చిదంబరం

sivamadhu
978 views
3 months ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #చిదంబరం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శ్శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో ఆరుద్ర దర్శనం సందర్భంగా ఈనెల 2వ తేదీన జరిగిన మహా రథోత్సవం దృశ్య మాలిక. హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
sivamadhu
808 views
3 months ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #చిదంబరం #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన ఆకాశ లింగ క్షేత్రమైన చిదంబరం (తిల్లై) మహా క్షేత్రంలో శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన మార్గళి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి ఆరుద్ర దర్శనం బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు (02.01.2025) ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి మహా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా తిరుతేరు పై విశేష అలంకరణలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారు తిల్లై పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సౌజన్యం — చిదంబరం టెంపుల్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
603 views
3 months ago
చిదంబర రహస్యం అంటే ఏమిటి.........!! పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది. పూర్వీకులు అప్ప‌ట్లోనే ఎటువంటి advanced equipment లేకుండానే భూమి అయ‌స్కాంత‌ క్షేత్రం క‌నుక్కున్నారు....స‌రిగ్గా‌ న‌ట‌రాజ‌ స్వామి బొట‌న‌వేలు కింద‌ ఈ భూమి అంతటికీ అయ‌స్కాంత‌ క్షేత్రానికి కేంద్ర‌ బిందువు ఉంటుంది.ఈ విష‌యాన్ని ప్ర‌సిద్ద‌ త‌మిళ‌ స్కాల‌ర్ "తిరుమూల‌ర్" తన‌ గ్ర‌థం "తిరు మందిరం"లో చెప్పారు. " పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు . అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......! ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . ఇది ఆశ్చర్యం కదూ ! చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి. చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 ) ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది . దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి . అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది. " కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు . ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు ఇదే విష‌యాన్ని advanced technology ఉప‌యోగించి క‌నుక్కోవ‌డానికి 8 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.....చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి(centre of earth magnitic field) మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేసారు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ గా అభివర్ణించారు. సైన్స్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నది హిందూ మతం వేల సంవత్సరాల క్రితం పేర్కొంది! హిందూ ధర్మం ఒక మతం కాదు. ఇది సనాతన ధర్మ జీవనవిధానం అని 1.పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. 2. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. 3. జలలింగం:- ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను. 4. తేజోలింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి. 5. వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి. #చిదంబరం #నటరాజ స్వామి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
737 views
5 months ago
చిదంబరం అద్భుతమైన అయస్కాంత శక్తి.........!! చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్ర‌వేత్త‌లు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం "తిరుమందిరం"లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివ‌రించారు. చిదంబ‌రంలోని ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశమూ, వాయువూ, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ, కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి(భూమి)కి ప్రతీక అనీ అంటారు. అయితే ఇక్కడ అద్భుతం ఏమిటంటే, ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మాన‌వుడికి న‌వ రంధ్రాలు ఉన్న‌ట్లు ... చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు. ( 15 x 60x 24 = 21600). చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబ‌రం దేవాలయంలో "పొన్నాంబళం" కొంచెం ఎడమ వైపున‌కు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి "పంచాక్షర పడి" ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది. "కనక సభ"లో 4 స్తంభాలు 4 వేదాలకు ( ఋగ్వేదం, యజుర్వేదం,సామవేదము,అథర్వణ వేదం) ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు (కామికాగమము, యోగజాగమము, చింత్యాగమము, కారణాగమము, అజితాగమము, దీప్తాగమము,సూక్ష్మాగమము, సహస్రాగమము, అంశుమానాగమము, సుప్రబేదాగమము, విజయాగమము, నిశ్వాసాగమము, స్వాయంభువాగమము, అనలాగమము, వీరాగమము, రౌరవాగమము, మకుటాగమము,విమలాగమము, చంద్రజ్ఞానాగమము, బింబాగమము, ప్రోద్గీతాగమము, లలితాగమము,సిద్దాగమము, సంతానాగమము, సర్వోక్తాగమము, పారమేశ్వరాగమము, కిరాణాగమము, వాతులాగమము) ప్రతీకలు - శివారాధనా పద్ధతులు. ఇవి 64X64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది. అంతేకాదు అడ్డు దూలాలు రక్తప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది. నమః శివాయ #చిదంబరం #నటరాజ స్వామి🕉️🙏 #తెలుసుకుందాం #కార్తీక దామోదరాయ నమః #శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ
Anu family telugu traveller
20.3K views
5 months ago
చిదంబరం ఆలయానికి మానవ శరీర భాగాలకి ఉన్న సంబంధం#nataraja swamy #చిదంబరం #temple #Bakthi special##🙏🏻 #devotional || Tamilnadu temples || temples of India || Panchabutha lingalu || Aakasa lingam