ఫాలో అవ్వండి
Balaji Rayol
@vijayalaxmi980
56,243
పోస్ట్
19,882
ఫాలోవర్స్
Balaji Rayol
428 వీక్షించారు
శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం : స్వర్ణముఖి నదీతీరాన ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి. మూగజీవాలకు సైతం పరమేశ్వరుడు మోక్షపదవిని అనుగ్రహించిన మహాపుణ్యస్థలి. పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు కొలువుదీరిన సద్యోముక్తి క్షేత్రం ఈ దక్షిణ కైలాసం. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఇరువైపులా వున్న దీపతోరణం గాలికి రెపరెపలాడుతూ వెలుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడి శివలింగం వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి శివలింగం సద్యోజాత మూర్తి. దర్శించిన వెంటనే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించలేని వాళ్ళు మా భక్తి టీవీ ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించి ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి.. ఆనంద సుఖసంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
Balaji Rayol
401 వీక్షించారు
భారత్ - పాక్ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్... భారత్-పాక్ క్రికెట్ వార్‌కి లైన్ క్లియర్.... ఫిబ్రవరి 15న మహాసంగ్రామమే! కొలంబోలో బిగ్ ఫైట్ గ్యారెంటీ!!... టీ20 వరల్డ్‌కప్ 2026లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు చివరికి క్లియరెన్స్ లభించింది. ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన ఈ కీలక పోరు యథావిధిగా జరుగుతుందని అధికారికంగా తేలింది.పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో, బాయ్‌కాట్ వివాదానికి ముగింపు పలికినట్టయింది. ఇటీవల ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య లాహోర్‌లో జరిగిన సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ సమావేశంలో భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్తాన్ వైఖరిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించిన అనంతరం, మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిని పీసీబీ ప్రతినిధి అమిర్ మీర్ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. షెహబాజ్ షరీఫ్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ జరగాలని శ్రీలంక క్రికెట్ బోర్డు గతంలోనే పీసీబీకి విజ్ఞప్తి చేసింది. మ్యాచ్ రద్దయితే శ్రీలంకకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పింది. శ్రీలంక క్రికెట్ బోర్డు తన లేఖలో గతంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్ ఒంటరిగా ఉన్న సమయంలో తాము వారికి మద్దతుగా నిలిచామని గుర్తు చేసింది. ఇప్పుడు అదే విధంగా సహకరించాలని కోరింది. ఈ వివాదానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ వ్యవహారమే. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తొలగించారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఐసీసీ బంగ్లాదేశ్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి ఆర్థిక, పరిపాలనా లేదా క్రీడాపరమైన శిక్షలు విధించబోమని ప్రకటించింది. అంతేకాదు, 2031 వరల్డ్‌కప్‌కు ముందు ఒక ఐసీసీ టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించేందుకు అంగీకరించింది. అలాగే బంగ్లాదేశ్‌కు వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ) వద్ద న్యాయం కోరే హక్కు ఉందని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని వెల్లడించింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ఆదాయం తెచ్చే మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టికెట్లు, టీవీ హక్కులు, ప్రకటనల ద్వారా ఐసీసీతో పాటు హోస్ట్ దేశాలకు భారీ లాభం లభిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లి ఉండేది. ఇక భారత జట్టు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. శిక్షణ, మీడియా సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్లు అన్నీ ప్లాన్ ప్రకారమే కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీ20 వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలవనుందని ఇప్పటికే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. #🌅శుభోదయం #🆕Current అప్‌డేట్స్📢 #🏏క్రికెట్ 🏏
Balaji Rayol
428 వీక్షించారు
*10-02-2026-మంగళవారం* *🌷నేటి రాశి ఫలితాలు🌷* మేషం నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది. వృషభం వ్యాపారపరంగా భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మిధునం చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సింహం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తుల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చికం పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు. ధనస్సు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు. మకరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుంభం కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. మీనం రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ************************ *శుభమస్తు!* ________________________ *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.* #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #♌నేటి రాశిఫలాలు
See other profiles for amazing content