. అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రెండో ప్రిన్సిపాల్ రాజేశ్వరి మూర్తి 1954 లో మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పగ్గాలు చేపట్టారు. అంతే.. ఆ కళాశాల పరుగులంఘించింది. - శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా 'శ్రీపద్మావతి మహిళా కళాశాల' (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో డిగ్రీ కళాశాలయ్యింది. - అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టి కల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది. మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? అన్నీ రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్పీడబ్ల్యు కళాశాల ఇలా రూపుదాల్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు. - కాకినాడకు సమీపంలోని పెద్దాపురానికి చెందిన ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు. పెళ్ళి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు. - రాత్రి, పగలు అనకుండా కళాశాలే ఆమెకు ఇల్లు అయిపోయింది. అదే ఆమెకు జీవితం అయిపోయింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు; ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో, వాటి కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ వినియోగించారు. - విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు. కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు. - రాష్ట్రంలోనేఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే, అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు. - టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం నిషేధం .రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహారాన్ని బైట ఒండించి విద్యార్థినులకు పెట్టించారు. - ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు, “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే , ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు. - తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొల ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాహహులను కళాశాలకు రప్పించారు. ఒక ఆడ బిడ్డను, తల్లి తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె అలా తీర్చిదిద్దారు. - కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు ఈ కళాశాలవే. టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి. - మరొక ఈవో తో ఆమెకు భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు. - అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు. - కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది. తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు. - ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు. - ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు. న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు! PROF. RAJESWARI MURTHY గారు శత వసంతాలు. తొలి మహిళా కళాశాల రూపుశిల్పి.. డిసెంబర్ 10 వ తేదీన శత జన్మదినం. ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞాన తృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాటలు వేశారు. న్యూయార్క్ లో ఇప్పటికీ సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటున్నారు. ** ** ** ** ** ** ** ** ** ** ** ఈ రోజు మనం గొప్పగా చూసే ప్రతి గొప్ప వ్యవస్ధ వెనకాల ఒక తెలియని వ్యక్తి యొక్క శ్రమ, త్యాగం ఉంటుంది అనేది అక్షర సత్యం...! ఆ గొప్ప వ్యక్తుల్లో ఆంధ్ర వరకు అయినా, రాజేశ్వరి మూర్తి గారు వుంటారు....!!! #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌹🌺🌼🏵 శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యే నమః 🏵🌹🌻💐 #శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి జోత్యీషాలయం #తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
🎡 M.𝚂 𝙰 𝚂 𝙸 2277🎡
1.9K వీక్షించారు
🌺కేన్సర్‌తో బాధపడుతూ వైద్యం చేయించుకుని విసిగి వేసారిన వ్యక్తి మీకు తెలిస్తే మీ అందరినీ అభ్యర్థించండి. దయచేసి వేడి కొబ్బరి నీళ్లు🌺 🌺టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర ఎ. *ఈ వార్తాలేఖను అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు ఫార్వార్డ్ చేయగలిగితే, కనీసం ఒక ప్రాణమైనా తిరిగి రక్షించబడుతుందని బడ్వే నొక్కిచెప్పారు...* నేను ఇప్పటికే చేసాను, మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను. మీ వంతు సహాయం చేయండి. ధన్యవాదాలు! *వేడి కొబ్బరి నీళ్లు మీ జీవితాంతం క్యాన్సర్ నుండి కాపాడుతాయి* *వేడి కొబ్బరికాయ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపుతుంది!* *ఒక కప్పులో 2 నుంచి 3 సన్నగా కొబ్బరి ముక్కలను కోసి, వేడినీళ్లు వేసి, "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే ఎవరికైనా మంచిది.* *వేడి కొబ్బరి నీరు క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది, క్యాన్సర్‌ను సమర్థవంతంగా చికిత్స చేయడానికి వైద్య రంగంలో సరికొత్త పురోగతి.* * వేడి కొబ్బరి రసం అల్సర్ మరియు ట్యూమర్లపై ప్రభావం చూపుతుంది. అన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుందని నిరూపించబడింది.* *కొబ్బరి సారంతో ఈ రకమైన చికిత్స ప్రాణాంతక కణాలను మాత్రమే నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.* *అంతేకాకుండా, కొబ్బరి రసంలోని అమైనో ఆమ్లాలు మరియు కొబ్బరి పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌ను సమర్థవంతంగా నివారిస్తాయి, రక్త ప్రసరణను సర్దుబాటు చేస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.* చదివిన తరువాత, * ఇతరులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పండి, ప్రేమను పంచండి! *మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.🌺 #ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం #ప్రపంచ ఊపిరి తిత్తుల క్యాన్సర్ దినోత్సవం #జాతీయ క్యాన్సర్ అవగాహన దినం #క్యాన్సర్ తో బాధపడుతున్న కందికొండ #బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన
See other profiles for amazing content