Follow
RAJENDRAPRASAD, M.Com.
@raajendraprasad
9,587
Posts
11,676
Followers
RAJENDRAPRASAD, M.Com.
593 views
22 hours ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *శ్రావణమాస మహాత్మ్యము – 06 షష్ఠాధ్యాయము* (శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం) నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!! సనత్కుమార ఉవాచ: ఓ సాంబమూర్తీ! సంతోషమును కలుగజేసెడి ఆదివార వ్రతమును వింటిని. శ్రావణమాసములో సోమవారమునకు ఉండెడి మహిమను కూడ చెప్పుమని సనత్కుమారుడు అడిగెను. ఈశ్వర ఉవాచ: సాంబమూర్తి చెప్పుచున్నాడు. సూర్యుడు నాకు నేత్రము కాబట్టి, అట్టి సూర్యుని సంబంధమైన ఆదివారమునకు ఇట్టి మహిమ కలిగెను. ఇక సోమవార మహిమను గురించి చెప్పెదను. “ఉమయాసహితః – సోమః” అని చెప్పబడును. అనగా పార్వతీ దేవితో కూడినవాడు సోముడు అని చెప్పబడెను. కాన సోమ శబ్దము నా యందే వర్తించుట వలన సోమవారమనగా నా సంబంధమైన వారమే అగును కాబట్టి, దాని మహిమను చెప్పుటకు నలవియే కాదు. ఈ సోమవారమును గురించి చెప్పదగిన యావత్తు మహిమ నీకు చెప్పెదను. సోమ శబ్దమునకు ఇంద్రుడనియు, బ్రాహ్మణోత్తముడనియు, యజ్ఞమునందు ఉపయోగించు సోమలత అనియు అనేక అర్థములు కలవు. దానియొక్క యథార్థమునంతయు సవిస్తరముగా చెప్పెదను, వినుము. నా స్వరూపమైనది కాబట్టి సోమవారమని చెప్పబడెను. ఈ వ్రతమును చేసినవాడు సమస్త రాజ్యమును ఇచ్చునట్టివాడును, శ్రేష్ఠుడును, సమస్త యజ్ఞముల ఫలమును ఇచ్చునట్టివాడును అగును. అనగా దైవత్వమును పొంది సమస్తమును ఇచ్చువాడగును. ఓ బ్రాహ్మణోత్తమా! ఆ వ్రతమును సవిస్తరముగా చెప్పెదను, వినుము. పండ్రెండు మాసముల యందును సోమవారము మిక్కిలి శ్రేష్ఠమైనదిగా చెప్పబడెను. ఈ పండ్రెండు మాసముల యందును సోమవార వ్రతమును చేయలేని వాడు ఒక్క శ్రావణమాసములో చేసినను సంవత్సరమంతయు చేసిన ఫలము నొందును. శ్రావణ శుద్ధములో మొదటిదియగు సోమవారము నందు వ్రతమును ఆరంభించుచు, “సాంబమూర్తి నా యందు అనుగ్రహము కలవాడై యుండుగాక” అని సంకల్పము చేసి ఆరంభించవలెను. ఇట్లు శ్రావణమాసములో నాలుగుగాని, ఐదుగాని వచ్చెడి సోమవారముల యందు ప్రాతఃకాలంబున సంకల్పము చేసి, రాత్రులయందు షోడశోపచారములచే శివుని పూజించి, నిశ్చలమైన మనస్సుతో శ్రేష్ఠమైన సోమవార వ్రతకథను వినవలయును. కాబట్టి ఈ చెప్పబోవు సోమవార వ్రత విధానమును వినుము. శ్రావణమాసములో మొదటి సోమవారమున ప్రారంభింపవలెను. ప్రాతఃకాలంబున స్నానము చేసి పరిశుద్ధుడై తెల్లని వస్త్రములను ధరించి, కామము, క్రోధము, అహంకారము, ద్వేషము, పిశునతనము మొదలగు దుష్టగుణములను విడువవలయును. మాలతీ, మల్లిక మొదలగు తెల్లని పువ్వులను తెచ్చి, త్ర్యంబక మంత్రచే పూజించి, పిమ్మట షోడశోపచారముల చేతను శివునకు ముందు చెప్పబోవు రీతిని పూజ చేయవలయును. శర్వాయ, భవనాయ, మహాదేవాయ, ఉగ్రాయ, ఉగ్రనాథాయ, భవాయ, శశిశేఖరాయ, రుద్రాయ, నీలకంఠాయ, శివాయ, భవహారిణే — ఈ మొదలైన రుద్రుని నామములచే తన శక్తికొలది షోడశోపచారాలు చేసి సాంబమూర్తిని పూజించినయెడల వారికి కలుగు ఫలము చెప్పెదను, వినుము. పార్వతీసహితుడైన సాంబమూర్తిని సోమవారము నందు పూజించిన వారు ఎప్పుడును నశింపనివియు, పునరావృత్తిరహితమైన లోకములను పొందుదురు. ఈ మాసములో నక్త భోజనము చేసినందువలన కలిగెడు పుణ్యమును సంక్షేపముగా చెప్పెదను, వినుము. ఏడు జన్మములందు చేయబడినదియు, దేవతలు, రాక్షసులు మొదలగు వారిచేతనైనను పోగొట్టబడుటకు సాధ్యముకాని పాపమైనను శ్రావణమాసములో నక్త భోజనము వలన నశింపగలదు. ఈ విషయమై సందేహమేమియు లేదు. శ్రేష్ఠమైన ఈ సోమవార వ్రతమును ఉపవాసముండి చేసిన యెడల పుత్రులను కోరినవాడు పుత్రులను, ధనమును కోరినవాడు ధనమును, మరియు ఏయే కోరికలను కోరుచున్నాడో వానినన్నిటిని పొందగలడు. ఈ లోకమున తాను కోరిన కోరికలనన్నియు అనుభవించి, చిరకాలము జీవించి, జన్మాంతమున శ్రేష్ఠమైన దేవతా విమానమునెక్కి కైలాసము చేరగలడు. బుద్ధి, ధనము, ప్రాణము ఇవియన్నియు స్థిరములు కానివి. కాబట్టి ఎప్పుడు నశించిపోవునో అని తెలిసికొని సమస్త విధముల త్వరలోనే ఈ వ్రతమునకు ఉద్యాపనము చేయవలయును. వెండితో వృషభ వాహనమును, బంగారముతో పార్వతీ-పరమేశ్వరుల ప్రతిమలను తన శక్తికొలది చేయించవలయును. శక్తి యుండగా లోభించకూడదు. శ్రేష్ఠమైనదియు, శుభప్రదమైనదియు, లింగాకారముగా ఒక మండపమేర్పరచి, అచ్చట రెండు తెల్లని వస్త్రములతో చుట్టబడిన కలశమును ఉంచవలయును. దాని పైన రాగి పాత్రగాని, వెదురు పాత్రగాని ఉంచి, పార్వతీ సహితుడైన శివప్రతిమను ఉంచవలయును. పుష్పములు మొదలగు వానిచే మండపమును శుభప్రదముగా అలంకరించి, వేదమంత్రములు, స్మృతులు, పురాణములు మొదలగు వానిచే చెప్పబడిన మంత్రములచే సాంబమూర్తిని యథావిధిగా పూజింపవలయును. గీత, వాద్యము మొదలగు వానిచే రాత్రి జాగరణము చేయవలయును. తమ శాఖయందు చెప్పబడిన ప్రకారముగా అగ్ని ప్రతిష్ఠాపన చేసి, శర్వాయ మొదలగు పదకొండు నామములతోను, మోదుగ సమిధలను ఉంచుచు నూట ఎనిమిది పర్యాయములు హోమము చేయవలయును. “ఆప్యాయస్వ” అను మంత్రమును ఉచ్చరించుచు యవలు, వ్రీహులు, నువ్వులు మొదలగు వానితోను, “త్ర్యంబకం” అను మంత్రమును గాని, ఆరు అక్షరములు గల శివ పంచాక్షరీ మంత్రమును గాని పఠించుచు మారేడు దళములతో హోమము చేసి, స్విష్టకృత్ మొదలగునవియు చేసి, పిమ్మట పూర్ణాహుతి హోమము గావించి, పిమ్మట ఆచార్యుని పూజించి, గోదానము మొదలగు దానములు ఇవ్వవలయును. అనంతరం సద్గుణములు గల పదకొండు మంది బ్రాహ్మణులను భోజనం పెట్టి, వారికి వెదురు పాత్రలతో కూడిన పదకొండు కలశములను ఇవ్వవలయును. అనంతరం పూజింపబడిన శివుని ప్రతిమను అక్కడ ఉంచబడిన ఉపకరణములతో కూడ ఆచార్యునకు దానమిచ్చి, అనంతరం “ఆ వ్రతము సంపూర్తియగుగాక, శివుడు నా యందు అనుగ్రహము కలవాడై యుండుగాక” అని ప్రార్థింపవలయును. అనంతరం సంతోషమైన మనస్సుగలవాడై బంధువులు మొదలగు వారితో కూడి భుజింపవలయును. ఈ ప్రకారముగా ఎవడీ వ్రతమును చేయుచున్నాడో వాడు తాను కోరిన కోరికలన్నియు పొందగలడు. అనంతరం కైలాసమును చేరి, అచ్చట శాశ్వతముగా ఉండగలడు. ఈ సోమవార వ్రతమును పూర్వము కృష్ణమూర్తి మరియు ధర్మమార్గమునందు ఆసక్తిగల అనేక రాజులు ఆచరించిరి. కాబట్టి ఈ కథను విన్నవారు సోమవార వ్రతమును చేసిన ఫలము పొందువారగుదురు. || ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర-సనత్కుమార సంవాదే సోమవార వ్రతకథనం నామ షష్ఠోధ్యాయః సమాప్తః ||
RAJENDRAPRASAD, M.Com.
382 views
1 days ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - ఆవిఘ్నమస్తు, తేదీ ... 18 - 08 - 2026, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం, తిథి : *షష్ఠి* రా7.27 వరకు, నక్షత్రం : *చిత్ర* ఉ7.43 వరకు, యోగం : *శుభం* ఉ7.07 వరకు, కరణం : *కౌలువ* ఉ7.13 వరకు, తదుపరి *తైతుల* రా7.27 వరకు, వర్జ్యం : *మ1.39 - 3.21* దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.07* మరల *రా10.54 - 11.40* అమృతకాలం : *రా11.50 - 1.32* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి : సింహం, చంద్రరాశి : తుల, సూర్యోదయం : 5.46, సూర్యాస్తమయం : 6.23, *_నేటి విశేషం_* *శ్రావణమంగళగౌరీ వ్రతము* గౌరీ దేవి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం నాడు భూసంచారం చేసి, తాను చెప్పిన విధంగా చేసిన స్త్రీలను అనుగ్రహిస్తాను అని మాట ఇచ్చినట్లు పురాణ కథనాలు ఎన్నో ఉన్నాయి, భూలోకంలో అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ద్వారా మంగళ గౌరీ వ్రతాన్ని అమ్మ వ్యాపింపచేసింది. ఈ వ్రతం చేసిన వారింట్లో గౌరీ దేవి కొలువై ఉంటుందని , స్త్రీలకు శాశ్వతంగా ముత్తైదువగా ఉండే వరాన్నిస్తుందని మనకు తెలిసిన విషయం... *చేయవలిసిన విధులు:* 1) కొత్త పెళ్లి కూతురు తప్పనిసరిగా శ్రావణ మంగళవార నోము నోచుకోవాలి. 2) పెళ్ళైన దగ్గరినుండి ఐదేళ్లు విడిచిపెట్టకుండా చేసుకోవాలి. 3) గణపతిని పూజించాలి తరువాత మళ్ళీ శుభ్రవస్త్రం ధరించాలి. మంగళ గౌరి వ్రతమునకు కట్టుకొన్న వస్త్రాలను మళ్ళీ మరొక వ్రతమునకు వాడకూడదు. 4) నాలుగు శేర్లకు తక్కువ కాకుండా శనగలు ఉదయన్నే నానబెట్టాలి, 5) మంగళవారం అమ్మను పూజించాలి, గౌరీ దేవికి షోడశోపచారాలు చేయాలి, వ్రత కథ చదవాలి, అమ్మని భక్తితో పూజించాలి. సాయంత్రం లేదా పూజ అనంతరం పగలు కానీ శనగలు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు పసుపు, గంధం పూసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, గాజులు, వస్త్రములతో తాంబూలం ఇవ్వాలి. 6) నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి, బాగా పొగ వచ్చేటట్టు చేసి ఇనుప గరిట పెట్టి కాటుక పట్టాలి. ఆ కాటుకను తాము పెట్టుకొని ముత్తైదువలకు ఇవ్వాలి. 7) తాజా ఆవు నెయ్యినే వాడాలి, తాజా ఆవు నెయ్యి దొరకనప్పుడు తాజా నువ్వుల నునె మాత్రమే కాటుక పట్టడానికి వాడాలి. 8) గురు దంపతులను, పెద్ద దంపతులను పూజించాలి. 9) ఈ వ్రతం చేసిన వారికి అమ్మ అనుగ్రహం వల్ల చర్మమునుకు సంబంధించిన రోగాలు పోయి కాంతివంతం అవుతుంది అని కథనాలు ఎన్నో ఉన్నాయి. *_🌷శుభమస్తు🌷_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
RAJENDRAPRASAD, M.Com.
827 views
1 days ago
#💮నాగ పంచమి శుభాకాంక్షలు🐍 17-08-2026 నాగులపంచమి 🐍 శుభాకాంక్షలు శ్రావణమాసం మొదటి సోమవారం
RAJENDRAPRASAD, M.Com.
500 views
1 days ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🔔 *విశేషం* 🔔 🐍🙏 నాగపంచమి వెయ్యి నాగులు జన్మించారు… కానీ ఈ తొమ్మిది నాగులనే ప్రత్యేకంగా ఎందుకు స్మరిస్తాం? నాగపంచమి రోజు నాగదేవతలను పూజిస్తాం… పుట్టలను, నాగప్రతిమలను దర్శిస్తాం… కుటుంబ క్షేమం, సంతాన శ్రేయస్సు కోసం ప్రార్థిస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? నాగులను ఎందుకు దేవతలుగా ఆరాధిస్తున్నాం? నాగజాతి ఎక్కడి నుంచి వచ్చింది? పురాణాల్లో వెయ్యి మంది నాగుల ప్రస్తావన ఉన్నప్పుడు అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళియుడు — ఈ తొమ్మిది నాగనామాలకు ఎందుకు అంతటి విశిష్టత వచ్చింది? నాగపంచమి నాడు తప్పక తెలుసుకోవాల్సిన అద్భుతమైన పురాణ ప్రయాణం ఇది. 🌿 నాగజాతి ఆది మూలం సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మదేవుని మానసపుత్రుల పరంపరకు చెందిన కశ్యప ప్రజాపతికి దితి, అదితి, వినత, కద్రువ మొదలైన భార్యలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. వారిలో దక్ష ప్రజాపతి కుమార్తె కద్రువ ఒక విశేషమైన వరాన్ని కోరుకుంది. “మహా తేజస్సు, అపార పరాక్రమం కలిగిన వెయ్యి మంది సర్ప సంతానం నాకు కలగాలి.” ఆమెకు వెయ్యి అండాలు లభించాయి. కాలక్రమంలో వాటి నుంచి వెయ్యి మంది నాగులు ఆవిర్భవించినట్లు మహాభారత సంప్రదాయం చెబుతుంది. కద్రువ సోదరి వినత మాత్రం ఇద్దరు మహాపరాక్రమవంతులైన పుత్రులను కోరుకుంది. ఆమెకు అరుణుడు, గరుత్మంతుడు జన్మించారు. ఇక్కడి నుంచే నాగజాతి చరిత్రలోని ఎన్నో మహత్తర పురాణ ఘట్టాలకు బీజం పడింది. 🐍 మరి నాగులు ఎంతమంది? పురాణాల్లో నాగజాతి అపారంగా విస్తరించినట్లు చెప్పబడుతుంది. అయితే కద్రువకు జన్మించిన ప్రధాన సర్ప సంతానం వెయ్యి అని మహాభారత సంప్రదాయం చెబుతుంది. వారిలో కొందరు మహాబలశాలులు… కొందరు తపోనిష్ఠులు… కొందరు దేవతల కార్యాలలో భాగస్వాములు… మరికొందరు శ్రీమహావిష్ణువు, పరమశివుడు, శ్రీకృష్ణుని దివ్యలీలలతో అనుసంధానమయ్యారు. అలాంటి నాగులలో తరతరాలుగా ప్రత్యేకంగా స్మరించబడుతున్న తొమ్మిది నామాలు: అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ । శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ॥ ఇవి కేవలం తొమ్మిది పేర్లు కావు… ఒక్కో నాగనామం వెనుక ఒక్కో పురాణగాథ ఉంది. ఒక్కో గాథ వెనుక ఒక్కో ఆధ్యాత్మిక సందేశం ఉంది. 🔱 ① అనంతుడు — విశ్వాన్నే ధరించిన ఆదిశేషుడు నాగజాతిలో అత్యంత మహిమాన్వితమైన నామాలలో మొదటిది అనంతుడు — ఆదిశేషుడు. తల్లి, సోదరుల అధర్మ ప్రవర్తనతో విరక్తి చెందిన శేషుడు ఘోరమైన తపస్సు చేసినట్లు మహాభారతం చెబుతుంది. అతని ధర్మనిష్ఠకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై భూమిని స్థిరంగా ధరించే మహత్తర బాధ్యతను అప్పగించాడు. అంతేకాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు శేషతల్పంగా సేవించే మహాభాగ్యాన్ని పొందాడు. విశ్వం మారుతున్నా… భగవంతుని సేవలో స్థిరంగా నిలిచే తత్వం — అదే అనంతతత్వం. 🕉️ ② వాసుకి — లోకక్షేమం కోసం తన శరీరాన్నే అర్పించిన నాగరాజు క్షీరసాగర మథనంలో దేవతలు, దానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించాల్సి వచ్చింది. మందర పర్వతం కవ్వంగా సిద్ధమైంది. కానీ మథనానికి త్రాడు కావాలి. అప్పుడు ఆ మహాకార్యంలో భాగమైన నాగరాజు వాసుకి. తన శరీరాన్నే మథన త్రాడుగా ఇచ్చాడు. వేదనను భరించాడు. లోకకార్యంలో భాగస్వామి అయ్యాడు. పరమశివుని కంఠాన్ని అలంకరించే నాగరూపంతోనూ వాసుకి ప్రసిద్ధుడు. దైవకార్యంలో సమర్పణ ఉంటే… బాధ కూడా త్యాగంగా మారుతుంది. 🙏🏻 ③ శేషుడు — సేవకు ప్రతిరూపం ‘శేష’ అనే మాటలోనే ఒక గొప్ప భావం ఉంది — భగవంతునికి సంపూర్ణ సేవ. వైష్ణవ సంప్రదాయంలో ఆదిశేషునితో లక్ష్మణుడు, బలరాముడు అనుసంధానించబడతారు. త్రేతాయుగంలో శ్రీరామునికి నీడలా నిలిచిన లక్ష్మణుడు… ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని అన్నగా నిలిచిన బలరాముడు… యుగం మారింది… రూపం మారింది… కానీ సేవాభావం మారలేదు. శేషతత్వం అంటే అధికారం కాదు… సమర్పణ. 🌺 ④ పద్మనాభుడు — భూమి గర్భంలోని సంపదకు ప్రతీక నవనాగులలో మరో విశిష్ట నామం పద్మనాభుడు. పద్మం మన సంప్రదాయంలో పవిత్రతకు, వికాసానికి, అంతర్గత చైతన్యానికి ప్రతీక. కొన్ని సంప్రదాయాల్లో పద్మనాభ నాగుడు భూగర్భ సంపద, జలతత్వం, రక్షణ వంటి భావాలతో అనుసంధానించబడతాడు. మన కంటికి కనిపించేది మాత్రమే సృష్టి కాదు… కనిపించకుండా మనల్ని పోషించేది కూడా సృష్టే. 🎶 ⑤ కంబలుడు — నాదోపాసనతో ముడిపడిన నాగనామం పురాణ సంప్రదాయాల్లో కంబలుడు, అశ్వతరుడు జంటగా ప్రస్తావించబడతారు. కొన్ని పురాణ కథల్లో సంగీతం, నాదం, దైవోపాసనతో వీరి అనుబంధం కనిపిస్తుంది. నాగం అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది విషం కావచ్చు. కానీ పురాణం మరో కోణాన్ని చూపిస్తుంది. నాగతత్వంలో తపస్సు ఉంది… ఉపాసన ఉంది… నాదం ఉంది… దైవస్మరణ ఉంది. 🐚 ⑥ శంఖపాలుడు — బలం ఉన్నా శాంతిని ఎంచుకున్న తత్వం శంఖపాలుడు అనే నాగనామం వివిధ పురాణ, ఇతిహాస సంప్రదాయాల్లో కనిపిస్తుంది. శాంతి, సహనం, తపస్సు వంటి భావాలతో అతని కథలు అనుసంధానించబడ్డాయి. బలం ఉండటం గొప్ప కాదు… ఆ బలాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడం గొప్ప. 🔥 ⑦ ధృతరాష్ట్ర నాగుడు — నాగవంశంలోని మహాబలశాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం — ఇతడు మహాభారతంలోని కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు కాదు. ధృతరాష్ట్ర అనే నాగప్రముఖుడు. పురాణ సంప్రదాయాల్లో నాగులు పాతాళలోకాలు, దిక్కులు, ప్రకృతి శక్తులతో అనుసంధానించబడిన సందర్భాలు కనిపిస్తాయి. ఆ విశాలమైన నాగపరంపరలో ధృతరాష్ట్రుడు కూడా ఒక ప్రముఖ నాగనామంగా స్మరించబడుతున్నాడు. ⚡ ⑧ తక్షకుడు — ఇతని వల్ల ఒక మహాయజ్ఞమే ప్రారంభమైంది! నవనాగులలో అత్యంత ఉత్కంఠభరితమైన కథ తక్షకుడిది. ఋషిపుత్రుని శాపం ఫలితంగా తక్షకుని కాటు వల్ల పరీక్షిత్తు మహారాజు మరణించాడు. తండ్రి మరణంతో ఆగ్రహించిన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు నాగజాతినే అంతం చేయాలని సర్పసత్రాన్ని ప్రారంభించాడు. యజ్ఞాగ్నిలో నాగులు పడసాగారు. ఒక జాతి మొత్తం వినాశనం అంచుకు చేరింది. అప్పుడు వచ్చాడు ఆస్తీక మహర్షి. తన జ్ఞానంతో జనమేజయుడిని ప్రసన్నం చేసి సర్పసత్రాన్ని ఆపించాడు. నాగజాతి రక్షించబడింది. ప్రతీకారం వినాశనాన్ని మొదలుపెట్టగలదు… కానీ జ్ఞానం ఆ వినాశనాన్ని ఆపగలదు. 🦚 ⑨ కాళియుడు — విషంతో మొదలైన కథ… భగవంతుని పాదస్పర్శతో మారిపోయింది యమునా జలాలను విషపూరితం చేసిన మహాసర్పం కాళియుడు. అతని విషం వల్ల పరిసరాలు ప్రమాదకరంగా మారాయి. అప్పుడు బాలకృష్ణుడు యమునలోకి దిగాడు. కాళియుని పడగలపైకి ఎక్కి నాట్యం చేశాడు. ఒక్కొక్క పడగ వంగింది… గర్వం కరిగింది… అహంకారం అణిగిపోయింది… చివరకు మిగిలింది శరణాగతి. అప్పుడు శ్రీకృష్ణుడు కాళియుని సంహరించలేదు. మారే అవకాశం ఇచ్చాడు. తన పాదముద్రలతో అభయాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్లమని ఆదేశించాడు. మనలో ఎంత విషం ఉన్నా… మన గతంలో ఎన్ని తప్పులు ఉన్నా… మనలో ఎంత అహంకారం ఉన్నా… భగవంతుని పాదాల వద్ద నిజమైన శరణాగతి మొదలైతే మన కథ అక్కడితో ముగియదు. అక్కడి నుంచే కొత్త జీవితం మొదలవుతుంది. 🌿 మరి నాగపంచమి ఎందుకు? నాగం మన పురాణాల్లో కేవలం ఒక సర్పం కాదు. శ్రీమహావిష్ణువుకు శయ్యగా మారింది — ఆదిశేష రూపంలో. పరమశివుని కంఠాన్ని అలంకరించింది — నాగరూపంలో. క్షీరసాగర మథనానికి సహకరించింది — వాసుకి రూపంలో. శ్రీకృష్ణుని పాదస్పర్శ పొందింది — కాళియుని రూపంలో. అంటే… హరి దగ్గర నాగం ఉంది… హరుని దగ్గర నాగం ఉంది… కృష్ణలీలలో నాగం ఉంది… ప్రకృతిలో నాగం ఉంది. అందుకే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో నాగానికి అంతటి విశిష్ట స్థానం. 🙏🏻 నాగపంచమి మనకు చెప్పే అసలు సందేశం ఈ భూమి మనిషిదే కాదు. పక్షులకు స్థానం ఉంది… పశువులకు స్థానం ఉంది… వృక్షాలకు స్థానం ఉంది… కీటకాలకు స్థానం ఉంది… సర్పాలకు కూడా స్థానం ఉంది. ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక పాత్ర ఉంది. అందుకే నాగపంచమిని కేవలం భయం నుంచి పుట్టిన పూజగా కాకుండా, సృష్టి పట్ల గౌరవాన్ని, సహజీవనాన్ని, దైవంతో ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజుగా చూడాలి. 🔱 ఈ నాగపంచమి నాడు… ఆదిశేషుడి నుంచి స్థిరత్వాన్ని నేర్చుకుందాం. వాసుకి నుంచి త్యాగాన్ని నేర్చుకుందాం. శేషతత్వం నుంచి సేవను నేర్చుకుందాం. తక్షకుని కథ నుంచి ప్రతీకారం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో గుర్తుంచుకుందాం. ఆస్తీకుని నుంచి జ్ఞానం వినాశనాన్ని కూడా ఆపగలదని తెలుసుకుందాం. కాళియుని కథ నుంచి ఎంతటి విషమైన మనసైనా భగవంతుని స్పర్శతో మారగలదనే ఆశను పొందుదాం. అప్పుడు నాగపంచమి కేవలం ఒక పండుగగా మిగిలిపోదు… మనిషి — ప్రకృతి — దైవం మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధాన్ని గుర్తుచేసే మహోత్సవంగా మారుతుంది. 🐍 నవనాగ స్మరణ అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ । శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ॥ 🙏🏻 ఈ నాగపంచమి సందర్భంగా నాగదేవతలను భక్తితో స్మరిస్తూ… మన కుటుంబాలకు క్షేమం కలగాలని, సంతానానికి శుభం కలగాలని, మన వంశం వృద్ధి చెందాలని, ప్రకృతిలోని సమస్త జీవరాశి క్షేమంగా ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. నాగదేవతల అనుగ్రహం అందరిపై ఉండుగాక. 🙏🏻