ఎల్లో మీడియా.. 💥

P.Venkateswara Rao
592 వీక్షించారు
3 రోజుల క్రితం
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 💥 * ABN రాధాకృషను ఎన్ని నెలలు జైలు లో పెట్టాలి జస్ట్ అస్కింగ్..⁉️ హోదా కావాలి అని బాబు అంటే హోదా కావాలి అని హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అని బాబు అంటే ప్యాకేజి ముద్దు అని రాసిన చంద్ర జ్యోతి రాధాకృష్ణ కు , సపోర్ట్ చేసిన టీడీపీ వాళ్లకు రాధాకృష్ణ మాటలు వర్తించవా ..!!! (మావిగాన్ అని జగన్ అంటే .. జగన్ చెప్తే .... కట్టుకున్న భార్యలను కూడా సొంత చెల్లెళ్ళు అని చెప్పి వాళ్లకు పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెనుకాడని వెన్నెముక లేని బ్యాచ్ ఈ వైసీపీ వాళ్ళు -ABN రాధాకృష్ణ చెత్త పలుకు Apr 5, 2026 ) *Note* : అమరావతిలో వాళ్ళు కూడా ఉంటారని కొన్ని గణాంకాలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు ను అరెస్ట్ చేసి నెలల తరపడి జైలు లో పెట్టారు ఆ డిబేట్ లో వద్దు వద్దు అని వారించినా కూడా 70 ఏళ్ల కొమ్మినేనిని కూడా జైలు లో పెట్టారు కదా మరి ఈ రాధాకృషను ఎన్ని నెలలు జైలు లో పెట్టాలి *Note*: ఉద్యోగులను ఉద్దేశించి ఆ నా ...కు అంతంత జీతాలు అవసరమా అని బాబు ముందే అన్నాడు ఈ రాధాకృష్ణ..
P.Venkateswara Rao
648 వీక్షించారు
25 రోజుల క్రితం
#మోదీ #బీజేపీ #ఎల్లో మీడియా.. 💥 *90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..⁉️* March 15, 2026🎯 మరో రెండు టరమ్స్ నేనే ప్రధానిని… అని మోడీ తనను కలిసినవాళ్లతో చెబుతున్నాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చాడు ఈరోజు కొత్త పలుకు వ్యాసంలో… అంటే ఇప్పటికే తనకు 75 ఏళ్లు… అంటే 90 ఏళ్లు వచ్చే దాకా తనే ప్రధానిగా ఉండగలడా అని కూడా హాశ్చర్యపోయాడు… ‘ఈ శతాబ్ది’ నాదే అని మోడీ ధీమాగా పలు పార్టీల నాయకులతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… నిజమో కాదో మోడీ చెప్పడు, ఖండించడు కానీ..? నిజానికి 75 ఏళ్లు దాటాక బీజేపీలో ఎంత ప్రముఖ నాయకుడైనా సరే, మార్గదర్శక మండలిలో గౌరవంగా కూర్చోబెడతారు… అంటే మర్యాదగా తప్పిస్తారు… అడ్వానీ దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషి దాకా చాలా మంది ఇలాగే తప్పించబడ్డారు… మోడీకి ప్రస్తుతం 75 ఏళ్లు… మరో మూడేళ్లు ఎలాగూ ప్రధానిగా తనే ఉంటాడు… అంటే 78 ఏళ్లు… మార్గదర్శక మండలికి వెళ్లిపోవాలనే అలిఖిత నియమం నుంచి తనకు మినహాయింపు ఉంటుందా, కాలం చెప్పాలి… బీజేపీ మీద మోదీ అమోఘమైన పట్టు నిజమే కానీ… అన్నీ తను అనుకున్నట్టు జరగవు, బీజేపీ పద్ధతి వేరు… కానీ ఒకటి మాత్రం నిజం… జాతీయ రాజకీయాల్లో, రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్టును మాత్రం మోడీ ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తున్న మాట నిజం… అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో కునారిల్లుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయాంశాలపై ఓ ఐడియాలజీ గానీ, ఓ దృక్పథం గానీ ఏమీ ఉండటం లేదు… డబ్బు, అధికారం యావ తప్ప..! ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ పని అయిపోయినట్టే ఇక… రీసెంట్ పరిణామాల్లో నితిశ్‌ను సీఎం పదవి నుంచి తప్పించారు, బీహార్‌లో బీజేపీ మరింత బలపడి, జేడీయూ కాలక్రమేణా కనుమరుగు కావడం ఖాయం… శివసేన సంగతి చూశాం, ఎన్సీపీ సంగతీ అంతే… బీహార్‌లో ఆర్జేడీ, యూపీలో ఎస్పీ ఈరోజుకూ కోలుకోవడం లేదు… కొన్ని ఉదాహరణలు ఇవి… మోడీతో పెట్టుకుని, దెబ్బతిని, మళ్లీ ఎలాగోలా మోడీ ప్రాపకం సంపాదించి చంద్రబాబు కోలుకున్నాడు, తేరుకున్నాడు… కేసీయార్ దెబ్బతిని ఇంకా కోలుకోలేదు, మోడీ ప్రాపకం కోసం ఏవేవో ప్రయత్నాలు… ఈ ఇద్దరూ ఓ దశలో మోడీని విపరీతంగా ఆడిపోసుకుని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినవాళ్లే… కేసీయార్ అయితే ఏకంగా ప్రధాని పదవినే ఆశించాడు… సరే, ఎఐడీఎంకే ప్రస్తుతం బీజేపీ అనుబంధ పార్టీగా మారిపోయింది… ఎటొచ్చీ డీఎంకే, టీఎంసీలు మాత్రమే బలంగా నిలబడి, మోడీ దెబ్బల నుంచి తమను తాము కాపాడుకున్నాయి… జేఎంఎం వంటివీ ఉన్నా, మరీ బలంగా ఏమీ లేవు… మోడీ ఒక్కొక్కటీ నరుక్కుంటూ వస్తున్నాడు… ఈసారి బెంగాల్ గనుక బీజేపీ కైవసం అయితే ఇక టీఎంసీకి చుక్కలు చూపిస్తాడు… అస్సోం సంగతి తెలిసిందే కదా… సీఎం హిమంత ఎంతగా పాతుకుపోయాడో… హిమంత, యోగి, ఫడ్నవీస్… ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో బలమైన నాయకుడిని తయారు చేసి, పార్టీని పటిష్టం చేస్తూ… అవసరమైనచోట్ల ప్రాంతీయ పార్టీలను వాడుకోవడం, తరువాత తప్పించడం… ఈ కార్యాచరణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… బీజేపీ లైన్ అది, మోడీ సొంత కార్యాచరణ కాదు… ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఎంతగా మోడీ పాపులారిటీ పట్ల అసహనంగా ఉన్నాసరే, ఇప్పటి బీజేపీ స్థితికి ప్రధాన కారకుడు మాత్రం కచ్చితంగా మోడీయే… మరో రెండు టరమ్స్ ఉంటాడా లేడానే చర్చ వదిలేస్తే… భారత రాజకీయాల్లో తనకంటూ ఓ విశిష్ట అధ్యాయం మాత్రం లిఖించుకున్నాడు… బహుశా ఆ భావనే ‘ఈ శతాబ్ది నాది’ అనిపించిందేమో తనతో… పైగా తనకు దీటైన ప్రజాదరణ ఉన్న నేత మరొకరు కనిపించడం లేదు బీజేపీలో… అవసరాన్ని బట్టి యడ్యురప్పకు ఈ వయోపరిమితి నుంచి మినహాయింపులు ఇచ్చింది కదా పార్టీ… జమిలి ఎన్నికల పరమార్థం కూడా ప్రాంతీయ పార్టీలను మరింత దెబ్బతీయడమే… సర్ ప్రక్రియ మీద నానారకాల విఫల పోరాటం చేసిన మమత, స్టాలిన్ తదితరులు కూడా రాబోయే పరిణామాల్ని అర్థం చేసుకుంటున్నారు, జమిలిపై ఆల్రెడీ వ్యతిరేక గళం విప్పుతున్నారు కూడా… లెఫ్ట్ కూడా నామమాత్రం అయిపోతున్న నేపథ్యంలో, రేపు కేరళలోనూ అధికారం కోల్పోతున్న స్థితిలో… ఇక రాబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలు కానున్నాయా..? రాహుల్ నాయకత్వం నుంచి బయటపడితే కాంగ్రెస్‌కు ఇంకాస్త మంచి రోజులు వస్తాయేమో..! ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్య ఆలయ నిర్మాణం, తక్షణ ట్రిపుల్ తలాఖ్ రద్దు వంటివి స్థూలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో ఉన్నా అవి సాకారం అవుతాయా అనే సందేహం సంఘ్ కేడర్‌లోనే ఉండేది… అవి సాకారం అయిపోయాయి… కామన్ సివిల్ కోడ్ వంటివి కొన్ని బాకీ ఉన్నాయి… అవీ అవుతాయి… అందుకే మోడీపై మోహన్ భగవత్ ఎంత రుసరుసలాడినా సరే, ఆ ఆగ్రహ ప్రభావం మోడీపై ఏమీ కనిపించడం లేదు… మోడీ తనకు పడకపోతే ఎవరినైనా ఎలా శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడో సంఘ్ అనుబంధ వీహెచ్పీ తొగాడియాకు తెలుసు… మరి మోహన్ భగవత్..? కాలం చెబుతుంది… చివరగా… నేను మరో ఆరు నెలలు ముఖ్యమంత్రిగా అదనపు కాలం పొందుతాను అని రేవంత్ రెడ్డి తన వాళ్లతో చెబుతున్నాడని రాధాకృష్ణ ఉవాచ… అంటే జమిలి ఎన్నికల కోసం ప్రస్తుత శాసనసభ పరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తారని సారాంశం… కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నది అదనపు ఆరు నెలలు కాదు, 2029 లో కూడా నేనే అని..!! బీజేపీ, బీఆర్ఎస్ కలవకపోతే, బీజేపీలోని వర్గ తన్నులాటలు ఆగకపోతే జరిగేది కూడా అదే..!!
P.Venkateswara Rao
867 వీక్షించారు
6 నెలల క్రితం
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *నిస్సంకోచంగా… నిర్మొహమాటంగా… బాలకృష్ణను కడిగేసిన రాధాకృష్ణ..❗❗* October 5, 2025🎯 సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకుకు పాఠకులు ఎక్కువ… ఏ ఇతర పత్రికల్లోనో కనిపించే సంపాదకీయ వ్యాసాలు చదివేవాళ్లే ఉండరు… ఉత్త నస… పసలేని రాతలు… ఐతే రాధాకృష్ణ వ్యాసాలకు అతి పెద్ద మైనస్… జగన్‌పై విషం, చంద్రబాబుపై భక్తి… సో, ఏపీ రాజకీయాలకు సంబంధించిన తన అభిప్రాయాలన్నీ వెయ్యి శాతం బయాస్డ్… తన వ్యాసాల్ని చదివేవాళ్లు అది తెలిసీ చదువుతూనే ఉంటారు… ఈసారి పూర్తి భిన్నం… ఈరోజు తను రాసిన వ్యాసం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్… బ్యాలెన్స్‌డ్… ఓ జర్నలిస్టుగా తన అనుభవం, తన పరిణతి కనిపించాయి… మామూలుగా తన వ్యాసాల్ని నిశితంగా విమర్శించే సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం ఈరోజు వ్యాసాన్ని మెచ్చుకుంటున్నారు తమ పోస్టుల్లో… కాస్త కటువుగా, పరుషంగా చెప్పాలంటే… బాలకృష్ణ బట్టలిప్పేశాడు… మామూలుగా బాలకృష్ణ మీద ఏదైనా రాయడానికి చాలామంది సంకోచిస్తుంటారు… కానీ ఆ క్యాంపు మనిషే అయి ఉండీ రాధాకృష్ణ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా కడిగేశాడు… తన వ్యాసంలోని కొన్ని వాక్యాలు ఇలా… ‘‘తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు – నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు. మూడో పర్యాయం. సభ మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి, రెండు జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమే! నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్లజోడును తలపైకి నెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం కచ్చితంగా అభ్యంతరకరమే. బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చునుగానీ ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్‌రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారేమో తెలియదు. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏక వచనంతో ఎవరినీ సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదుగానీ బాలకృష్ణ ‘వాడు వీడు’ అన్న పదాలను వాడారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడైనా బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైనా నష్టమైనా ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు, విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే’’ హవ్వ… నవ్విపోదురుగాక! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు… అని చంద్రబాబును చూసి కూడా జాలిపడ్డాడు రాధాకృష్ణ… బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా, ఆయన చిరంజీవికి కూడా ఫోన్‌ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది… అని బాలకృష్ణ మాటలతో చంద్రబాబు ఇలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు ఆర్కే… ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, కాపు కులజాఢ్యం ఎలా ప్రబలిందో ఘాటుగానే రాశాడు… నిజమే, కేవలం వాళ్ల కులస్తులు వోట్లేస్తేనే గెలుస్తారా ఈ కులరాజకీయ నేతలు..? టీడీపీ కమ్మ పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ, జనసేన కాపు పార్టీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేసేంతగా కులం- రాజకీయం కలగలిసిపోయి, దానికి ఫ్యానిజం తోడై… ఏపీ రాజకీయాలు నిజంగానే కంపు కొడుతున్నాయి..!! ఓ కొత్త విషయం తెలిసింది… ‘‘బాలకృష్ణను మాత్రమే కాదు– ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ కే.కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖరరెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా? కాదా? అన్నది వేరే విషయం…’’
P.Venkateswara Rao
620 వీక్షించారు
6 నెలల క్రితం
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *జగన్ ను అలా అనడం తప్పు.. బాలకృష్ణకు సభా మర్యాదలు తెలియవా❓* 05.10.2025🎯 అప్పట్లో ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల మీద నిషేధం ఉండేది.. ఇది కొంతకాలం పాటు సాగింది. ఇటీవల ఆ నిషేధం ఎత్తేశారు. చంద్రబాబు మీద ప్రేమ ఉండి.. బాలకృష్ణ మీద ద్వేషం కలగడం ఏంటో.. అసలు వేమూరి రాధాకృష్ణకు.. బాలకృష్ణకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు.. అందువల్లే కావచ్చు తాజా ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బాలకృష్ణ మీద అమాంతం లేచారు. మర్చిపోతున్న విషయాన్ని మరోసారి గెలికారు. సింపుల్ గా చెప్పాలంటే మానిపోతున్న గాయం మీద కారం వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల శాసనసభలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సైకో గాడు అంటూ మండిపడ్డారు. స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని జుట్టు మీద గాగుల్స్ పెట్టుకొని.. అలా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటని అవి సభ మర్యాదలు ఎలా అవుతాయని రాధాకృష్ణ ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయి అంటూ వాపోయారు. “బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు.. నాటి నగర కమిషనర్ ఆర్పి సింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదుట ఒక నివేదిక ఉంచారు. ఆ నివేదికను చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నవ్వి ఊరుకున్నారు.. చర్యలు ఏమొద్దులేవయ్యా అంటూ నగర కమిషనర్ కు సూచించారు. నాటి ఆ ఘటనలో బాలకృష్ణను కాపాడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణకు కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నది జగన్.. బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి” ఇలా కీలక విషయాలను బయటపెట్టారు వేమూరి రాధాకృష్ణ. బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని.. పేరుకు పరామర్శ అయినప్పటికీ.. అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని వేమూరి రాధాకృష్ణ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆయనను చల్లపరచడానికే చంద్రబాబు ప్రయత్నించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు.. బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు. కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రాధాకృష్ణ బయటపెట్టారు. రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాసం రాశారు కాబట్టి దీనిని వైసిపి నాయకులు మరింత ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే తొలిసారి ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ బాధిత పక్షంగా కనిపించారు కాబట్టి వైసిపి ఊరుకోదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం వదులుకోవడం లేదు. కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ప్రచురిస్తున్నారు. తన చానల్లో ప్రసారం చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా రాధాకృష్ణ వెనుకాడటం లేదు. రాధాకృష్ణలో ఈ మార్పును చూసిన కూటమినేతలు ఆశ్చర్యపోతున్నారు. తాజా కొత్త పలుకులో కూడా వేమూరి రాధాకృష్ణ అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు. దీంతో కూటమినేతలకు మరోసారి షాక్ తగిలినట్టే. అన్నట్టు ఏపీలో కులాల కుంపట్లు ఇప్పుడే కొత్తగా ఉన్నాయా.. గతంలో లేవా.. కులాల కుంపట్ల మీద చలికాచుకున్న వారిలో ఎంతమంది లేరు.. ఇప్పుడే ఏపీలో ఆ జాడ్యం మొదలైనట్టు రాధాకృష్ణ చెప్పడం భలే వింతగా ఉంది.