ఫాలో అవ్వండి
nvs subramanyam sharma
@nvssharma
1,635
పోస్ట్
3,411
ఫాలోవర్స్
nvs subramanyam sharma
4.5K వీక్షించారు
5 గంటల క్రితం
🌼🌿శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం....🌼🌿 ఓం శిరంవజ్ర కిరీటం - వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణం వజ్ర కుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం - నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం కరం- కరుణాభయసాగరం భుజే -శంఖ చక్రగదాధరం స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబర ధరం పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం సర్వం స్వర్ణమయం - నామం శ్రీ వేంకటేశం శ్రీనివాసం - శ్రీ తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!... 🌼🌿ఓం నమో వెంకటేశాయ నమః🌼🌿 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
nvs subramanyam sharma
523 వీక్షించారు
5 గంటల క్రితం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు కొలువై ఉన్నారు. అయితే ఆ ఏడుకొండల్లో వెంకన్న నివాసం ఉండటం వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. శేషాచలం అడవుల్లోని ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయం ఏడో శిఖరంపై ఉంది. అదేవిధంగా మన శరీరంలోని ఉండే ఏడు చక్రాలు(మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాసతం, విశుద్ధం, ఆజ్ఞ,సహస్రారం)దాటితే ఎంతో మధురానుభూతి కలుగుతుంది. ఈ ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే వెంకన్న ఏడుకొండలపై నివాసం ఉంటాడని చెబుతారు పండితులు. ఇదిలా ఉండగా ఏడు కొండలకు సైతం ఏడు రకాల పేర్లున్నాయి. ఈ సందర్భంగా ఏడుకొండల విశిష్టతలేంటి.. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... శేషాచలం అడవుల్లో.. శేషాచలం అడవుల్లో.. శేషాచలం అడవుల్లో ఏడు వైవిధ్యమైన కొండలున్నాయి. అందులో మొదటిది - అంజనాద్రి రెండోది - వృషబాద్రి, మూడోది - నీలాద్రి నాలుగోది - శేషాద్రి ఐదు - గరుడాద్రి ఆరు - నారాయణాద్రి సప్తమ స్థానంలో - వెంకటాద్రి అనే కొండలున్నాయి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి.. దాని వెనుక కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... అంజనాద్రి విశిష్టత.. అంజనాద్రి విశిష్టత.. హిందూ పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో అంజనాదేవి సంతానం కోసం మాతంగి మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పుష్కరకాలం పాటు కఠోర తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయుసమాన బలవంతుడైన ఆంజనేయుడికి పుత్రుడిగా జన్మనిచ్చింది. అంజనాదేవి తపస్సు చేసిన కొండ కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరొచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. వృషభాద్రి విశిష్టత.. వృషభాద్రి విశిష్టత.. ​పురాణాల ప్రకారం, కృతయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తను శ్రీహరికి పరమవీర భక్తుడు. అయితే తాను ఆ దేవదేవునితోనే యుద్ధం చేయాలని కోరడంతో.. శ్రీ మహావిష్ణువు వృషభాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో తను ఎన్ని ప్రయత్నాలు చేసినా రాక్షసుడిని సంహారం జరగకపోవడంతో ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు శ్రీహరి. సుదర్శన చక్రం మహిమ గురించి తెలిసిన వృషభాసురుడు అక్కడ ఉన్న కొండకు తన పేరు వచ్చేలా వరమివ్వాలని కోరాడు. దీంతో ఆ వరాన్ని నెరవేర్చి తనను సంహరించాడు. అందుకే ఈ కొండకు వృషభాద్రి అనే పేరొచ్చింది. నీలాద్రి విశిష్టత.. నీలాద్రి విశిష్టత.. ఏడుకొండలలోని నీలాద్రి కొండలలో ఒకప్పుడు క్రూరమృగాల సంచారం విపరీతంగా ఉండేది. దీంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి వేంకటేశ్వరుడిని వేడుకుంది. ఆ సమయంలో వెంకన్న స్వామి నీలాద్రిలోని #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
nvs subramanyam sharma
687 వీక్షించారు
5 గంటల క్రితం
*గోవింద గోవింద అని కొలువరే* *అన్నమయ్య సంకీర్తన* గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు .......గోవింద గోవిందా ...... పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు .........గోవింద గోవిందా ...... దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు ..........గోవింద గోవిందా ......� 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿
See other profiles for amazing content