రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
585 views
4 days ago
అన్ని దానాలలో కెల్లా రక్తదానం మిన్న - రక్తదానం ప్రాణదానంతో సమానం! లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) వారు నేటి యువత రక్తదానంలో ముందుండాలని పిలుపును ఇచ్చారు! నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం ( 14 - 6 - 2026).ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని ' రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా నిలుద్దాం ', ' మనమిచ్చే రక్తం - వేరొకరికి జీవితం ', ఒకరి దానం - మరొకరికి ప్రాణం ' అనే సామాజిక నినాదాన్ని ఈ సందర్బంగా మనం ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క మానవాళి భుజస్కంధాలపై ఎంతైనా వుంది. ముఖ్యంగా ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026, సమాజంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేస్తుంది.' రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి ' అనే థీమ్ తో,ఈ రోజు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రక్తదానం చేసి,మరొకరి అమూల్యమైన,విలువైన ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది.ఓక విధంగా చెప్పాలంటే రక్తదానం అనేది ఓక చిన్న కార్యం కాదు, ఇది సమాజంలో సామరస్యాన్ని,సోదరభావాన్ని,జీవన ఆశను నింపే గొప్పతనం.అంతేకాదు 18 - 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన వ్యక్తులు స్వచ్చందంగా రక్తదానం చేయాలని ( WHO) ' ప్రపంచ ఆరోగ్య సంస్థ ' వారు సైతం ప్రత్యేకంగా కోరుతున్నారు అంటే రక్తదానం ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే ఊహించవచ్చు. అదేమాదిరి రక్తదానం చేయడానికి ముందు దాతలు తమ రక్త గ్రూవ్ ను తెలుసుకోవడం,సమీప రక్త బ్యాంకులో నమోదు చేసుకోవడం అత్యవసరమైన ప్రక్రియ.ముఖ్యంగా ఈ రోజున రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్లు,బహుమతులు సైతం అందజేసి దాతలను మరింతగా ప్రొత్సహిస్తూన్నది కూడా.అలాగే రక్తదానం అనేది కేవలం ఇతరులకు సహాయపడటమే కాదు, రక్తదాతలకు సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.అదేలా అంటే రక్తదానం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు,ఇనుము స్థాయిలు సైతం సమతుల్యంగా ఉంటాయి.తద్వారా గుండె జబ్బులు,కొన్ని రకాల క్యాన్సర్ ల ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.ఇక ఒక్కసారి రక్తదానం చేసిన వారి అనుభవాలను మనం పరిగణలోకి తీసుకుంటే రక్తదానం చేయడం మూలాన రక్తదానం చేసిన దాతలలో చురుకుదనం,ఆరోగ్యం మెరుగైనట్లు వారు చాలా స్పష్టంగా సెలవిచ్చారు.అందువల్లే ఈ ప్రత్యేక రోజున ఆసుపత్రులు,రక్త బ్యాంకులు దాతలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను సైతం అందిస్తుండటం ఎంతైనా హర్షణీయం,అభినందనీయం. ఏదిఏమైన భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాలలో రక్తం కొనుగోలు లేదా కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతుండటం అత్యంత బాధాకరమైన విషయం.ఇక ( WHO ) ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం,తక్కువ,మధ్య ఆదాయ దేశాలలో రక్త సరఫరా కొరత తీవ్రంగా ఉండటం,అక్కడ 1000 మందికి కేవలం 5 - 6 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉండటం అనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.ఏమైనా ఈ ప్రదాన సమస్యను అదిగమించడానికి,ఈ రక్తదాన దినోత్సవం సందర్బంగా భారతదేశంలోని రెడ్ క్రాస్ సొసైటీ,రోటరీ క్లబ్ ల వంటి దేశవ్యాప్తంగా పేరుమోసిన సామాజిక సేవాసంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుండటం ఎంతైనా ఓక ఆహ్వానించదగ్గ పరిణామం.అన్నింటికి మించి (WHO) ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు సెలవిచ్చేది ఏమంటే నేటి యువత రక్త దానంలో ముందుండాలని,మన భారతదేశంలో 18 - 25 సంవత్సరాల వయస్సు గల యువకులు రక్త దానంలో పాల్గొంటే,రక్తం కొరతను గణనీయంగా తగ్గించవచ్చు అనే ప్రధానాంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రక్తదానం అనేది ఓక సామాజిక భాద్యతగా భావించి ఈ మహోన్నత,మహాత్తర పనికి పూనుకుంటే మరెందరికో పునర్జీవితాన్ని మనం అందిఇచ్చినవారమవుతాము.తద్వారా ఎనలేని పుణ్యఫలం సైతం వారికి లభించడం తథ్యం.' మానవసేవే మాధవసేవ ' లాగా ' రక్తదానసేవే మాదవసేవ' గా ప్రతి ఒక్కరూ భావిస్తే అంతకుమించిన గొప్ప కార్యం,పరోపకారం ఈ భూమ్మీద మరొకటి మనకు ఉండదు అనే మాట సత్యదూరం కాదు. జైహింద్! మేరా భారత్ మహాన్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! - #🌍ప్రపంచ రక్తదాన దినోత్సవం 🔴