sri vasavi mata jayanthi

PSV APPARAO
645 views
21 days ago
#శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏❇️ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు ❇️🙏 #🙏🌹శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు 🧜‍♀️🌻🚶‍♀️🌺 #శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి💐🎂 26th April 2026 *వాసవీ కన్యక జయంతి* : వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యులకు ఆరాధ్యదేవత. ప్రపంచమంతటా ఆమె ఆలయాలున్నాయి. వైశ్యులు ప్రధానంగా వాసవీ అమ్మవారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కన్యకా పరమేశ్వరి తండ్రి కుసుమ శ్రేష్ఠి. ఆయన భార్య కుసుమాంబ. వారిది ఆదర్శ దాంపత్యం. పెనుగొండ నగరేశ్వర స్వామి వారికి ఆరాధ్య దైవం. అయితే వివాహం అయిన చాలా ఏళ్ల వరకూ వారికి సంతాన భాగ్యం కలుగలేదు. దాంతో కుల గురువైన భాస్కరాచార్యులవారి సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం చేశారు. దేవతలు అనుగ్రహించిన యజ్ఞఫల ప్రసాదాన్ని స్వీకరించి కుసుమాంబ గర్భవతి ఆయింది. తొమ్మిదినెలలకు వసంత కాలంలో సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లువెత్తిన మథుర క్షణాన వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారంనాడు ఉత్తరా నక్షత్రం కన్యరాశిలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో అబ్బాయికి విరూపాక్షుడని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన వారిద్దరూ సకల విద్యల్లోనూ ఆరితేరారు. ఆ కాలంలో అంటే 10,11 వ శతాబ్దాల మధ్యలో పెనుగొండ ప్రాంతం విష్ణువర్ధనుడనే చాళుక్య చక్రవర్తి అధీనంలో ఉండేది. అతడికే విమలాదిత్యుడనే మరోపేరుంది. అతడొకసారి వాసవిని చూశాడు. మోహించాడు. ఆమెను వివాహ చేసుకుంటానని కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపించాడు ప్రాపంచిక విషయాల మీద తనకు ఆసక్తి లేదని, జీవితాంతం కన్యకగానే ఉంటానని అంతకుముందే వాసవి ప్రకటించింది. విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడయ్యాడు. పెనుగొండపైకి సైన్యం పంపాడు. ఆ విపత్కర స్థితిలో కుసుమ శ్రేష్ఠి కులగురువుల సమక్షంలో 714 గోత్రాల వారితో సమావేశం నిర్వహించాడు. వారిలో 612 గోత్రాల వారు విష్ణువర్థనుడితో వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రమాదం తప్పుతుందని, కులవినాశనం జరగదని భావించారు. 102 గోత్రాలవారు మాత్రం వాసవితో పాటు అడుగు వేయడానికి సంసిద్ధులయ్యారు. అధర్మానికి తలవొగ్గి, పిరికితనంతో వ్యవహరించే పలాయనవాదులు దైవత్వానికి దగ్గర కాలేరనడానికి నిదర్శనమైన సన్నివేశం అప్పుడు జరిగింది. వాసవీదేవి గోత్రీకుల సమావేశంలోకి ప్రవేశించింది. అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ మనసులోని మాట వెల్లడించింది. నేను వివాహానికి నిరాకరించినట్లైతే విష్ణువర్థనుడు సైన్యంతో పచ్చి విరుచుకుపడతాడు. యుద్ధం పలస అపార జననష్టం సంభవిస్తుంది. పుణ్య స్త్రీలు వైధవ్యంతో బాధపడతారు. ఒక్కరి కోసం ఇంత రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంతో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢమైన సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరని ప్రకటించింది. దానికి తల్లిదండ్రులు సైతం అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా 102 గోత్రాలవారు వాసవి దేవిని అనుసరించారు. ఆత్మాహుతి చేసుకున్నారు. అది మాఘ శుద్ధ పాడ్యమినాడు జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించేందుకు అనునిత్యం అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.