ఆది గురువు జగద్గురు శ్రీ ఆదిశంకరచార్యులు వారి జయంతి నేడు

🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
651 వీక్షించారు
16 గంటల క్రితం
*శ్రీ ఆదిశంకరాచార్య జయంతి* ఆది శంకరుల జన్మస్థలం కేరళ రాష్ట్రంలోని కాలడి. ఆయన క్రీ.పూ. 509వ సంవత్సరంలో నందన నామసంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద నక్షత్రంలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మించారు. శంకరుడంటే కారణజన్ముడు. జగద్గురువు. వివిధ దేవీదేవతలపై స్తోత్రాలు రచించారు కాబట్టి కేవలం కవి కాదు. వేదాంతానికి చెందిన ప్రకరణ భాష్యాలను ప్రవచించారు కాబట్టి పండితుడు, వైరాగ్య పూర్ణుడైన తత్వవేత్త మాత్రమే కాదు. ధర్మస్థాపకుడు. ఆసేతుశీతాచలం ఆర్యావర్తమంతా గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేసినవాడు. ఆ సిద్ధాంతాన్ని ఆదిశంకరులు స్తోత్రాలుగా, ఉపదేశాలుగా, ప్రకరణాలుగా, భాష్యాలుగా... ఇలా పలురకాలుగా విడమరిచారు. అద్వైతాన్ని ఒక జీవనవిధానంగా అలవాటు చేసేందుకు గానూ దేశానికి నాలుగువైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. కంచిలో మూలామ్నాయ శంకరపీఠాన్ని నెలకొల్పారు. భారతీయుల తత్త్వదర్శనాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు. __________________________________________ HARI ✍🏻🙏 __________________________________________ #🌅శుభోదయం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి #😃మంచి మాటలు