మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం

PSV APPARAO
1.1K views
3 months ago
#ధనుర్మాసం నెలగంట సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం పూజలు #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) కార్యనిర్వహణాధికారి కార్యాలయం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాలు తేదీ 10,డిసెంబర్ 2025, బుధవారం. డిసెంబర్ 16 నుండి జనవరి 19 వరకు ప్రత్యేక ఉత్సవాలు, దర్శన వేళల్లో మార్పులు ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో రాబోయే ధనుర్మాసం సందర్భంగా పలు ప్రత్యేక ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా భక్తుల దర్శన వేళల్లో మరియు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చోటుచేసుకుంటాయి. ధనుర్మాసం ప్రారంభం 16.12.2025 మధ్యాహ్నం గం. 01:01 నిమిషాలకు శ్రీ స్వామివారి సన్నిధిలో "నెలగంట పెట్టుట" (ధనుర్మాసం ప్రారంభం) జరుగును. (16.12.2025): ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆ రోజు ఉదయం సుమారు గం. 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 02:30 నిమిషాల వరకు స్వామివారి దర్శన నిలుపుదల చేయబడును. తేది. 20.12.2025 నుండి తేది. 29.12.2025 వరకు. ఈ పది రోజుల పాటు దేవాలయంలో శ్రీ స్వామివారి పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు మరియు కనుమ పండుగ సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారి తిరువీధి ఉత్సవములు, విశేష సేవలు జరుగును. ఈ ప్రత్యేక ఉత్సవాల కారణంగా, పైన పేర్కొన్న తేదీలలో (20.12.2025 నుండి 29.12.2025 వరకు) నిత్యము జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. తేది. 30.12.2025 నుండి తేది. 09.01.2026 వరకు రాపత్తు ఉత్సవములు జరుగును. ఈ సందర్భంలో ప్రతి రోజు సాయంత్రం గం. 05:00 లకు శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవములు వైభవంగా జరుగును. రాపత్తు ఉత్సవాల కారణంగా, ఈ తేదీలలో (30.12.2025 నుండి 09.01.2026 వరకు) రాత్రి గం. 07:00 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనములు లభించును.రాత్రి దర్శన వేళల్లో మార్పులు గమనించ గలరు. కుడారై ఉత్సవం తేది: 11.01.2026 ఆ రోజు గం. 09:00 నుండి గం. 10:30 వరకు శ్రీ స్వామి వారి దర్శనాలు నిలిపివేయబడును. సుప్రభాతం & ఉదయం ఆరాధన టిక్కెట్ల రద్దు తేదీలు: 16.12.2025 నుండి 19.01.2026 వరకు ధనుర్మాసం దృష్ట్యా ఈ కాలంలో: సుప్రభాతం సేవ ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు చేయబడుచున్నవి. గోదా కళ్యాణం — భోగి పండుగ తేది: 14.01.2026 గోదా కళ్యాణం — భోగి పండుగఈ రోజు ప్రత్యేకంగా "గోదా కళ్యాణం" సాయంత్రం 05:00 నుండి 06:30 వరకు వైభవంగా జరగును. సాధారణంగా ఉదయం జరుగు నిత్యకళ్యాణం ఈ రోజు గోదా కళ్యాణంతో కలిపి సాయంత్రం జరుగును. భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా దేవస్థానం కోరుచున్నది. సహస్రనామార్చన టిక్కెట్ల రద్దు తేదీలు: 30.12.2025 నుండి 19.01.2026 వరకు ఈ తేది లలో సహస్రనామార్చన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును. భక్తులకు వినతి పైన తెలిపిన తేదీలు, సమయాలు, దర్శన మార్పులు, రద్దు చేయబడిన ఆర్జిత సేవలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ దర్శన, సేవ కార్యక్రమాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవలసిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది మీడియా మాధ్యమాలు— దినపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా పై సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. సుజాత ఎన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
763 views
4 months ago
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంలో శుక్రవారం.. మాఘ మాసంలో ఆదివారం.. కార్తీక మాసంలో సోమవారం.. మార్గశిర మాసంలో గురువారం.. అత్యంత పవిత్రమైన, విశిష్టమైన రోజులుగా భావిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీదేవికి ప్రతి రూపమైన శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. అయితే.. ఈసారి వచ్చే గురువారం అంటే డిసెంబర్‌ 4వ తేదీన మార్గశిర మాసం గురువారంతో పాటు పౌర్ణమి కూడా ఇదే రోజున వచ్చింది. ఈ రోజున శ్రీమహాలక్ష్మీని, చంద్రుడిని పూజిస్తే మంచిదని అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. మార్గశిర పౌర్ణమి తిథి ప్రారంభం హిందూ పంచాంగం ప్రకారం.. మార్గశిర పౌర్ణమి తిథి 2025 డిసెంబర్ 4వ తేదీన గురువారం ఉదయం 8.37 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున 4.43 గంటలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి 2025 జరుపుకుంటారు. ఇదే రోజు ఉదయం 06.59 గంటల నుంచి మధ్యాహ్నం 02.54 గంటల వరకు రవియోగం ఉంటుంది. ఈ రవి యోగంలో పవిత్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05.10 గంటల నుంచి ఉదయం 6.04 గంటల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం: ఉదయం 11.50 గంటల నుంచి మధ్యాహ్నం 12.32 గంటల వరకు ఉంటుంది. మార్గశిర పౌర్ణమి రోజు చంద్రోదయ సమయం సాయంత్రం 4.35 గంటలకు ప్రారంభమవుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు రాహుకాలం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.00 గంటల వరకు ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం వల్ల ఏడాదిలో మిగిలిన పదకొండు మాసాల్లో కూడా అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని చెబుతారు. అలాగే మార్గశిర పౌర్ణమి రోజు దానధర్మాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్ర దోషం తగ్గి మానసిక రుగ్మతలు, ఆందోళన వంటివి తగ్గ మానసిక శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో లేదా దేవాలయంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినా, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం కథ విన్నా ఎంతో శుభప్రదం. #తెలుసుకుందాం #మార్గశిరమాసం #మార్గశిర మాసం #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం
PSV APPARAO
784 views
4 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #మోక్షానికి మార్గం మార్గశిర మాసం *మార్గశిరం* మాసానాం మార్గశీర్షాహం'(మాసాల్లో మార్గ శిర మాసాన్ని నేనే) అంటాడు గీతాచార్యుడు. చాంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదో మాసం- మార్గశిరం. చంద్రుడు మృగశిర నక్ష త్రంలో ఉండే నెల ఇది. ప్రకృతి కాంతకు సీమంతంగా, తుషార బిందువుల హేమంతంగా కవులు దీన్ని అభివర్ణించారు. 'మార్గశీర్షం' అనే మాట జన వ్యవహారంలో మార్గశిరంగా మారింది. ఈ మాసానికి పూర్వం 'అగ్ర హోమాగ్ని' అనే పేరు ఉండేది. ఇదే మాసంతో సంవత్సరం ప్రారంభమ య్యేదనీ కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని భక్తులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో విష్ణువును పూజించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజూ ప్రాతఃకాలం నన్ను స్మరించేవారికి, సదా ప్రార్ధించే భక్తులకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటాను' అని మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మకు వివరించాడని 'విష్ణుపురాణం' చెబుతోంది. మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలంటారు. తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని తాకాలని, 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని పఠించాలని, పుణ్య నదుల్ని స్మరిస్తూ పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. మహావిష్ణువును తులసి దళాలతో పూజి స్తారు. ఆ స్వామి చేతిలో ధరించిన శంఖాన్ని సైతం పూజించడం, భక్తజనులు పాటించే ఒక సంప్రదాయం. 'పాంచజన్యమా! నీ నాదం అసామాన్యం. అది ఆలకిం చిన వెంటనే, దేవతలందరూ ఒక్కటై వచ్చేలా చేయగలిగిన ఘనత నీది నీకు సాదర నమస్కారం. నీ కాంతి ప్రభఅత్యంత అనుపమానం. అది పదివేల చంద్రుల కంటే అధికం' అని భక్తులు శ్లోక సహితంగా స్తుతిస్తారు. సూర్యనారాయణ రూపుడైన విష్ణువు, ష్ణువు, వృశ్చికం నుంచి ధనూరాశిలోకి రాశిలోకి ప్రవేశించే కాలం ఇది. ఇదే నెలలో ధను ర్మాసం ప్రారంభమవుతుంది. విష్ణువును యోగనిద్ర నుంచి మేల్కొలుపుతూ ఆరాధకులు 'ధనుర్మాస వ్రతం' ఆచరిస్తారు. కొందరు కాత్యాయనీ వ్రతం ఎంతో నిష్ఠగా నిర్వ ర్తిస్తుండటం చిరకాల సంప్రదా యంగా వస్తోంది. అనేక పర్వాలకు, పండుగ లకు మార్గశిరం నెలవు. మార్గ శిర లక్ష్మీవారాలు ఆ దేవిని పూజించేందుకు ఉత్తమమైన రోజులని భావిస్తారు. గురువా రాన్ని 'లక్ష్మీవారం' అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్ర హ్మణ్య షష్ఠి'గా ప్రసిద్ధి చెందింది. ఈ షష్ఠి శివతన యుడైన కుమారస్వామికి ప్రియమైన తిథి కావడంతో, కొన్నిచోట్ల దీన్ని 'సుబ్బరాయ షష్టి'గా ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి అనేది- వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశిగా విఖ్యాతి చెందింది. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి చేసే దైవ దర్శనం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఏకాదశి 'గీతా జయంతి గానూ ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో శిఖరాయమానంగా కీర్తించే 'భగవద్గీత'ను ప్రవచించిన రోజుగా ఈ ఏకాదశిని పరిగణిస్తారు. మార్గశిర శుక్లపక్ష త్రయోదశినాడు 'హనుమత్ వ్రతం ఆచరిస్తారు. స్వామిని షోడశోపచారా లతో పూజిస్తారు. గోధుమ అప్పాలు, గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తి పూర్వకంగా తోరాన్ని ఏడాదిపాటు ధరిస్తారు. మార్గశిర పూర్ణిమను 'దత్త జయంతి'గానూ పరిగణిస్తారు. త్రిమూర్త స్వరూపుడిగా దత్తాత్రేయుణ్ని అర్చించే రోజు ఇది. నేడు 'గురుచరిత్ర' పారాయణం అనేక ఫలితాల నిస్తుందని పలువురు విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో- మార్గశిరంలోని శుక్ల అష్ట మిని 'కాలభైరవ అష్టమి'గా పిలుస్తారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ని, శివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కృష్ణపక్ష ఏకాదశిని 'ఉత్పత్తి ఏకాదశి' అంటారు. ఒక సందర్భంలో, 'ఏకాదశి' కన్య ఆవిర్భవించడం వల్ల ఈ పేరు వచ్చిందని పురాణగాథలు చెబుతాయి. భక్తజనావళి దైవమాసంగా భావించే ఈ మార్గశిరం, ఇలా ఎన్నో విలక్షణతలను సంతరించుకుంది! *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
983 views
4 months ago
#మోక్షానికి మార్గం మార్గశిర మాసం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం *మాసానే మార్గశీర్షం అగ్రగణ్యం* విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికీ ప్రాశస్త్యం ఉంది. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. "మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా వ్యవహరి స్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. 🟡 ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గ శిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను 'వే దానాం సామవేదోస్మి దేవానాం వాసవః అంటే 'ఇంద్రుడు' అని చెబుతూనే తాను 'మాసానాం మార్గశీర్షిహం' అని ప్రకటించాడు. వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబిం చేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి. 🟡 మార్గశిర ప్రారంభంలోనే శివ పుత్రుడైన కుమారస్వామిని అర్చించే 'సుబ్రహ్మణ్య షష్టి' పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా ఘనంగా జరుపుకుం టారు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్ర దాయం తమిళనాట ఉంది. యోగసాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యరూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయం దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగబలాన్నీ, ఆరోగ్య ఫలాన్నీ ప్రసాదిస్తుంది. 🟡 'మిత్రసప్తమి' గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులూ ఆరాధిస్తారు. ఈ శుభ తిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ని పూజిస్తే దివ్యమైన ఆరోగ్యం, మహాభాగ్యం ఒనగూడుతాయని భక్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భాను సప్తమి, రథస ప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, దళచట్పూజ పర్వదినాలలాగా 'మిత్రసప్తమి' కూడా అత్యంత యోగదా యకమైన పర్వదినం. 🟡 మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని 'గీతాజయంతి'గా జరుపుకుం టారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. 🟡 ఇక మహామహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గ శిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణ కారకుడైన నార దుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహా పురాణం చెబుతోంది. 🟡 మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకు డైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్ర్వతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అంజనీసుతుని ఆరాధన దుష్టపీడను భంజించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది. 🟡 మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించ డంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే 'ధనుర్మాసం', వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం. 🟡 ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాధునికి సమర్పించి, ఆ దేవ దేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి, ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘన చరిత గోదాదేవిది. ఈమెనే వైష్ణవ సాంప్ర దాయంలో అండాళ్ అనీ, చూడి కుడుత నాంచారి అనీ వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన 'తిరుప్పావై'లోని భక్తి భావస్పోరకమైన 30 పాశురాలను ఈ మాసం రోజూలూ విష్ణు ఆలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠిస్తారు. 🟡 సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే 'ముక్కోటి ఏకాదశి' గా జరుపుకుంటారు. ఈ పర్వదినాన దేవదుందుభులు మోగుతుండగా శ్రీమహా లక్షీ సమేతుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యదర్శన భాగ్యాన్ని కలుగచే స్తాడని పురాణవచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే, ఆయతో బాటు ముక్కోటి దేవతలనూ ఆరాధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏకాదశిని 'ముక్కోటి'గా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యం ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశి వుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు. ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*