విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News )

PSV APPARAO
673 views
24 days ago
#శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు (పెద్ద వాల్టెర్-విశాఖపట్నం) ఓం ఐం హ్రీం శ్రీం పోలమాంబాయే నమః #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు *ఈరోజు శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య స్వరూపం దర్శనం! 🌺* "శ్రీ పోలమాంబ అమ్మవారిని పరోక్షంగా దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...ముక్తిని ప్రసాదించే ఈ దివ్య దర్శనాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. 👉 అమ్మవారి నిత్య దర్శనం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VakZTwH3bbV6Ce1pnN1c *సర్వేజనా: సుఖినోభవంతు!"*
PSV APPARAO
1.5K views
26 days ago
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🦁🙏 సింహాద్రి అప్పన్న చందనోత్సవం🌹🦁🐯 #🛕🎎సింహాద్రి అప్పన్న చందనోత్సవం 🙏🌺🌠🌦️ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు: భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు. చందనోత్సవానికి సర్వం సిద్ధం. కలెక్టర్: అభిషిక్త్ కిషోర్. విశాఖపట్నం/సింహాచలం. ఏప్రిల్ 18. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన సింహాచలం దేవస్థానం లో చందనోత్సవం ఏర్పాట్లను GVMC కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఉద్యాధరీ , VMRDA కమిషనర్ తేజ్ భరత్,EO J. వెంకట రావు తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6:00 గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ₹300, ₹1000 మరియు ₹1500 కేటగిరీలలో సుమారు 40,000 టికెట్లను విక్రయించడం జరిగిందాని, మిగిలిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు. కొండ పైకి భక్తులను తరలించడానికి 100 ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు . ప్రైవేట్ వాహనాలను కొండ పైకి అనుమతించమని. భక్తులు తమ వాహనాలను ఫుట్ హిల్స్ వద్ద కేటాయించిన 32 పార్కింగ్ ప్రదేశాలలో నిలిపివేసి, దేవస్థానం బస్సుల ద్వారా కొండ పైకి చేరుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారనీ,. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా( కెనోపి )నీడ (Canopy) ఏర్పాటు చేశా మ న్నారు .తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు చేపట్టామన్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను కొండ పైకి తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ణీత సమయ స్లాట్ (Slot) లలోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ లు తెస్తే చట్టపరంగా చర్యలు తీసు కుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు రాంపులను నిర్మించా మన్నారు . ఉచిత ప్రసాదం, మంచినీరు మరియు అన్నదాన వితరణ చేసే సంస్థలకు ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశామని తెలిపారు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి (సుమారు 500 మందికి) మాత్రమే ఉదయం 5:00 గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందనీ. ఆ తర్వాత అందరికీ సాధారణ దర్శనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీమ్‌గా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.
PSV APPARAO
712 views
1 months ago
#శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు (పెద్ద వాల్టెర్-విశాఖపట్నం) ఓం ఐం హ్రీం శ్రీం పోలమాంబాయే నమః #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) తేదీ:18-03-2026 /బుధవారం *ఈరోజు శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య స్వరూపం దర్శనం! 🌺* "శ్రీ పోలమాంబ అమ్మవారిని పరోక్షంగా దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... ముక్తిని ప్రసాదించే ఈ దివ్య దర్శనాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. 👉 అమ్మవారి నిత్య దర్శనం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VakZTwH3bbV6Ce1pnN1c *సర్వేజనా: సుఖినోభవంతు!"*
PSV APPARAO
11.1K views
2 months ago
#విశాఖపట్నం జిల్లా సమాచారం #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) మందుగుండు సామాగ్రి పేలి గోపాలపట్నం పరిధిలో భారీ పేలుడు భయాందోళనలు పరుగులు తీసిన స్థానికులు భయం గుప్పెట్లో రాజిక వీధి ప్రజలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన గోపాలపట్నం సిఐ, ఎస్ఐ మంట లారిపోయిన స్థానిక యువత విశాఖ పశ్చిమ, విశాఖ, పశ్చిమ నియోజకవర్గం, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, రజక వీధిలో ఉన్న ఒక భవనంలో కొంతకాలంగా అనుమతి లేకుండా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఆదివారం అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దం దూర ప్రాంతాల వరకు వినిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే అక్కడున్న స్థానిక యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వారి సహకారంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీఐ సన్యాసి నాయుడు, ఎస్సై రామారావు తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పరిసర ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తూ పేలుడు ఎలా జరిగింది, ఏ రకమైన మందుగుండు సామగ్రి అక్కడ తయారు చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఆ భవనంలో అనధికారికంగా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్న అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భవన యజమాని వివరాలు సేకరిస్తూ, అక్కడ నిల్వ ఉంచిన పదార్థాలు ఏమిటి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. భవనంలో ఇంకా ప్రమాదకర పదార్థాలు ఉన్నాయా అనే దానిపై కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళనలో ఉండగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PSV APPARAO
603 views
2 months ago
#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం న్యూస్ మందుగుండు సామాగ్రి పేలి గోపాలపట్నం పరిధిలో భారీ పేలుడు భయాందోళనలు పరుగులు తీసిన స్థానికులు భయం గుప్పెట్లో రాజిక వీధి ప్రజలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన గోపాలపట్నం సిఐ, ఎస్ఐ మంట లారిపోయిన స్థానిక యువత విశాఖ పశ్చిమ, విశాఖ, పశ్చిమ నియోజకవర్గం, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, రజక వీధిలో ఉన్న ఒక భవనంలో కొంతకాలంగా అనుమతి లేకుండా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఆదివారం అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దం దూర ప్రాంతాల వరకు వినిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే అక్కడున్న స్థానిక యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వారి సహకారంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీఐ సన్యాసి నాయుడు, ఎస్సై రామారావు తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పరిసర ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తూ పేలుడు ఎలా జరిగింది, ఏ రకమైన మందుగుండు సామగ్రి అక్కడ తయారు చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఆ భవనంలో అనధికారికంగా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్న అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భవన యజమాని వివరాలు సేకరిస్తూ, అక్కడ నిల్వ ఉంచిన పదార్థాలు ఏమిటి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. భవనంలో ఇంకా ప్రమాదకర పదార్థాలు ఉన్నాయా అనే దానిపై కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళనలో ఉండగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
PSV APPARAO
925 views
3 months ago
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃🦬 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత విశాఖ భక్తి సమాచారం (సింహాచలం) (16/01/2026) ఈరోజు కనుమ పండుగ సందర్భంగా శ్రీ వరదరాజ స్వామి వారి అలంకారంలోసింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారు కొండ దిగువన ఉన్న పూలతోటలో "గజేంద్రమోక్షం" ఉత్సవం అనంతరం శ్రీ స్వామి వారు గ్రామ తిరువీధి (ఊరగింపు) అత్యంత వైభవంగా జరిగింది🙏
PSV APPARAO
580 views
3 months ago
#గజేంద్ర మోక్షం విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు ముఖ్య సమాచారం: ధనుర్మాసోత్సవాలలో భాగంగా తేదీ 16.01.2026 (శుక్రవారం) కనుమ పండుగ నాడు కొండ దిగువన ఉన్న పూలతోటలో "గజేంద్రమోక్షం" ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం స్వామి వారి గ్రామ తిరువీధి (ఊరేగింపు) జరుగుతుంది.
PSV APPARAO
942 views
4 months ago
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 2026 సంక్రాంతి సంబరాలు - సింహాచలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సింహగిరిపై జనవరి 14 నుండి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు: ముగ్గుల పోటీలు (జనవరి 13, 2026): సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు దేవాలయ రాజగోపురం ముందున్న మాడ వీధుల్లో భక్తులు ముగ్గులు వేయవచ్చు. విజేతలకు జనవరి 14 ఉదయం 9:00 గంటలకు బహుమతులు అందజేస్తారు. భోగి పండుగ (జనవరి 14, 2026 - బుధవారం): సింహగిరిపై భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చెరకు గెడల అలంకరణలు ఉంటాయి. డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరలు, కోమ్మాదాసరి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేదమంత్రోచ్ఛారణలతో గోపూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు: ఉదయం 9:00 గంటలకు కొండపై ఉన్న కళావేదిక వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. కనుమ (జనవరి 16, 2026): ఉదయం 9:00 గంటలకు కృష్ణాపురం వద్ద ఉన్న దేవస్థానం గోశాలలో విశేష గోపూజలు నిర్వహిస్తారు. ముఖ్య గమనిక: భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ సుజాత గారు కోరారు.🤝👏🤝 #సింహాద్రి అప్పన్న #సింహాచలం సింహాద్రి అప్పన్న
PSV APPARAO
1.8K views
4 months ago
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #ధనుర్మాసం ప్రారంభం *పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*ధనుర్మాస వైశిష్ట్యం/ధనుర్మాసం వ్రత విధానం #ధనుర్మాసం నెలగంట సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం పూజలు #ధనుర్మాసం కార్యనిర్వహణాధికారి కార్యాలయం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాసం మహోత్సవాలు తేదీ 10,డిసెంబర్ 2025, బుధవారం. డిసెంబర్ 16 నుండి జనవరి 19 వరకు ప్రత్యేక ఉత్సవాలు, దర్శన వేళల్లో మార్పులు ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో రాబోయే ధనుర్మాసం సందర్భంగా పలు ప్రత్యేక ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా భక్తుల దర్శన వేళల్లో మరియు ఆర్జిత సేవల్లో తాత్కాలిక మార్పులు చోటుచేసుకుంటాయి. ధనుర్మాసం ప్రారంభం 16.12.2025 మధ్యాహ్నం గం. 01:01 నిమిషాలకు శ్రీ స్వామివారి సన్నిధిలో "నెలగంట పెట్టుట" (ధనుర్మాసం ప్రారంభం) జరుగును. (16.12.2025): ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆ రోజు ఉదయం సుమారు గం. 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం గం. 02:30 నిమిషాల వరకు స్వామివారి దర్శన నిలుపుదల చేయబడును. తేది. 20.12.2025 నుండి తేది. 29.12.2025 వరకు. ఈ పది రోజుల పాటు దేవాలయంలో శ్రీ స్వామివారి పగల్ పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు మరియు కనుమ పండుగ సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారి తిరువీధి ఉత్సవములు, విశేష సేవలు జరుగును. ఈ ప్రత్యేక ఉత్సవాల కారణంగా, పైన పేర్కొన్న తేదీలలో (20.12.2025 నుండి 29.12.2025 వరకు) నిత్యము జరుగు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. తేది. 30.12.2025 నుండి తేది. 09.01.2026 వరకు రాపత్తు ఉత్సవములు జరుగును. ఈ సందర్భంలో ప్రతి రోజు సాయంత్రం గం. 05:00 లకు శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవములు వైభవంగా జరుగును. రాపత్తు ఉత్సవాల కారణంగా, ఈ తేదీలలో (30.12.2025 నుండి 09.01.2026 వరకు) రాత్రి గం. 07:00 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనములు లభించును.రాత్రి దర్శన వేళల్లో మార్పులు గమనించ గలరు. కుడారై ఉత్సవం తేది: 11.01.2026 ఆ రోజు గం. 09:00 నుండి గం. 10:30 వరకు శ్రీ స్వామి వారి దర్శనాలు నిలిపివేయబడును. సుప్రభాతం & ఉదయం ఆరాధన టిక్కెట్ల రద్దు తేదీలు: 16.12.2025 నుండి 19.01.2026 వరకు ధనుర్మాసం దృష్ట్యా ఈ కాలంలో: సుప్రభాతం సేవ ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు చేయబడుచున్నవి. గోదా కళ్యాణం — భోగి పండుగ తేది: 14.01.2026 గోదా కళ్యాణం — భోగి పండుగఈ రోజు ప్రత్యేకంగా "గోదా కళ్యాణం" సాయంత్రం 05:00 నుండి 06:30 వరకు వైభవంగా జరగును. సాధారణంగా ఉదయం జరుగు నిత్యకళ్యాణం ఈ రోజు గోదా కళ్యాణంతో కలిపి సాయంత్రం జరుగును. భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా దేవస్థానం కోరుచున్నది. సహస్రనామార్చన టిక్కెట్ల రద్దు తేదీలు: 30.12.2025 నుండి 19.01.2026 వరకు ఈ తేది లలో సహస్రనామార్చన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును. భక్తులకు వినతి పైన తెలిపిన తేదీలు, సమయాలు, దర్శన మార్పులు, రద్దు చేయబడిన ఆర్జిత సేవలను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ దర్శన, సేవ కార్యక్రమాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవలసిందిగా దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది మీడియా మాధ్యమాలు— దినపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా పై సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా కోరడమైనది. సుజాత ఎన్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం