revanthanna #revanthreddy #Congress party

జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
572 views
4 days ago
💐 వివాహ వేడుకలకు హాజరైన ప్రజా ప్రతినిధులు 💐 13.04.2026 - సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈరోజు వివాహ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ శుభకార్యాలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాద్ బాబు గారు, భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ గారు, గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు హాజరై వేడుకలకు ప్రత్యేక కాంతిని చేకూర్చారు. అశ్వారావుపేట మండల కేంద్రంలో ఇటీవల వివాహం జరిగిన శీమకుర్తి కైలాష్ నాథ్ – వనజ దంపతుల కుమారుడు సంజీవ్ మరియు కుసుమ ధనలక్ష్మి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం మొద్దులమడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చిప్పల బాబురెడ్డి – దేవి దంపతుల కుమారుడు పండురెడ్డి మరియు మేఘమాల వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి హృదయపూర్వకంగా దీవించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ✨ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
532 views
5 days ago
*బూత్ స్థాయిలో బలపడే కాంగ్రెస్ – సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జారె పిలుపు* 📅 12.04.2026 – ఆదివారం *అశ్వారావుపేట నియోజకవర్గం* దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో గౌరవ *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్ష సమావేశం* ఉత్సాహంగా జరిగింది. ఇటీవల నియమితులైన 184 మంది బూత్ ఏజెంట్లకు పార్టీ విధి విధానాలు, బాధ్యతలు, గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసే విధానం పై ఎమ్మెల్యే గారు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా టీపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఐదు మండలాల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 👉 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా ప్రతి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు 18 ఏళ్లు పూర్తైన ప్రతి యువకుడికి ఓటు హక్కు కల్పించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు 👉 అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో బూత్ ఏజెంట్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. సమావేశంలో నాయకుల అభిప్రాయాలు సేకరించి, పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలపై చర్చించారు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
8.5K views
5 days ago
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ నెల చివర్లో లేదా మే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
560 views
7 days ago
*ఆదివాసీ ఆత్మగౌరవానికి అంకితమైన ప్రభుత్వం… సంస్కృతి పరిరక్షణకు సంకల్పబద్ధం — ఎమ్మెల్యే జారె* 10.04.2026 - శుక్రవారం భద్రాచలం గిరిజన భవనంలోని సకినం రామచంద్రయ్య గారి ప్రాంగణం ఆదివాసీ సంస్కృతి వైభవంతో కళకళలాడింది. నిర్వహించిన ఆత్మీయ సాంస్కృతిక సమ్మేళనంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ *శాసనసభ్యులు జారె ఆదినారాయణ గారు* పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కోయ ఇలవేల్పుల చరిత్రను ప్రతిబింబించే గ్రంథాన్ని ఘనంగా ఆవిష్కరించారు. భద్రాచలం ఐటిడిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్ గారు రచించిన ఈ పుస్తకంపై ఎమ్మెల్యే జారె ప్రశంసలు కురిపిస్తూ, గిరిజనుల గొప్ప చరిత్రను సంకలనం చేసి భవిష్యత్ తరాలకు అందించడం ఒక సేవగా అభివర్ణించారు. ఈ వేడుకకు రాష్ట్ర *గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా మరియు స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క (అనసూయ)* గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి మరింత గౌరవం చేకూర్చారు. భద్రాచలం *ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* గారు సహా పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడుతూ— ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు మన సమాజానికి అమూల్యమైన వారసత్వమని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోయ సమాజ చరిత్రను అక్షరరూపంలో నిలిపిన ఈ గ్రంథం భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంకా, గిరిజన సమాజ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు గిరిజనుల ఐక్యతను బలోపేతం చేస్తాయని, వారి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంచుతాయని ఆయన అన్నారు. 👉 సంస్కృతిని కాపాడితేనే సమాజం నిలుస్తుంది… అదే ప్రభుత్వ లక్ష్యం! #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
667 views
7 days ago
*గ్రామీణ ఆరోగ్యం – పోషణకు అంగన్వాడీ సిబ్బందే బలమైన అస్తంభం… ఎమ్మెల్యే జారె* 10.04.2026 – శుక్రవారం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల *మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క (అనసూయ)* గారి సమక్షంలో, జిల్లా కలెక్టర్ అంకిత్ గారి అధ్యక్షతన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* గారితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ— గ్రామాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం మరియు పోషణ పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అమూల్యమని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లు వారి సేవలకు టెక్నాలజీతో కూడిన కొత్త బలం ఇస్తాయని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన వివరాలను వేగంగా నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని అన్నారు. గ్రామీణ మహిళా శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటి విజయవంతమైన అమలులో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అందజేసిన స్మార్ట్ ఫోన్లను సమర్థంగా వినియోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
The PUBLIC VOICE Media
863 views
7 days ago
👇🗳️ పరిషత్ ఎన్నికల సందడి మొదలు | Rajh News 👉 మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. 👉 సీఎం రేవంత్ రెడ్డి నుంచి PCC కి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. 👉 పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉన్నారు. 👉 ప్రజల్లో ఉండి, స్థానిక సమస్యలపై పనిచేసే నాయకులకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం. 👉 దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల హడావుడి మొదలైంది. ------ 📢 Rajh News – ప్రజల గొంతు 👉 నిజం కోసం… న్యాయం కోసం… ------ 📲 For News | Ads | Promotions 📞 9666033449 👉 Follow | ❤️ Like | 🔁 Share | 🔔 Subscribe ------ #TelanganaPolitics #Congress #RevanthReddy #ParishadElections #PoliticalNews RajhNews BreakingNews ##RAJHన్యూస్ ##TelanganaPolitics #Congress #RevanthReddy #ParishadElections #PoliticalNews #RajhNews #BreakingNews
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
590 views
8 days ago
🌾 *రైతుకు భరోసా… ధాన్యానికి హామీ — ప్రభుత్వం సిద్ధం* 🌾 *సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ప్రకటన* 📅 09-04-2026 | బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలం — అన్నపురెడ్డిపల్లి, జానకిపురం, కట్టుగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు రిబ్బన్ కట్ చేస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు, *“రైతు చెమటకు సరైన విలువ — ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది”* అని భరోసా ఇచ్చారు. 🔹 *ముఖ్యాంశాలు:* ✔️ రైతులకు ప్రకటించిన మద్దతు ధర తప్పక అందాలి — అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ✔️ దళారుల జోక్యం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ ✔️ కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరి ✔️ నాణ్యత పరీక్షల్లో రైతులకు అన్యాయం జరగకుండా పారదర్శక విధానం ✔️ తేమ శాతం విషయంలో నిబంధనల ప్రకారం న్యాయం ✔️ గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సకాలంలో కొనుగోలు ప్రక్రియ 💬 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు: “రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతు కష్టానికి గౌరవం ఇవ్వడం మా బాధ్యత.” 👥 ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మండల అధికారులు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
681 views
8 days ago
చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొ ఎమ్మెల్యే జారె #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
జారె ఆదినారాయణ ఎమ్మెల్యే ఫాలోవర్స్
566 views
8 days ago
*దిశాకమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే జారె* 08.04.2026 – బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, జిల్లా దిశా కమిటీ అధ్యక్షులు రామసహాయం రఘురాం రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొని అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను స్పష్టంగా అధికారుల ముందుంచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, గృహనిర్మాణం, విద్య మరియు వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. పోడు భూముల సమస్యలు, విద్యుత్ లోపాలు, ఆరోగ్య సేవల లోపాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజల ఇబ్బందులు తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. “ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకం పారదర్శకంగా, వేగంగా అమలు కావాలి” అనే దృఢసంకల్పంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
Adhithya Newsline
2.1K views
27 days ago
6 గ్యారంటీలకు చట్టబద్ధతే లాభం: KTR💥 #ktr #6guarantees #తెలంగాణన్యూస్# ##revanthreddy #reels