⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
507 views
4 months ago
దీపాలతో హారతి ఇవ్వవచ్చా.........!! *కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది.* *ఆవునేతిలో తడిపిన వత్తిని వెలిగించి హారతిస్తారు ఇందుకోసం రెండు, మూడు ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలలో దీపాలు వెలిగిస్తారు.* *అత్యధికంగా నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతినిస్తారు. అయిదు కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ, నదీహారతుల్లోనూ మాత్రమే ఇస్తారు.* *హారతి పళ్లేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు.* *నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరు దీపం, పంచబ్రహ్మదీపం, గజ దీపం, వృషభ దీపం, కుంభ హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, రుద్ర, చక్ర, నారాయణ నవగ్రహ హారతుల వంటివి ఎన్నో ఉన్నాయి.* *హారతుల్లో రకరకాలున్నాయి. వత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి.* *నంది హారతి - 3* *సింహహారతి - 3* *పంచహారతి - 5* *నాగహారతి - 5* *నేత్రహారతి - 2వత్తులు* *బిల్వ హారతి - 3* *కుంభహారతి - 3* *రుద్రహారతి - 11* *నారాయణ హారతి - 16* *చంద్రహారతి 16* *నక్షత్ర హారతి - 27* *వృక్ష హారతి 32* *రథహారతి -632* *హారతి ఉత్సవాలలో, ఆలయాలలో ఒత్తులతో దీపహారతి ఇచ్చినప్పటికీ చిట్టచివరిగా అఖండ కర్పూర హారతికూడా తప్పనిసరిగా ఇస్తారు. #తెలుసుకుందాం #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #ఆచారాలు - సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K views
4 months ago
*శుక్ర మౌఢ్యమి* ➖➖➖ *శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్‌! ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?* ``` మూఢమి అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. దీనినే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూఢమి లేదా మూఢం అని అంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢమి సంభవిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు. సూర్యుడి శక్తి, కాంతి అనంతం. అలాగే గురుడు, శుక్రుడు ఇవి రెండూ శుభ గ్రహాలు. ఈ శుభ గ్రహాలు మూఢమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల.. చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. అలాగే సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. అయితే మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి.. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ మూఢమి ఉన్నన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి శుక్ర మౌడ్యమి (గురుడు, శుక్రుడు అస్తంగత్వం) ఏర్పడనుంది. 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. అంటే సుమారు 83 రోజుల పాటు అంటే.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ శుక్ర మౌడ్యమి ఉండనున్నట్లు పండితులు చెబుతున్నారు.``` *మూఢమి సమయంలో చేయకూడని పనులు:*``` ఈ మూఢమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, ఇంటికి లగ్నం, యజ్ఞాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పదవీ ప్రమాణ స్వీకారం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. ``` *మూఢమి సమయంలో ఈ పనులు చేయొచ్చు!*``` అయితే యథాతథంగా జరుపుకునే వాటిలో సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ మూఢమి వర్తించదు అని చెబుతున్నారు. ఈ కార్యక్రమాలకు నమ్మకమైన పండితులను సంప్రదించి నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. అలాగే కొన్ని అనివార్యమైన, నిత్య కర్మలకు ఈ మూఢమి దోషం వర్తించదని కూడా చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యపూజ, అభిషేకం, నవగ్రహ శాంతి, సీమంతం, నామకరణం, అన్నప్రాశన వంటి కార్యక్రమాలు, చాతుర్మాస్య వ్రతాలు వంటివి ఈ శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేయవచ్చని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా మూఢం రోజులు (మార్చి 13 నుంచి 25 వరకు) వచ్చిన విషయం తెలిసిందే. ``` <><><><><><><><><><><><><><><><><><><> *దాదాపు 3 నెలల వరకూ మంచి ముహూర్తాలే లేవు: పండితులు* పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 3 నెలల వరకూ మంచి ముహూర్తాలే లేవంటున్నారు పండితులు. ఇందుకు కారణం శుక్ర మూఢమే. 2026 ఫిబ్రవరి 18 వరకూ మంచి రోజుల కోసం వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమావాస్య వరకు.. అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుందని, అప్పటి వరకూ శుభ ముహూర్తాలు లేవని పేర్కొన్నారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించరు. కాగా.. తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మూఢమి వర్తించదు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఏవీ ఖాళీ ఉండేవి కాదు. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేక బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఏదేమైనా పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే జంటలు మంచి ముహూర్తాల కోసం మూడు నెలలు వేచి ఉండక తప్పదు. #తెలుసుకుందాం #ధర్మ సందేహాలు #ధర్మ సందేహాలు 🚩 #హిందూసాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
641 views
4 months ago
🙏🙏🙏🌹🌹🌹 రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు:- భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను పవిత్రమైన మొక్కలుగా భావించడంతోపాటు వాటికీ పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో వేప, తులసి,అరటి, జిల్లేడు వంటి మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారుఅలా హిందువులు పవిత్రంగా భావించి పూజించే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అలా రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టుకు పూజ చేయాలి అనుకున్న వారు సూర్యోదయం తర్వాత నది స్నానం ఆచరించి కుంకుమచ్చరించి రావి చెట్టును పూజించాలి. రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకోవాలి. అలాగే ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అయితే రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి. రావి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసినప్పటికీ ఆదివారం మంగళవారం సంధ్య సమయంలో రావి చెట్టును తాకకూడదు. కేవలం శనివారం రోజు మాత్రమే రావి చెట్టును తకీ పూజ చేసి అనంతరం మనసులో ఉన్న కోరికలను కోరుకోవడం వల్ల తప్పకుండా నెరవేరుతుంది. పురాణాల ప్రకారం ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానమాచరించి రావి చెట్టుకి నీరు పోసి పూజిస్తే అటువంటి వారిపై శని ప్రభావం ఉండదు. అలాగే శనివారం రోజు రావి చెట్టుకి పూజించే సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల మరింత మంచి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరడంతో పాటు ఆ శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 🌹🌹🌹🙏🙏🙏 #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
633 views
4 months ago
*🙏మంగళ సూత్రం-ఎలా ధరించాలి🙏* 🌹🙏భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తే భర్త సుఖంగా జీవిస్తాడు..? పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. 🌹🙏వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు. 🌹🙏సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. 🌹🙏మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. 🌹🙏వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం. 🌹🙏అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కనబెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారట. 🌹🙏నలుపు రంగు వర్ణంలో శ్రీమహావిష్ణువు, బంగారు వర్ణంలో శ్రీమహాలక్ష్మి కొలువైఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని లక్ష్మీ నారాయణులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. 🌹🙏మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. 🌹🙏మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట. 🌹🙏అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. 🌹🙏మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతమ్మ తల్లే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట. 🌹🙏కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. 🌹🙏ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది. 🌹🙏వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. 🌹🙏ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది. 🌹🙏అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. 🌹🙏ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే శ్రీమహాలక్ష్మి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. 🌹🙏మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. 🌹🙏మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగలసూత్రం పెరిగితే ( తెగిపోతే ) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. 🌹🙏మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀 #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
696 views
4 months ago
* #గుడిలోతీర్థంసేవించినపుడుఇలాచేయకూడదు!* తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి మడిచి తీసుకోవాలి.. #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️ #హిందూసాంప్రదాయాలు #సనాతన ధర్మం.. దేవుళ్ళు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
757 views
5 months ago
⛧ తీర్థము ⛧ తీర్థం యొక్క విశిష్ఠత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడి దర్శనం లేక పూజలు అయిన తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..!! దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థం లో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్థం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పాదోదకం అనుకుని తీసుకోవాలి. మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే అర్చకులు ఈ శ్లోకాన్ని పఠిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ నారాయణ పాదోదకం పావనం శుభం!! మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోని తీర్థాన్ని తీసుకోవాలి .... #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
701 views
5 months ago
మన పెద్దలు చెబుతారు — “నడుము చుట్టూ మొలతాడు కట్టుకోవాలి, దాంతో శరీరానికి శాంతి, రక్షణ కలుగుతుంది.” ఇది కేవలం ఆచారం కాదు — నిజంగా శరీర శాస్త్రం ఉంది! 🔬 1️⃣ నాభి కేంద్రం (Navel Energy Hub) రక్షణ నాభి మన శరీరానికి ఎనర్జీ సెంటర్ — అన్ని నాడులు అక్కడ కలుస్తాయి. మొలతాడు కట్టడం వల్ల ఈ ప్రాంతానికి స్థిరమైన ప్రెషర్ వస్తుంది → ఇది డైజెషన్, బ్లడ్ ఫ్లో, హార్మోన్ బ్యాలెన్స్‌కి సహాయపడుతుంది. 2️⃣ కడుపు వేడి నియంత్రణ నడుము ప్రాంతం మీద కాటన్ లేదా సిల్క్ దారం తగిలి ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది — ఇది డైజెస్టివ్ ఆర్గాన్స్‌ను ఓవర్‌హీట్ కాకుండా కాపాడుతుంది. 🌡️ 3️⃣ నాడీ ప్రెషర్ థెరపీ నడుము చుట్టూ అనేక నాడులు ఉంటాయి (వాటిల్లో స్ప్లాంక్నిక్ నర్వ్స్, లంబార్ నర్వ్స్ ప్రధానమైనవి). మొలతాడు కట్టడం వల్ల వీటికి తేలికైన ప్రెషర్ వస్తుంది → నాడీ ప్రవాహం మెరుగవుతుంది, గ్యాస్, బ్లోటింగ్ తగ్గుతాయి. 4️⃣ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సేఫ్టీ మన శరీరం ఒక బయోఎలక్ట్రిక్ సిస్టమ్. మొలతాడులో వాడే సహజమైన దారాలు (కాటన్, కుంకుమ, హల్దీతో శుభ్రం చేసినవి) ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్‌ఫ్లుయెన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ⚡ 5️⃣ ఆధ్యాత్మిక భావం నడుము చుట్టూ మొలతాడు కట్టుకోవడం అంటే — “నా శరీరం దేవాలయం, నేను దానిని పవిత్రంగా ఉంచుతాను” అని మనసుకు గుర్తు చేయడం. ఇది ఒక మానసిక నియంత్రణ సాధనం. 🧘‍♂️ 💡 సారాంశం: మొలతాడు కట్టుకోవడం కేవలం పద్ధతి కాదు — ఇది డైజెస్టివ్ హెల్త్, నాడీ సమతుల్యం, మరియు ఆత్మశాంతికి సహజమైన బాడీ సైన్స్. #తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
706 views
5 months ago
1. *మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం*.. ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం.. భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..! 2. *జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం*. ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (*వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం*) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి) 3. *ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం*.. ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...! 4. *తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం*.. ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...! 5. *బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం*.. ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..! 6. *బఫే భోజనాలు*.. ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.! 7. *వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం*.. ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..! ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి.... *అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు*. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సం.ల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ.. 🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏 #తెలుసుకుందాం #😃మంచి మాటలు #💗నా మనస్సు లోని మాట #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️