🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️

nvs subramanyam sharma
854 views
8 days ago
🙏🕉️ఓం గం గణపతయే నమః🕉️🙏 🚩🕉️🔔 బిక్కవోలు గణపయ్యకు ఒక్కసారి చెప్తే చాలు.ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. 🙏🕉️ వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా 🕉️🙏 అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. 🚩🕉️ స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. 🚩🕉️ క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. 🚩🕉️ ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. 🚩🕉️ ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. . #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️
nvs subramanyam sharma
2.8K views
8 days ago
బిక్కవోలు వినాయకుడి ఆలయం : క్రీ॥శ॥ 774 నుంచి క్రీ॥శ॥ 1542 వరకు వేంగిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పుచాళుక్యుల ఆధ్యాత్మిక రాజధానిగా బిక్కవోలును చెప్పవచ్చు. 9వ శతాబ్దంలో వీరు ఇక్కడ నిర్మించిన అనేక ఆలయాలే ఇందుకు సాక్ష్యం. తమ ఇలవేల్పు వినాయకుడు, శివుడి ఆలయాలు అటు ఆధ్యాత్మికతనూ, ఇటు శిల్పకళనూ రంగరించిన చారిత్రక నిర్మాణాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పుచాళుక్యులు బిక్కవోలు గ్రామానికి తూర్పున ముందుగా తమ ఇలవేల్పు అయిన వినాయకుడి ఆలయం నిర్మించారు. కాలక్రమంలో ఈ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. 1960వ దశకంలో ఒక భక్తుడి కలలో కనిపించి వినాయకుడే తన ఉనికి తెలిపాడని, గ్రామస్థుల సహకారంతో ఆ ప్రదేశంలో తవ్వకాలు సాగించగా దక్షిణావృత తొండంతో వినాయకుడు బయలు పడ్డాడని కథనం. అనంతరం పందిరి వేసి భక్తులు పూజలు మొదలుపెట్టారు. కాలక్రమంలో వినాయకుడి మహిమ దశదిశలా వ్యాపించింది. భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడంతో గ్రామస్థులు స్వామికి విశాలమైన ఆలయం నిర్మించారు. విగ్రహం బయటపడిన తొలినాళ్ళలో చిన్నదిగా ఉన్నా తర్వాత భారీస్థాయికి పెరిగిందన్నది స్థానికుల కథనం. చెవిలో తమ కోర్కె చెబితే తప్పక అది నెరవేరుతుందన్న భక్తుల విశ్వాసం ఆనోట ఈనోట పాకి రాష్ట్ర వ్యాప్తి పొందింది. చవితి వేడుకలకు ఈ ఆలయం భక్తకోటితో కళకళలాడుతుంది. తూర్పు చాళుక్యులు యుద్ధంలో జయం లభించినపుడల్లా అందుకు గుర్తుగా అనేక శివాలయాలు నిర్మించారు. బిక్కవోలు నలుదిక్కులా వీరు నిర్మించిన చాలా ఆలయాలు మతోన్మాదుల అహంకారానికి శిథిలమై భూమిలో నిక్షిప్తమైపోయాయి. అయితే నాలుగు శైవ ఆలయాలు మాత్రం వీరి దండయాత్రల నుంచి తప్పించుకుని నేటికీ చెక్కుచెదరక వున్నాయి. వీటిలో ఉత్తర, పడమర, దక్షిణ దిశలలో ఉన్న కంచర, నక్కల వీరభద్ర ఆలయాలు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. గోలింగేశ్వర ఆలయం మాత్రం నేటికీ నిత్యం భక్తకోటితో పూజలందు కుంటోంది. ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర, చంద్రశేఖర, గోలింగేశ్వర ఆలయాల సముదాయం ఉండి గోలింగేశ్వర ఆలయంలో గోలింగేశ్వరునితో పాటు పార్వతీదేవి, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు... ఇలా మొత్తం శైవకుటుంబమే కొలువు దీరింది. యేటా మార్గశిర శుద్ధషష్ఠి ఉత్సవాలు జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి సహజమైన పుట్ట నేటికీ దర్శనమిస్తోంది. పెద్దాపురం మహారాజు వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి ఈ ఆలయాన్ని దర్శించి సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని కొలువగా ఆ కోర్కె నెరవేరింది. దీంతో మహారాజు ఈ ఆలయాలను పునరుద్ధరించి కొత్త శోభను చేకూర్చారు. ఏటా జరిగే షష్ఠి ఉత్సవాలలో సంతానం లేని స్త్రీలు స్వామి వారి పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక శయనిస్తే సంతానవతులవుతారని ప్రగాఢ విశ్వాసం. #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️
Rochish Sharma Nandamuru
13.7K views
21 days ago
🌿🌼 కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం 🌼🌿 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||  🌿🌼🙏ఓం గం గణపతయే నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🙏