శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K views
29 days ago
శ్రీ లలితా దేవి పంచవింశతి నామ స్తోత్రం (25 నామాల స్తోత్రం) బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నుండి తీసుకోబడినది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశించిన ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది... అగస్త్య ఉవాచ వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతినామభిః | లలితాపరమేశాన్యా దేహి కర్ణరసాయనమ్ || 1 || హయగ్రీవ ఉవాచ సింహాసనేశీ లలితా మహారాజ్ఞీ పరాంకుశా (లేదా వరాంకుశా) చాపినీ త్రిపురా మహాత్రిపురసుందరీ సుందరీ చక్రనాథా సామ్రాజ్ఞీ (లేదా సామ్రాజీ) చక్రిణీ చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తినీ మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కులనాథా ఆమ్నాయనాథా (లేదా అమ్నాయనాథా) సర్వామ్నాయనివాసినీ శృంగారనాయికా పారాయణం ఫలితాలు (ప్రయోజనాలు) ఈ 25 నామాలు భక్తిపూర్వకంగా నిత్యం పఠించడం వలన: అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అష్టసిద్ధులు (అణిమా, మహిమా మొదలైనవి) లభిస్తాయి. అఖండ సౌభాగ్యం, సంపద, ఆరోగ్యం, కీర్తి, యశస్సు, ఉన్నత అధికారాలు వస్తాయి. మనసుకు శాంతి, ఆధ్యాత్మిక ప్రగతి, సర్వాభీష్ట సిద్ధి కలుగుతాయి. స్త్రీలు చేయడం ద్వారా ఆహ్లాదం, ఆనందం, అందం, ఆకర్షణ, ఐశ్వర్యం పెరుగుతాయి.. లలితా సహస్రనామ పారాయణంతో సమానమైన ఫలితం ఇస్తుందని హయగ్రీవ స్వామి అగస్త్య మహా ముని కి ఉపదేశించారు .. (కానీ చిన్నది, సులభంగా పఠించవచ్చు). ఇప్పుడు లలిత దేవి నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రులలో పారాయణం చేయడం అత్యుత్తమం పది ఇంతల ఫలితం ఉంటుంది ... #తెలుసుకుందాం #శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #వసంత నవరాత్రులు💐🎂 #వసంత నవరాత్రులు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.7K views
1 months ago
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు" లేదా "అందరూ ఆమెను పూజించలేరు" అని ఎందుకు అంటారంటే: #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి #వసంత నవరాత్రులు💐🎂 #వసంత నవరాత్రులు #చైత్ర వసంత నవరాత్రులు 🙏 1. పూర్వజన్మ సుకృతం:- శాస్త్రాల ప్రకారం, "జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే" - అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. 🙏 2. అమ్మవారి పిలుపు (The Calling):- మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితా దేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో.. అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. 🙏 3. మానసిక పరిపక్వత:- లలితా దేవి "జ్ఞాన స్వరూపిణి". అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితా దేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో, వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది. 🙏 4. గురువు మరియు సంకల్పం:- కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లు లెక్క. మన సంకల్పం బలంగా ఉంటే, ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది. 👍 అమ్మవారు మీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? అమ్మవారు అందరికీ తల్లి. తల్లి బిడ్డ దగ్గరకు రాకుండా ఉండదు. కాకపోతే మనం ఆమెను పిలిచే విధానంలో "కపటం" ఉండకూడదు. ✨ రోజూ "శ్రీమాత్రే నమః" అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనండి. ✨ అమ్మవారిని ఒక చిన్న పాపలా భావించి మీ ఇంట్లో అలంకరించుకోండి. ✨ కఠినమైన నియమాల కంటే నిజాయితీ గల భక్తిని ఆమె ఇష్టపడుతుంది.
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
714 views
2 months ago
మాఘపూర్ణిమ శ్రీలలితా జయంతి..................!! ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత. పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీలలితాదేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మఘము..అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవకార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైనరోజు మాఘ పౌర్ణమి. దీన్నే 'మహా మాఘి'అని కూడా అంటారు. ఈరోజున చేసే సముద్ర,నదీ స్నానాలు,పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితాదేవి ఆవిర్భావగాథ దేవీపురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి, ప్రత్యక్ష మయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే.. ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వరగర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక..... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహాయాగం చేశారు. ఆ హోమగుండంనుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి, శ్రీచక్రాన్ని అధిష్ఠించి, భండాసురుణ్ణి సంహరించింది. ఆమె రౌద్రరూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే.. శ్రీలలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏరూపంలో పూజించినా లలితాసహస్రనామాన్ని పఠిస్తారు. అరుణవర్ణంలో ప్రకాశిస్తూ, పాశాన్నీ, అంకుశాన్నీ, పుష్పబాణాలనూ,ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీలలితాదేవిని భయాన్ని పోగొట్టి, శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ, పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళల్లో ప్రావీణ్యాన్నీ, కుటుంబసౌఖ్యాన్నీ, ప్రశాంతతనూ, సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి శ్రీలలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమిరోజున పవిత్రస్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్టసిద్ధి కలుగుతుందనీ, అలాగే ప్రాతః స్మరామి లలితా వదనార విందం.. అంటూ ప్రారంభమయ్యే శ్రీలలితా పంచరత్నస్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట. సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. #తెలుసుకుందాం #🕉️శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి🙏 #శ్రీ లలితా జయంతి #లలితా దేవి #శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి